బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు

  42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను…

లిబియా పోలీసు కాల్పుల్లో వందల మంది మృతి, చెదరని గడ్డాఫీ ఆధిపత్యం

లిబియాలో సైనికులు ఆందోళన చేస్తున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించడమో, గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మరణించినదీ ఖచ్చితమయిన సంఖ్య తెలియటం లేదు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని దాదాపుగా అడ్డుకోవటం, మీడియా పై అనేక ఆంక్షలు అమలులో ఉండటంతో ఆందోళనలు, కాల్పులకు సంబంధించిన వివరాలను ధృవపరిచేవారు లేరు. రెండు వందల మందికి పైగా చనిపోయారని ఆసుపత్రి డాక్టర్లను ఉటంకిస్తూ బిబిసి తెలియజేయగా, అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్…

లిబియాలో “ఆగ్రహ దినం”, పోలీసు కాల్ఫుల్లో 24 మంది మరణం

లిబియాలో గురువారం, ఫిబ్రవరి 17 న ప్రజలు “ఆగ్రహ దినం” (డే ఆఫ్ రేజ్) పాటించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. అయితే ఆ వార్తలను అవి ధృవీకరించలేక పోతున్నాయి. పత్రికా విలేఖరులకు ఎటువంటి సమాచారం ప్రభుత్వ వర్గాలు అందించక పోవటం వలన పౌరులు చెప్పిన విషయాలను ప్రచురించాయి. రాజధాని ట్రిపోలి తప్ప ఇతర పట్టణాల్లోని కనీసం ఐదింటిలో ప్రజలు వీధుల్లోకి వచ్చినట్ల గా బిబిసి, రాయటర్స్, ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధలు పౌరులను ఉటంకిస్తూ తెలిపాయి. అమెరికా సంస్ధకు…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

ఈజిప్టు తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా?

దాదాపు ముప్ఫై మంది వరకు అమరులై పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈజిప్టు ప్రజల నియంతృత్వ వ్యతిరేక తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా అన్న అనుమానం ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలకులతో పాటు ఈజిప్టు ప్రజలను సైతం పట్టి పీడిస్తోంది. తిరుగుబాటు లేవనెత్తిన ప్రధాన డిమాండు ప్రజాస్వామ్య పరిపాలన రావాలని. పార్టీలు ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ, సంఘాలు నిర్మించుకొనే స్వేచ్ఛ కావాలని తిరుగుబాటుదారులు మనసారా కోరుకున్నారు. ఆ డిమాండ్లు నెరవేరుతాయా లేదా అన్న అనుమానాలు…

బహ్రెయిన్ ను తాకిన అరబ్ ప్రజా ఉద్యమ కెరటం

  ట్యునీషియాలో జన్మించి ఈజిప్టులొ ఇసుక తుఫాను రేపి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను గడ గడా వణికిస్తున్న అరబ్ ప్రజా ఉద్యమ మహోత్తుంగ తరంగం అరేబియా అఖాతంలో ఓ చిన్న ద్వీప దేశం ఐన బహ్రెయిన్ ను సైతం తాకింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో దశాబ్దాల పాటు అధ్యక్షులుగా చెలామణి అవుతూ వచ్చిన నియంతృత్వ పాలకులను కూలదోసిన ఈ పోరాట తరంగం ఇప్పుడు బహ్రెయిన్ లో మత వివక్షకు వ్యతిరేకంగా, రాజకీయ సంస్కరణల కోసం ప్రజలను వీధుల్లోకి లాక్కొచ్చింది.…

సమ్మెలకు ఉద్యుక్తులవుతున్న ఈజిప్టు కార్మికులు, ఉద్యోగులు

ముబారక్ నియంతృత్వ పాలనకు పద్దెనిమిది రోజుల ఆందోళనతో తెర దించిన స్ఫూర్తితో ఈజిప్టులోని వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి కూడా. సోమవారం సెంట్రల్ కైరోలో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ అలెగ్జాండ్రియా’ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వందల మంది కార్యాలయం బయట చేరుకుని తమ అధికారులను పదవి నుండి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ముబారక్ ను వెళ్ళిపొమ్మన్నట్లే వారిని…

నిష్క్రమించిన ఆందోళనకారులు, కొన్ని డిమాండ్లు నెరవేర్చిన మిలట్రీ పాలకులు

  ఆందోళనకారుల డిమాండ్లలో కొన్నంటిని మిలట్రీ పాలకులు నెరవేర్చడంతో వారు విమోచనా కూడలిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళడానికి నిరాకరించిన కొద్దిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా మిలిట్రీ కౌన్సిల్ ప్రకటించింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా అనేక పార్టీలను ముబారక్ ఎప్పటిలాగే నిషేధించడంతో పార్లమెంటులో అత్యధికులు ముబారక్ పార్టీవారే మిగిలారు. ముబారక్ పార్టీ యధేఛ్చగా రిగ్గింగ్ చేసే అచారం ఈజిప్టులో ఉంది. అందువలన పార్లమెంటును…

విమోచనా కూడలిని వదలని ఈజిప్టు ఆందోళనకారులు, పెదవి విప్పని సైన్యం

  ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…

సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…