ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ తొలగింపు, రాజకీయ విశ్లేషకులు అప్రమత్తం

ఉత్తర కొరియా నుండి ఊహించని వార్త వెలువడింది. మిలటరీ చీఫ్ ‘రి యాంగ్-హో’ ను అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండీ, ఇతర అన్ని అధికార పదవులనుండీ తొలగించినట్లు ప్రభుత్వ వార్తా సంస్ధ కె.సి.ఎన్.ఎ ప్రకటించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ కు వైస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న రీ, అధికార పార్టీ వర్కర్స్ పార్టీలోనూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు. రీ తొలగింపు ‘అసాధారణం’ గా దక్షిణ కొరియా కొరియాల ‘ఏకీకరణ మంత్రిత్వ శాఖ’…

‘క్షిపణి’ లో(తో)నే ‘కిమ్ జోంగ్-ఇల్’ సమాధి!!! కార్టూన్

కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు…

‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ‘క్షిపణి’ని పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అత్యున్నత రాజకీయ, మిలట్రీ నాయకుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ఆ దేశం స్వల్ప దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి గల క్షిపణి పరీక్షించి సంచలన సృష్టించింది. అయితే మిసైల్ పరీక్ష కూ, కిమ్ మరణానికీ సంబంధం ఉన్నదని తాము భావించడం లేదని దక్షిణ కొరియా అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. మిసైల్ పరీక్షించిన విషయాన్ని కూడా దక్షిణ కొరియా మీడియా నే వెల్లడించాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో శోక సంద్రంలో ఉ.కొరియా ప్రజలు -ఫొటోలు

ఉత్తర కొరియాను పోలీసు రాజ్యంగా పశ్చిమ దేశాలు, అక్కడి పత్రికలు అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియాను ‘కిమ్ జోంగ్-ఇల్’ ఉక్కు గోడల మధ్య పాలిస్తున్నాడనీ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడనీ ఆరోపిస్తాయి. ప్రజలను కఠినంగా అణిచివేస్తాడని ఆడిపోసుకుంటాయి. కాని కిమ్ మరణంతో ఉత్తర కొరియా ప్రజానికం మూకుమ్మడిగా విలపిస్తున్న దృశ్యాలు ఆ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతున్నాయి. – –

చైనాకి భయాన్ని మిగిల్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడి మరణం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ మరణం చైనాకు ఒకింత భయాన్ని మిగిల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్-ఇల్ మరణంతో తాము ‘ఆందోళనకూ, అసౌకర్యానికీ’ గురయినట్లుగా చైనా ప్రభుత్వం తెలిపింది. దీనిని నిజానికి ‘షాక్ కి గురయ్యామని’ చైనా చెప్పినట్లుగా భావించవచ్చని రాయిటర్స్ భాష్యం చెప్పింది. కొరియా ప్రాంతంలో చైనా ప్రభావానికి ఉత్తర కొరియా వాహకంగా ఉంటూ వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ ఎంతగా చైనాను విసిగించినప్పటికీ, చైనా ఎంత విసిగినప్పటికీ ఆసియాలో, ఆ…

ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణం, అప్రమత్తతలో పశ్చిమ దేశాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రభుత్వం సోమవారం ప్రకటించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అరవై తొమ్మిదేళ్ళ కిమ్ జోంగ్-ఇల్ శనివారమే మరణించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ‘ఫీల్డ్ గైడెన్స్’ ఇస్తుండగా అదనపు శారీరక, మానసిక శ్రమ వలన అలసటకు గురవడంతో కిమ్ మరణించాడని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు మరణించడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న ఉత్తర…

ప్రయాణీకుల జెట్ విమానంపై పొరపాటున కాల్పులు జరిపిన దక్షిణ కొరియా సైన్యం

దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియ జెప్పే సంఘటన ఇది. 119 మంది ప్రయాణికులు ఉన్న జెట్ విమానం ఉత్తర కొరియా ప్రయోగించిన యుద్ధ విమానంగా భావించి దక్షిణ కొరియా సైన్యం దానిపైకి కాల్పులు జరిపించి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఆ రెండూ 1950ల్లో విడిపోయినప్పటినుండీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో సైనిక స్దావరాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇరు పక్షాల…