కేంద్ర మంత్రికి ద్రవ్యోల్బణం సంతోషమేనట!–కార్టూన్

రైతుతో: ఎక్కువ అడగొద్దయ్యా! రేటు ఎక్కువైతే మళ్ళీ సగటు మనిషికి భారం కదా!        జనంతో: ధరలు పెరిగాయని గొణక్కండి. రైతులకి అదే లాభం. —————————————— ప్రజల అవసరాలతో పరాచికాలాడడం కేంద్ర మంత్రులకు ఆటగా మారినట్లుంది. ‘వాటర్ బాటిల్ కి 15/- ఖర్చు పెడతారు గానీ బియ్యం ధర రూపాయి పెరిగినా సహించలేరు’ అంటూ మధ్య తరగతి జనంపై ఏవగింపుని చాటుకున్న చిదంబరం సరసన, కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేరిపోయాడు. బియ్యం, గోధుమలు,…

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

ద్ర్యవ్యోల్బణం: హోల్ సేల్ 6.89%, రిటైల్ 9.47%

మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ…

5 లేదా 6 శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణం ఇండియా భరించలేదు -ప్రణబ్

భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని భరించలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పార్లమెంటులో అన్నాడు. అక్టోబరు నెలలో భారత ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణం 9.73 శాతం గా ఉంది. కనీసం సంవత్సరం నుండి భారత ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం కంటే కిందికి దిగి రాలేదు. మరి ద్రవ్యోల్బణం తగ్గించకుండా ప్రణబ్ ముఖర్జీని ఎవరు ఆపారో తెలియడం లేదు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్న ఆర్ధిక పండితులలో…

ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం

అమెరికా ప్రవేటు బహుళజాతి కంపెనీల ఇష్ట సఖుడు, భారత ఆర్ధిక వ్యవస్ధ ను అమెరికాకు కట్టిపడవేయడానికి దీక్షగా కృషి చేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన తప్పును అంగీకరించాడు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతున్నప్పటికీ తగ్గుతుందంటూ దొంగ కబుర్లు చెప్పి ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరికి తన పొరపాటు అంగీకరించాడు. ద్రవ్యోల్బణం తగ్గడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు,…

జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం మరింత పై పైకి…

భారత దేశంలో నిత్యావసర సరుకులు, వినియోగ సరులులతో పాటు సమస్త వస్తువల ధరలు పెరగడం కొనసాగుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం ఇంకా పెరగడంతో పాటు ఏప్రిల్ నెలలో కూడా గతంలో ప్రకటించిన అంకెను ప్రభుత్వం మరింతగా పైకి సవరించుకుంది. అంటే ఏప్రిల్ నెలలో ధరలు గతంలో భావించినదాని కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట. జూన్ నెలలో (ప్రధాన) ద్రవ్యోల్బణం 9.44 శాతం నమోదయ్యింది. టోకు ధరల సూచి ప్రకారం లెక్కించే ప్రధాన…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…

మే నెలలో మళ్ళీ క్షీణించిన భారత పారిశ్రామీక వృద్ధి, షేర్లు పతనం

భారత పారిశ్రామికీ వృద్ధి గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ క్షిణించింది. మే నెలలో పారిశ్రామిక వృద్ధి 5.6 శాతంగా నమోదయ్యింది. రాయిటర్స్ సర్వేలో ఇది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ క్షీణత అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇటలీ, స్పెయిన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభానికి దగ్గర్లోనే ఉన్నాయన్న అనుమానాలు తీవ్రం కావడంతో భారత షేర్ మార్కెట్లు నష్టాల బాటలోనే మూడోరోజూ కొనసాగాయి. గత శుక్రవారం…

భారత షేర్ల సూచి ‘సెన్సెక్స్’ టార్గెట్‌ అంచనా తగ్గించిన యు.బి.ఎస్ బ్యాంకు

ప్రవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) భారత దేశానికి చెందిన బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ (సెన్సెక్స్) సూచిపై గతంలో తాను అంచనా వేసిన లక్ష్యాన్ని బాగా తగ్గించింది. యు.బి.ఎస్ సెన్సెక్స్ సూచి 22,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం దానిని 21,000 పాయింట్లకు తగ్గించింది. లాభాల సంపాదనలో ప్రతికూల ఒరవడిలో ఉన్నందున సెన్సెక్స్ లక్ష్యాన్ని తగ్గిస్తున్నట్లుగా అది తెలిపింది.…

ఇంధన ద్రవ్యోల్బణం పైపైకి, మళ్ళీ రెండంకెలకు చేరనున్న ప్రధాన ద్రవ్యోల్బణం?

డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది. జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి…

గ్రీసు బెయిలౌట్‌తో పట్టపగ్గాలు లేని ఇండియా షేర్‌మార్కెట్లు

అప్పు సంక్షోభంతో సతమతమవుతున్న గ్రీసు దేశానికి రెండో బెయిలౌట్ ఇవ్వనున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించడంతో భారత షేర్ మార్కెట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్, ఎన్.ఎస్.ఇ నిఫ్టీలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా మూడు శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుండడంతో ప్రపంచ వ్యాపితంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో మందగించినట్లు…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…

చైనా ఫ్యాక్టరీ సెక్టార్‌లో అభివృద్ధి ముందుకు సాగడం లేదు

చైనా ఫ్యాక్టరీ రంగ అభివృద్ధి కుంటుబడిందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. పర్ఛేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ను (Purchasing Managers’ Index) కుదించి పి.ఎం.ఐ గా పిలుస్తారు. ఈ ఇండెక్స్‌లో 50 ఉన్నట్లయితే అటు అభివృద్ధి గానీ ఇటు తిరోభివృద్ధి (contraction) గానీ ఏమీ లేదని భావిస్తారు. 50 కంటె ఎక్కువగా ఉన్నట్లయితే అది విస్తరణ లేదా అభివృద్ధిగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ రంగం కుచించుకు పోతున్నట్లుగా లేదా తిరోభివృద్ధిని నమోదు చేస్తున్నట్లుగా భావిస్తారు. గురువారం…