ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?

జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం…

కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్

కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫిన్ తునా’ చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ సముద్ర జలాల్లో ఈదుతుండగా ఫుకుషిమా రేడియేషన్ కాలుష్యాన్ని గ్రహించిన తునా చేపలు అనంతరం కాలిఫోర్నియా తీరానికి వచ్చి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చేపల్లోని కాలుష్యం ప్రమాదకరం కాదనీ, అయితే వలస వెళ్ళే సముద్ర జీవుల ద్వారా కాలుష్యం ఎంతటి దూరానికైనా చేరవచ్చన్నదీ తమ పరిశోధన చెబుతోందని వారు తెలిపారు. మార్చి 11, 2011 తేదీన జపాన్ లో పెద్ద…

లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్,…

రెండో భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది.…

మొదటి భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

గత సంవత్సరం మార్చి 11 తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20 మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం, సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు…

కాలిఫోర్నియా సముద్ర మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్

అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో జపాన్ ఫుకుషిమా అణు ప్రమాదానికి చెందిన రేడియేషన్ చేరుకుందని వెల్లడయింది. ఫుకుషిమా దై-చి అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన నెల రోజులకే రేడియేషన్ అమెరికా తీరానికి వచ్చిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీనితో అనేక సంస్ధలు, పర్యావరణ ఉద్యమవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని తేలింది. ఫుకుషిమా ప్రమాదం అనంతరం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సి.ఎస్.యు), లాంగ్ బీచ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరంజ్ కౌంటీ, శాంతా క్రాజ్…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

మార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఫుకుషిమా ప్రమాదం…

భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

ఫుకుషిమా అణు కర్మాగారం కార్మికులకు ‘స్టమక్ ఫ్లూ’

భూకంపం, సునామీల బారినపడి ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు కర్మాగారం లో శుభ్రపరిచే పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో డజన్లమందిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద పరిస్ధితి స్ధిర దశకు (స్టబిలిటీ) వచ్చిందని జపాన్ ప్రధాని ప్రకటించిన మరుసటిరోజే కార్మికులు జబ్బుబారిన పడడం విశేషం. అణు ప్రమాదం కారణంగా కర్మాగారంలో విడుదలైన రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరిచే కార్యక్రమంలో కార్మికులు అనేక నెలలుగా నిమగ్నమై ఉన్నారు. కార్మికులకు…

జపాన్ పాలపొడి డబ్బాల్లో రేడియేషన్

జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున…

యూరప్ దేశాల్లో రేడియేషన్ ఆనవాళ్లు, ఫుకుషిమా కారణం కాదన్న ఐ.ఎ.ఇ.ఎ

యూరప్ లో అనేక చోట్ల వాతావరణంలో రేడియో ధార్మికత కనుగొన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఎ.ఇ.ఎ) సంస్ధ శుక్రవారం వెల్లడించింది. 11.11.11 తేదీన ప్రపంచ ప్రజలందరికీ శుభం జరుగుతుందని కాలజ్ఞానులు చెబుతున్న నేపధ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. రేడియో యాక్టివ్ అయోడిన్ – 131 మూలకానికి సంబంధించిన రేడియేషన్ తక్కువ స్ధాయిలో చెక్ రిపబ్లిక్ వాతావరణంలో కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ తెలిపింది. చెక్ రిపబ్లిక్కే కాక యూరప్ లోనే అనేక దేశాల్లో ఈ రేడియేషన్ కనిపించిందని…

లేని బాధ్యతను నెత్తినేసుకున్న అబ్దుల్ కలాం?

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తూ ఆయన, ప్రముఖంగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆదివారం ఏకంగా కుదంకుళం ప్లాంటు సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లపైన ఏర్పడిన భయాలను పారద్రోలే పనిలో అబ్దుల్ కలాం…