పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…