విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం

ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్స్

యూరోపియన్ పార్లమెంటు లిబియాలోని తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఫ్రాన్సు మొదటిసారిగా అందుకు అనుగుణమైన చర్యను తీసుకొంది. లిబియా తూర్పు ప్రాంతంలోని బెంఘాజీ పట్టణం కేంద్రంగా ఏర్పడిన “లిబియా జాతీయ కౌన్సిల్” ను అధికారిక స్టేట్ బాడీగా ఫ్రాన్సు గుర్తించింది. యూరోపియన్ పార్లమెంటు దేశాల ప్రభుత్వాలను కాకుండా రాజ్యాన్ని గుర్తిస్తాయి. అందువలన అది తన సభ్య దేశాలను తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందిగా కోరింది. తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కౌన్సిల్ తో సంబంధాలు…

తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…

అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం

  అమెరికాలో విస్ కాన్సిన్ రాష్ట్రంలో ఈజిప్టు తరహాలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు మొదలయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మూడు వారాలనుండీ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అక్కడ ఏమీ జరగనట్లుగా నాల్రోజుల క్రితం వరకూ నటిస్తూ వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రత్యక్షంగా కారణమైన అమెరికాలోని ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలపై చర్య తీసుకోవటం అటుంచి ‘స్టిములస్ ప్యాకేజీ’ పేరుతో రెండు ట్రిలియన్లకు పైగా ప్రజల సొమ్మును వాటికి ధారపోసిన సంగతి…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

లిబియాలో కొనసా…గుతున్న అంతర్యుద్ధం

  లిబియాలో తిరుగుబాటుదారులకు గడ్డాఫీ బలగాలకు మధ్య యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరే స్ధితి కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య పట్టణాలు చిక్కుతూ, జారుతూ ఉన్నాయి. మూడు లక్షల జనాభా గల మిస్రాటా పట్టణం దగ్గర భీకర పోరు నడుస్తోంది. “బిన్ జావాద్” పట్టణం ఆదివారం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండగా సోమవారం అది గడ్డాఫీ బలగాల ఆధీనంలోకి వచ్చింది. తిరుగుబాటుదారులు చేతిలో ఉన్న మరో పట్టణం స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. గడ్డాఫీ బలగాలకు యుద్ధ…

లిబియా అంతర్యుద్ధం – లిబియా ఆయిల్ కోసం అమెరికా, ఐరోపా కుతంత్రాలు

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ప్రజా ఉద్యమాలు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో  లిబియా ప్రజలు 41 సంవత్సరాల నుండి ఏలుతున్న గడ్డాఫీని వదిలించుకోవడానికి నడుం బిగించారు. ఫిబ్రవరి 16 న లిబియాలోని రెండో పెద్ద పట్టణం బెంఘాజీ నుండి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంఘాజీని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు కొద్దిరోజుల్లోనే లిబియా తూర్పుప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ట్రిపోలిలో…

తెలంగాణ ఉద్యోగుల “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమణ

తెలంగాణ ఉద్యోగులు 16 రోజులనుండి చేస్తున్న “సహాయ నిరాకరణ” ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుండి విధుల్లో చేరాలని తెలంగాణ ఎన్జీఓల సంఘం నాయకుడు స్వామి గౌడ్ ఉద్యోగులను కోరాడు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక సెక్షన్ ఉద్యమం విరమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమించినందుకు ఆగ్రహంతో స్వామి గౌడ్ దిష్టి బొమ్మను కూడ ఆ జిల్లాలో దహనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసౌకర్యాన్ని తప్పించడానికే పది లక్షలకు పైగా విధ్యార్ధులకు మార్చి…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

పిలవని పేరంటానికి అమెరికా, లిబియా వద్ద యుద్ధ వాతావరణం

  అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని…

లిబియాపై ఆంక్షలను ఆమోదించిన భద్రతా సమితి

ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు.  చైనా అభిప్రాయంపై అనుమానాలు…

మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన

  ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ…

లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా

  లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర…

గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

“మల్లెల విప్లవం” నేపధ్యంలో దేశ వ్యాపిత “డేటాబేస్” నిర్వహణకై చైనా అధికారి సూచన

  అరబ్ ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో చైనాలో క్రితం వారం ఇంటర్నెట్ ద్వారా అటువంటి ప్రదర్శనను నిర్వహించాలంటూ ప్రచారం జరిగిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఝౌ యాంగ్ కాంగ్ హెచ్చరించాదు. పొలిట్ బ్యూరోలో ఝౌ, చట్ట పాలనకు (లా అండ్ ఆర్డర్) భాద్యుడు. సామాజిక వ్యవస్ధ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలనీ సమాజంలో సంఘర్షణలను, సమస్యలను ముందే గుర్తించాలనీ ఆయన సీనియర్ అధికారులను కోరినట్లుగా అధికార…