ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం
ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…