నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం
నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

