సంక్షోభాలవైపే ‘యూరో’ టైటానిక్ పయనం -కార్టూన్
– – –
– – –
పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా…
యూరప్ రుణ సంక్షోభం కేంద్ర స్ధానం ఇప్పుడు గ్రీసు నుండి ఇటలీకి మారింది. ఇటలీ సావరిన్ రుణ బాండ్లపైన వడ్డీ రేట్లు బాగా పెరగడంతో ఆ దేశానికి రుణ సేకరణ కష్టంగా మారింది. అంటే ఇటలీకి అప్పు పుట్టడం కష్టంగా మారింది. ఈ పరిస్ధితి కొనసాగితే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు బెయిలౌట్ రుణ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇటలీ, యూరప్ లొ మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కావడంతో దానికి బెయిలౌట్ ఇచ్చే పరిస్ధితి యూరప్ కు…
కార్పొరేట్ కంపెనీలన్నీ బెయిలౌట్లు మెక్కినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సుతరామూ ఇస్టపడడం లేదు. ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ జోక్యాన్ని విమర్శించే కార్పొరేట్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన బెయిలౌట్లు తేరగా మెక్కి బ్రేవ్ మని త్రేన్చి తిరిగి ఉద్యోగాల రూపంలో చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం నుండి అమెరికా సాధించిన రికవరీ ‘జాబ్ లెస్ రికవరీ’ గా చరిత్రలో మొదటిసారి చరిత్ర పుటలకు ఎక్కనుంది. – –
ఫ్యూడల్ రాజుల కాలం పోయి, ‘ప్రజాస్వామ్య’ రాజుల కాలం వచ్చింది. ఇద్దరూ రాజులే కనుక రోం నగరం తగలబడుతున్నపుడు ఇద్దరూ ఫిడేలే వాయిస్తున్నారు. ప్రజల పట్లా, వారి సమస్యల పట్లా అప్పటి రాజు దృక్పధం ఎలా ఉన్నదో, ఇప్పటి రాజుల దృక్పధం కూడా అలానే ఏడుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ ధనికులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకే రాజు వద్ద అగ్ర స్ధానం. వారికోసమే రాజ్యాలూ, రాజ్యపాలనానూ. అప్పటికీ, ఇప్పటికీ ఆకలి, దరిద్రం, కరువూ అన్నీ ప్రజల సొత్తే. ఇటలీ విషయంలో…
ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని…
ఎక్కడికక్కడ విభేధాలు సృష్టించి ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నాయి యూరప్ దేశాలు. ఇపుడు తమ అప్పు సంక్షోభం పరిష్కరించుకునే విషయంలో యూరప్ దేశాలు ఏకాభిప్రాయం కుదరక కిందమీదలవుతున్నాయి. గట్టి పరిష్కారం చూపలేక విడిపోయిన అభిప్రాయాలతో సాయం చెయ్యమని బైటివారిని కోరుతున్నాయి. – –
చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.…
ఉద్యమం: “భూగ్రహాన్ని ఆక్రమిద్దాం!” హాజరు: 7,000,000,000 (ఏడు బిలియన్లు) – –ది కేగిల్ పోస్ట్–
– –
– -ఫస్ట్ పోస్ట్ నుండి
అక్టోబరు 31 సాయంత్రంతో 700 కోట్లవ బిడ్డ జన్మించాడని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ క్రెడిట్ ని భారత్, ఫిలిప్పైన్స్ లకు చెందిన ఇద్దరు పసికందులు సంపాదించుకున్నారు. అయితే, సురక్షితమైన తల్లి గర్భం నుండి భూమ్మీదికి అడుగుపెడుతున్న పసికందులను ఆహ్వానిస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం సమాధానం చెబుతోంది. మానవ ప్రపంచం సాధించిన అభివృద్ధికంటే ముందే ఆకలి, కరువు, దారిద్ర్యం, అందని చదువులు, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం మున్నగు సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గర్భస్త…
“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా,…