ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు

తన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన…

Bomb Iran

ఇరాన్ పై బాంబు పడాల్సిందే -కార్టూన్

ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటుందేమోనన్న భయంతో వణికిపోతున్న ఇజ్రాయెల్ అమెరికా చేత ఇరాన్ యుద్ధం చేయించడానికి కంకణం కట్టుకుని ఉంది. అమెరికాలో అత్యంత శక్తివంతమైన ‘ఇజ్రాయెల్ అనుకూల యూదు లాబీ’ ద్వారా అమెరికా చేత అనేక ఘోరాలు చేయించిన ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ పైన కత్తి కట్టింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ, పాలస్తీనీయులపై జాత్యహంకార పాలన సాగిస్తూ మూడొందలకు పైగా అణు బాంబులు (బిబిసి ప్రకారం) నిర్మించుకుని ఉన్న ఇజ్రాయెల్ వల్ల ‘ప్రపంచ…

ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు -రష్యా

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపు ఇవ్వడాన్ని రష్యా తిరస్కరించింది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. బుధవారం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్, ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. 2003లో అణ్వాయుధాలు నిర్మించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లుగా ఐ.ఎ.ఇ.ఎ ఇటీవల తన నివేదికలో పేర్కొనడాన్ని చూపిస్తూ విలియం హేగ్, ఈ డిమాండ్ చేశాడు. రష్యా తిరస్కరణతో ఇరాన్ పై ఆంక్షలు…

భారత దేశానికి ఆయిల్ సరఫరాలో ఆటంకాలు రానివ్వం -ఇరాన్

భారత దేశ ఆయిల్ రిఫైనరీలు పాత బాకీలు చెల్లించనట్లయితే వాటికి ఆయిల్ సరఫరాను ఆగష్టు నెలనుండి బంద్ చేస్తామని ప్రకటించిన ఇరానియన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ “నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ” (ఎన్.ఐ.ఒ.సి), భారత దేశానికి సరఫరా చేయడంలో ఆటంకాలు రానివ్వబోమని ప్రకటించింది. ఇండియా ఆయిల్ రిఫైనరీలు తమకు 2 బిలియన్ డాలర్లు బకాయి ఉన్నాయనీ అది చెల్లించడానికి తగిన మార్గాన్ని త్వరగా చూపనట్లయితే ఆయిల్ సరఫరా ఆపడం తప్ప మరొక మార్గం లేదని ఎన్.ఐ.ఒ.సి ప్రకటించిన…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2

సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం…

ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని గాల్లోనే అడ్డుకున్న ఇరాన్

రక్షణ రంగ కొనుగోళ్ళ విషయం గురించి చర్చించడానికి ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రెండు గంటలపాటు సదరు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి టర్కీ మద్యవర్తిత్వంతో మెత్తబడిన ఇరాన్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి ఇవ్వడంతో ఆమె క్షేమంగా ఇండియా చేరగలిగింది. విమానాన్ని తమ గగన తలం లోకి ఇరాన్ ఎందుకు అనుమతించనిదీ కారణం ఇంకా తెలియలేదు. ఇరాన్…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3

ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 2

తర్వాత నవంబరులో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇరాన్ పై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. సీక్రెట్ వర్గీకరణతో డిసెంబరు 12 న పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇరాన్-ఇండియా ల విషయం లేవనెత్తాడు. “మధ్యప్రాచ్యం కి సంబంధించి సమగ్రమైన విధానం రూపొందించుకోవడంలో ఇండియా సమర్ధతను చూపలేక పోయింది” అని రాశాడు. (ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఉన్న అరబ్, ముస్లిం దేశాలను కలిపి ‘మధ్యప్రాచ్యం’ గా సంభోధిస్తారు.) అంటే అమెరికా, ఇజ్రాయెల్ లకు అనుకూలంగా విదేశీ…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 1

మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యు.పి.ఏ కూటమి అధికారం చేపట్టినప్పటినుండీ అమెరికా దోస్తీ కోసం ఇండియా వెంపర్లాడింది. అమెరికాతో “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” కుదుర్చుకోవడం వలన భారత ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం వికీలీక్స్ బయట పెట్టిన “డిప్లొమేటిక్ కేబుల్స్” ద్వారా వెల్లడవుతున్నది. అమెరికా, తన ప్రయోజనాలను నెరవేర్చడం కోసం తన రాయబారుల ద్వారా, ఐ.ఏ.ఇ.ఏ, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ఇండియాపై నిరంతరం ఎలా ఒత్తిడి చేసిందీ తెలుసుకుంటున్న కొద్దీ ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అమెరికా…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

ఇరాన్ లో ఈజిప్టు సంఘీభావ ప్రదర్శనలు

ఈజిప్టు ప్రజాందోళనకు ఇరాన్ లోని పాలక, ప్రతిపక్షాలు రెండూ మద్దతు పలికాయి, కానీ వేర్వేరు కారణాలతో. పాలక పక్షం పశ్చిమ దేశాలు పెంచి పోషించిన నియంతకు వ్యతిరేకంగా తలెత్తిన “ఇస్లామిక్ మేలుకొలుపు” గా అబివర్ణించి మద్దతు తెలపగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం “రాజకీయ స్వేఛ్చా వాయువుల కోసం ఎగసిపడిన ప్రజా ఉద్యమం”గా అభివర్ణించి ఈజిప్టు ప్రజల ఉద్యమానికి సంఘీభావంగా ఇరాన్ లో ప్రదర్శనలు పిలుపునిచ్చాయి. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన…