జపాన్ లో అణువిద్యుత్ ప్లాంటులను చల్లబరిచే యత్నాలు ముమ్మరం

జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా లోని దైచి అణు విద్యుత్ ప్లాంటులో పేలిపోయిన రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మిలట్రీ హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని ప్లాంటుపై జారవిడుస్తున్నది. ఈ ప్రక్రియను బుధవారం మొదలు పెట్టినప్పటికీ రేడియేషన్ స్ధాయి ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నారు. హెలికాప్టర్లతో పాటు ప్లాంటు వద్ద వాటర్ కెనాన్ లను ఉపయోగించి నీళ్ళు వెదజల్లుతున్నారు. మొదట పోలిసులు ప్రయత్నించినా వారు రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం ఉండడంతో వారిని వెనక్కి రప్పించారు. మిలట్రీ…

అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా

జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు…

అణు ధార్మికత ఎంత దాటితే ప్రమాదకరం?

అణు ధార్మికతను ‘మిల్లీ సీవర్టు’లలో కొలుస్తారు. ‘సీవర్టు’ అసలు యూనిట్ అయినప్పటికీ అత్యంత ప్రమాదకర స్ధాయి సైతం మిల్లీ సీవర్టులలో ఉంటుంది కనుక ‘మిల్లీ సీవర్టు’ సాధారణ కొలతగా మారింది. జపాన్ ఛీఫ్ కేబినెట్ మంత్రి యుకియో ఎదనో చెప్పినదాని ప్రకారం ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్ కేంద్రం వద్ద అణు ధార్మికత గంటకు 400 మిల్లీ సీవర్టులుగా నమోదయ్యింది. ఇది మంగళవారం ఉదయం నెం.2 రియాక్టర్ పేలడానికి ముందు నమోదైనదాని కంటే కొన్ని వేల రెట్లు…

మూడో రియాక్టర్ పేలుడు, జపాన్ లో అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న అణు ధార్మికత

జపాన్ భూకంపం, సునామీల కారణంగా సోమవారం వరకు రియాక్టర్ నెం. 1, 3 లలో పేలుళ్ళు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నెం. 2 రియాక్టరు కూడా పేలిపోయింది. దానితో పాటు భూకంపం రావడానికి చాలా రోజుల ముందే నిర్వహణ నిమిత్తం మూసివేసిన నెం.4 రియాక్టరులో కొద్ది సేపు మంటలు ఎగసిపడ్డాయి. నాల్గవ రియాక్టరు పనిలో లేనప్పటికీ వాడిన ఇంధన రాడ్లను అక్కడే ఉంచడం వలన అక్కడ కూడా అణు ధార్మికత వెలువడే ప్రమాదం తలెత్తింది. రెండో…

జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…

జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…