సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట
ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మద్దతు ప్రకటించాడు. జి-20 గ్రూపులో అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చుని కూడా ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ…
