డాలరుతో 26 పైసలు పెరిగిన రూపాయి విలువ

స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా లాభాల బాట పట్టడంతో ఆ మేరకు రూపాయి విలువ కూడా కోలుకుంటోంది. శుక్రవారం రూపాయి విలువ డాలరు విలువతో పోలిస్తే 26 పైసలు పెరిగి రు.52.20/21 కు చేరుకుంది. ఇది గత రెండు వారాలలో అత్యధిక స్ధాయి కావడం గమనార్హం. ఎగుమతిదారులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు డాలర్ల అమ్మకం చేపట్టడంతో రూపాయి విలువ పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు లాభాలు సంపాదిస్తుండడం కూడా రూపాయి విలువ కోలుకోవడానికి దారి…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత ఆర్ధిక వృద్ధి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో రెండో క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు 2011) లో భారత ఆర్ధిక వృద్ధి గత రెండేళ్లలో అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయింది. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో విస్తరించిన కాలంలో భారత ఆర్ధిక వ్యవస్ధ కేవలం 6.9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుదల, సంక్షోభంలో ఉన్న ప్రపంచ కేపిటల్ మార్కెట్లు అన్నీ కలిసి భారత ఆర్ధిక వృద్ధిని…

చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు…

పొదుపు విధానాలతో బాగా పడిపోయిన బ్రిటన్ల ఆదాయాలు

బడా బహుళజాతి కంపెనీలను సంక్షోభం నుండి బైటపడేయానికి ఇచ్చిన బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలు సదరు అప్పులు తీర్చడానికి ప్రజలపైనే భారం మోపుతూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల వల్ల బ్రిటన్ లో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయని ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) చేసిన సర్వేలో తేలింది. అదే సమయంలో సీనియర్ మేనేజర్ల వేతనాలు మాత్రం అనేక రెట్లు…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత షేర్ మార్కెట్లు, వెంటాడుతున్న మాంద్యం భయాలు

బుధవారం భారత షేర్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సోమవారం వరకూ వరుసగా ఎనిమిది రోజులు నష్టాలను ఎదుర్కొన్న షేర్లు మంగళవారం 0.75 శాతం లాభపడి ఇన్వేస్టర్లను ఆశలను కొద్దిగా చిగురింపజేసాయి. అయితే అది తాత్కాలికమేనన్న విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం భారత షేర్లు మళ్లీ ఘోరంగా పతనం అయ్యాయి. ఈ సారి రెండేళ్ల కనిష్ట స్ధాయిని తాకి ఇన్వెస్టర్లకు చెమటలు పుట్టించాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2.3 శాతం పతనం అయ్యాయి. అధిక…

2జి స్పెక్ట్రం కేసులో ఎవరు బయట, ఎవరు లోపల? -గ్రాఫిక్స్

2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి బుధవారం అనుకోని పరిణామం సంభవించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓ లు ఐదుగురికి బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో జైలులోనే ఉన్న మిగిలిన వారికి కూడా బెయిల్ ఆశలు పుడతాయని చెప్పవచ్చు. ఈ కేసులో హై ప్రొఫైల్ ముద్దాయిలయిన ఎ.రాజా, కనిమొళిలకు కూడా దొరకని బెయిల్ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓలకు దొరికింది. వీరు కాక జైలులో ఇంకా తొమ్మిది మంది ఉన్నారు. –…

రికార్డు స్ధాయిలో రూపాయి పతనం

మంగళవారం రూపాయి రికార్డు స్ధాయిలో పతనం అయ్యింది. ఒక దశలో డాలరుకు రు.52.73 పై.ల విలువకు రూపాయి పతనం అయ్యింది. మంగళవారం వ్యాపార సమయం ముగిసే నాటికి అత్యల్ప స్ధాయి డాలరుకు రు.52.73 పై ల నుండి కొద్దిగా కోలుకుని డాలరుకు రు.52.32  పై.ల స్ధాయికి రూపాయి విలువ చేరుకుంది. అంటే సోమవారం ముగింపు డాలరుకు రు.52.16 పై.ల స్ధాయితో పోలిస్తే మంగళవారం రూపాయి 16 పైసల విలువ కోల్పోయింది. ముప్ఫై షేర్ల సెన్సెక్స్ మంగళవారం ఎనిమి…

ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం

అమెరికా ప్రవేటు బహుళజాతి కంపెనీల ఇష్ట సఖుడు, భారత ఆర్ధిక వ్యవస్ధ ను అమెరికాకు కట్టిపడవేయడానికి దీక్షగా కృషి చేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన తప్పును అంగీకరించాడు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతున్నప్పటికీ తగ్గుతుందంటూ దొంగ కబుర్లు చెప్పి ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరికి తన పొరపాటు అంగీకరించాడు. ద్రవ్యోల్బణం తగ్గడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ…

బ్రిటన్, జర్మనీలలో ఎవరు మెరుగు?

“ది టెలిగ్రాఫ్” అందించిన ఈ సూచికలను బట్టి మొత్తం మీద జర్మనీ కంటే బ్రిటనే మెరుగ్గా కనిపిస్తోంది. కాని జర్మనీ యూరోజోన్ కూటమితో పాటు, యూరోపియన్ యూనియన్ కు కూడా (అనధికార) నాయకడుగా చెలామణి అవుతోంది. ఆర్ధికంగా చూసినా జిడిపి వృద్ధి, సైజు లలో జర్మనీయే ముందంజలో ఉంది. జర్మనీ మొత్తం మీద చూస్తే ముందంజలో ఉండగా, బ్రిటన్ తలసరి లెక్కల్లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. – –

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…

చైనా, అమెరికాల వాణిజ్య అసమతూకం -కార్టూన్

పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా…

అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం

భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా…

పెట్రోల్ ధరలు లీటరుకి రు.1.85 పై.లు తగ్గించిన ఆయిల్ కంపెనీలు

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరల్ని ఈ రోజు అర్ధ రాత్రి నుండి అంటే బుధవారం నుండీ లీటరుకు రు.1.85 పై.ల చొప్పున తగ్గించాలని నిర్ణయించాయి. అంటే 3.2 శాతం తగ్గింపన్నమాట! 18 నెలల క్రితం పెట్రోల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. పన్నులతో కలుపుకుని ఢిల్లీలో లీటర్ పెట్రో ధర రు.2.22 పై మేరకు తగ్గుతుంది. అంటే ఢీల్లీలో పెట్రోధర లీటరుకి రు.66.42 పై. కు తగ్గుతుంది. భారత…

పాపం అంతా యూరోజోన్‌దే -నిరుద్యోగం పై బ్రిటన్ ప్రభుత్వం

కన్సర్వేటివ్ ల నాయకత్వంలోని కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నిరుద్యోగం పాపం అంతా యూరోజోన్ సంక్షోభందేనని చేతులు దులుపుకుంది. బ్రిటన్ లో నిరుద్యోగం పెరగడానికి దేశీయంగా ప్రభుత్వ రంగం, ప్రవేటు రంగం, ఛారిటి రంగాల నిర్వాకాలే కారణమని సి.ఐ.పి.డి నివేదిక చెబుతుండగా ట్రెజరీ కి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న మార్క్ హోబన్ మాత్రం పాపం అంతా యూరోజోన్ సంక్షోభంపైకి నెట్టేసి దులుపుకున్నాడు. యూరప్ లో 27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా ఏర్పడ్డాయి.…