పాఠకులను తప్పుదారి పట్టించడం ఎకాలజిస్టు ‘అచంగ’ కు తగని పని

ఏప్రిల్ మొదటివారంలో నేనొక వార్తలో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల వెలువడిన రేడియేషన్ అమెరికా, యూరప్ లకి కూడా వ్యాపించిందని ఒక వాక్యం రాశాను. దానికి అచంగ గారు అభ్యంతరం చెప్పారు. ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లవరకూ వచ్చిందనడానికి ఆధారాలు లేవనీ, ఆధారాలు చూపిస్తే తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటానని రాశారు. తాను వృత్తిరీత్యా ఎకాలజిస్టు కావడమే తన సవాలుకు అర్హత అన్నారు. ఆయన సవాలును పక్కనబెట్టి ఆధారాలు మాత్రం ఇస్తానని చెప్పాను. చెప్పినట్లే ఏప్రిల్…

ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…

ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్,…

రెండో భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది.…

మొదటి భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

గత సంవత్సరం మార్చి 11 తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20 మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం, సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు…

కాలిఫోర్నియా సముద్ర మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్

అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో జపాన్ ఫుకుషిమా అణు ప్రమాదానికి చెందిన రేడియేషన్ చేరుకుందని వెల్లడయింది. ఫుకుషిమా దై-చి అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన నెల రోజులకే రేడియేషన్ అమెరికా తీరానికి వచ్చిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీనితో అనేక సంస్ధలు, పర్యావరణ ఉద్యమవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని తేలింది. ఫుకుషిమా ప్రమాదం అనంతరం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సి.ఎస్.యు), లాంగ్ బీచ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరంజ్ కౌంటీ, శాంతా క్రాజ్…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

మార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఫుకుషిమా ప్రమాదం…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని…

25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…

అమెరికా అణు ప్లాంట్ల వద్ద ఇపుడున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు -టాస్క్ ఫోర్స్

జపాన్‌లొ మార్చిలో సంభవించిన భూకంపం సునామీల వలన ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత అమెరికా ప్రభుత్వం తమ అణు కర్మాగారాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అణు నియంత్రణ కమిషన్‌ (న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ – ఎన్.ఆర్.సి) ను ఆదేశించింది. ఎన్.ఆర్.సి అందుకోసం నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని నియమించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన నివేదికను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ సంపాదించగా ‘ది హిందూ’ పత్రిక అందులో కొన్ని అంశాలను…