ప్రపంచంలోనే చౌక ‘టాబ్లెట్’ విడుదల చేసిన ఇండియా

గత కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న ‘ఆకాశ్’ టాబ్లెట్ విడుదలయ్యింది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి కబిల్ సిబాల్ బుధవారం ‘ఆకాశ్’ ను విడుదల చేశాడు. విద్యార్ధులకు, పేదలకు సైతం కంప్యూటర్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆకాశ్’ టాబ్లెట్ మొదటి విడత లక్ష ఉత్పత్తులను విద్యార్ధులకు ఉచితంగా ఇస్తామని కపిల్ సిబాల్ ప్రకటించాడు. ‘డేటా విండ్’ అనే బ్రిటిష్ కంపెనీ ‘ఆకాష్’ ను తయారు చేస్తోంది. ఆ కంపెనీయే ‘ఆకాష్’ ను అభివృద్ధి చేసింది.…