యెడ్యూరప్పకు పులిమీద పుట్ర, అవినీతి కేసులో విచారణకు కోర్టు అనుమతి
కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కు కూడా అక్రమ మైనింగ్ కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనున్న నేపధ్యంలో ఆయనపై మరో సమ్మెట దెబ్బ పడింది. యెడ్యూరప్పపై అవినీతి కేసులు నమోదు చేసి విచారించాలన్న క్రింది కోర్టు తీర్పుపై మార్చిలో విధించిన స్టేను హై కోర్టు గురువారం ఎత్తి వేసింది. స్తే ఎత్తి వేస్తూ ముఖ్యమంత్రిపై అవినీతి పాల్పడ్డాడన్న కేసు నమోదు చేసి విచారణ చేయడానికి…