పెట్టుబడిదారులకి సంక్షోభం కనిపించేది ఇలాగే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే ‘చక్ర భ్రమణ సంక్షోభాలు’ (cyclic crises) ప్రజల మూలుగలని పిప్పి చేసినా పెట్టుబడిదారులకి కాసులు కురవడం మాత్రం ఆగిపోదు. సంక్షోభం పేరు చెప్పి సర్కారు ఖజానాపై మరింత దూకుడుగా ఎలా వాలిపోవాలో అనేక వంచనా మార్గాలని వారు అభివృద్ధి చేసుకున్నారు; సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకి కొత్త కాదు గనక. ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల సొమ్ము భోంచేసినప్పటికీ, కంపెనీలు దానిని ఏ మాత్రం కార్మికవర్గానికి విదల్చకపోవడం వల్ల సంక్షోభం ప్రధాన ఫలితం నిరుద్యోగమే అవుతుంది.…

రాజకీయం దృష్టిలో ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ -కార్టూన్

సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం  దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని…

‘టీం అన్నా’ ఇక లేదు -కార్టూన్

ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండానే నిరాహార దీక్ష ముగించిన అన్నా హజారే, తర్వాత మూడు రోజులకే ‘అన్నా బృందం’ రద్దు అయినట్లు ప్రకటించి ఒకింత సంచలనం సృష్టించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటుని సుగమం చేయడానికే అన్నా హాజరే తన బృందాన్ని రద్దు చేసినట్లు ‘ది హిందూ’ వార్త రాసింది. అంటే ఆ వార్తలో సానుకూలత ఉందే తప్ప సంచలన కారకం ఏమీ లేదు. ఒకటో రెండో ఇతర పత్రికలు కూడా అన్నా అభిప్రాయాన్ని ఇదే విధంగా…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని…

జి20, రియో సభలో మన్మోహన్ బడాయి -కార్టూన్

జి 20, రియో సభల కోసం ప్రధాని మన్మోహన్ వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు వెళ్లివచ్చాడు. మెక్సికో లో జి 20 సమావేశాలు జరగ్గా బ్రెజిల్ రాజధాని ‘రియో డి జనేరియో’ లో ‘రియో + 20’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సమావేశాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ పై 1992 లో మొదటి సారి ‘ఎర్త్ సమ్మిట్’ పేరుతో రియోలోనే ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. మళ్ళీ 20 సంవత్సరాల…

కట్టెలమ్మిన చోట పూలమ్మనున్న ప్రణబ్ -కార్టూన్

పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో…

యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక…

మన్మోహన్ ప్రభుత్వానికి బరువవుతున్న చిదంబరం -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న పి.చిదంబరం పై ‘అక్రమ ఎన్నిక’ కేసు కొనసాగించడానికి మద్రాసు హై కోర్టు నిర్ణయం తీసుకుంది. తన ఎన్నికపై పిటిషన్ ని కొట్టివేయాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దానితో కేంద్ర మంత్రిగా చిదంబరాన్ని కొనసాగించాలా లేదా అన్నది మన్మోహన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అవసరాన్ని ప్రధాని గుర్తించాడో లేదో గానీ, గుర్తించకపోతే పుటుక్కున తెగి నెత్తిపైనే పడడం ఖాయంగా కనిపిస్తోంది.లేదంటే, రాజీనామా చేయాలన్న బి.జె.పి డిమాండ్…

నిండా మునిగిన మన్మోహన్ కి చలే లేదు -కార్టూన్

అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అప ప్రధ మూట కట్టుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టడానికి సంకోచించడం లేదు. పెట్రోల్ ధరలు లీటర్ కి ఏకంగా రు. 7.54 లు పెంచడం ఆ కోవలోనిదే. ఓ పట్టాన దిగిరాని ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రజలకు ఉపశమనం చేకూర్చడానికి బదులు మరింత భారాన్ని మోపడానికే మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇరాన్ అణు బాంబు విషయంలో పశ్చిమ దేశాలు, ఇరాన్…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజి ఓటమి -యూరోప్ కార్టూన్లు

ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ…

IPL score

ఇండియన్ ప్రెసిడెన్షియల్ లీగ్ -కార్టూన్

ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతుండగానే భారత దేశ రాష్ట్ర పతికి ఎవరు సరైన అభ్యర్ధులో తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. రెండు చోట్ల, రెండు రంగాల్లో చోటు చేసుకున్న ద్వైదీ భావ ‘టు బి ఆర్ నాట్ టు బి’ పరిస్ధితి ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు సురేంద్రను ఈ కార్టూన్ గీయడానికి పురి గొల్పింది. రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వారు ఉప రాష్ట్రపతి హమీద్…

Modi not guilty

మోడీకే పాపమూ తెలియదట -కార్టూన్

సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ కనిపించలేదట. నెలల తరబడి సాగిన మానవ హననంలో పసి పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అత్యంత పాశవికంగా హత్యలకు గురయినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూచుంది. అయినా రాష్ట్ర ముఖ్య మంత్రికి…

Tatra trucks deal - General's attack

టాట్రా అవినీతి, ఆర్మీ చీఫ్ అటాక్ -కార్టూన్

టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి…

All options for Greece

అన్నీ టెబుల్ మీదే ఉన్నాయి -కార్టూన్

“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు,…