ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

గడ్డాఫీకి మద్దతుగా లిబియా ప్రజలు?

  Retreating rebels in Libya పశ్చిమ దేశాల వైమానిక దాడులు లేకుండా లిబియా తిరుగుబాటు బలగాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. మంగళవారం లండన్ లో లిబియా విషయమై ప్రపంచ దేశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటు బలగాలపై గడ్డాఫీ బలగాలు భారీగా దాడి చేశాయి. దానితో లిబియా తిరుగుబాటు దారులు సిర్టే పట్టణం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వదిలేసి తూర్పువైపుకు పలాయనం ప్రారంభించారు. సిర్టే పట్టణ…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…

యెమెన్ నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఆరుగురు మృతి

ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై  మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

రెండో రోజూ కొనసాగిన ట్యునీషియా ప్రదర్శనలు

శుక్రవారం “ఆగ్రహ దినం” గా పాటిస్తూ రాజధాని ట్యునిస్ లో లక్ష మందితో సాగిన ప్రజా ప్రదర్శనలు శనివారం కూడా కొన సాగాయి. శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు జరిపారు. ప్రదర్శకుల రాళ్ళ దాడిలో పోలీసులు కూడ గాయ పడ్డారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గా ఉన్న ఘన్నౌచీ రాజీనామా కోరుతూ ట్యునీషియా ప్రజలు ఆందోళనలు జరుపుతున్నారు. కొంతమంది రాజధాని ట్యునిస్ లో గుడారాలు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి, పదవీచ్యుతుడైన…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…