Too-Big-To-Jail

వాల్ స్ట్రీట్: టూ బిగ్ టు జెయిల్ -కార్టూన్

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు. పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దుతూ తాత్కాలికంగా సంక్షోభాన్ని కార్మిక వర్గంపైకి నెట్టేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు మళ్లీ లాభాలు పుంజుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా బక్క చిక్కే ఉన్నాయి. ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి అమెరికా, యూరప్ ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ ను బయటపడేశాయి. కాని అత్యాశతో అనేక అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, చట్టాలను తుంగలో తొక్కిన బడా…

economic-bright-side

తీవ్ర స్ధాయిలో అమెరికా మాంద్యం -కార్టూన్

అమెరికా మాంద్యం (రిసెషన్) తీవ్రమవుతోందని ఆర్ధికవేత్తలు, రేటింగ్ సంస్ధలు హెచ్చరికలు తీవ్రం చేస్తున్నాయి. నిరుద్యోగం స్వల్పంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూపుతున్నప్పటికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు వదులుకుని అనేకమంది దరఖాస్తు చేయడం మానేయడం వల్లనే నిరుద్యోగం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నదని వారు చెబుతున్నారు. పరిస్ధితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంక్ అధిపతి బెన్ బెర్నాంక్, ట్రెజరీ సెక్రటరి తిమోతి గీధనర్ లు ఆశావహంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అమెరికాకి చెందిన ఈగాన్-జోన్స్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ మూడు రోజుల క్రితం…

అమెరికా, ఇ.యు వాణిజ్య బెదిరింపులను సాహసోపేతంగా తిప్పికొడుతున్న అర్జెంటీనా

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల ఆధిపత్య వాణిజ్య విధానాలను తిప్పికొట్టడంలో అర్జెంటీనా సాహసోపేతంగా వ్యవహరిస్తోంది. తమ దేశ ప్రయోజనాలను బలి పెట్టే విధంగా విదేశీ ఒత్తిడులకు తల వంచేది లేదని అమెరికా, ఇ.యు లకు చేతల ద్వారా స్పష్టం చేస్తోంది. డబ్ల్యూ.టి.ఓ వద్ద అమెరికా, ఇ.యు లు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులకు బెదిరేది లేదని తెగేసి చెబుతోంది. అర్జెంటీనా వాణిజ్య విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా, ఇ.యు లు డబ్ల్యూ.టి.ఓ లో ఆదివారం ఫిర్యాదు…

రికార్డు స్ధాయికి యూరో జోన్ నిరుద్యోగం, డబుల్ డిప్ నిర్ధారణ?

ఫిబ్రవరి నెలలో 17 దేశాల యూరో జోన్ నిరుద్యోగం అత్యధికంగా 10.8 శాతానికి చేరుకుంది. 1999 లో ‘యూరో’ ఉమ్మడి కరెన్సీగా యూరో జోన్ ఏర్పాడ్డాక ఇదే అత్యధిక స్ధాయి నిరుద్యోగం. జనవరి నెలలో యూరో జోన్ 10.6 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. యూరో జోన్ దేశాల్లోలో స్పెయిన్ అత్యధికంగా 23.6 శాతం నిరుద్యోగంతో అగ్రస్ధానంలో ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన ‘ది గ్రేట్ రిసెషన్’ నుండి పూర్తిగా కోలుకోక ముందే యూరప్, మరోసారి మాంద్యంలోకి…

Tatra trucks deal - General's attack

టాట్రా అవినీతి, ఆర్మీ చీఫ్ అటాక్ -కార్టూన్

టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి…

Ban on citizenship education

స్పెయిన్ లో ‘చదువు’ కి సంకెళ్ళు -వీధి చిత్రం

స్పెయిన్ లో కొత్తగా ఎన్నికయిన కన్జర్వేటివ్ పార్టీల ప్రభుత్వం విద్యార్ధుల ‘చదువు’ కి సంకెళ్లు వేయడం ద్వారా చైతన్యాన్ని అరికట్టాలని చూస్తోంది. అప్పులు చేసి కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లను ప్రజలనుండి వసూలు చేయడానికి దుర్మార్గమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తుండడంతో స్పెయిన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. కార్మికులు, ఉద్యోగుల వేతనాల రూపంలో ప్రజలపై పెడుతున్న ఖర్చులో అక్కడి ప్రభుత్వం ఏకంగా 27 బిలియన్ యూరోలు (36 బిలియన్ డాలర్లు) కోతపెడుతూ రెండు రోజుల క్రితమే బడ్జెట్ ఆమోదించింది.…

ఒబామా అభిమానులా? నిరుద్యోగులా? -కార్టూన్

ఎన్నికల సంవత్సరంలో బారక్ ఒబామాకి నిరుద్యోగులకీ, అభిమానులకీ తేడా తెలియడం లేదు. భారత దేశంలో లాగానే పశ్చిమ దేశాల్లో కూడా ఎన్నికలు దగ్గర్లో ఉన్నపుడు కంపెనీలకు అనుకూలమైన విధానాలు మానేసినట్లూ, ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్నట్లూ పాలకులు నాటకాలాడతారు. నిన్నటిదాకా సిరియాలో జోక్యం కోసం ఉవ్విళ్లూరిన ఒబామా అర్జెంటుగా కోఫీ అన్నన్ ని పంపి సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అందుకే. ఇరాన్ విషయంలో ‘ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ ది…

‘పోస్కో’ పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్

ఒరిస్సా గిరిజన గ్రామాలు, అడవులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన అనుమతిని గ్రీన్ ట్రిబ్యూనల్ సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇచ్చిందనీ, ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేసినపుడు కలిగే నష్టాలను అది సమీక్షించలేదనీ చెబుతూ, మళ్ళీ తాజాగా సమీక్ష జరిగేవరకూ అనుమతిని సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జస్టిస్ సి.వి.రాములు, జస్టిస్…

ఆంధ్ర ప్రదేశ్ లో రు. 50 వేల కోట్ల భూకుంభకోణం -కాగ్ నివేదిక

2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50,285.90 కోట్ల విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి – కాగ్) జరిపిన ఆడిట్ లో తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల దాడి నుండి తప్పించుకోవడానికి, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్ధలో ప్రజా వ్యతిరేక అవినీతి చర్యలను స్క్రూటినీ…

నిరుద్యోగంతో తల్లిదండ్రుల చెంత చేరుతున్న అమెరికా యువత -కార్టూన్లు

స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని  “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది. అమెరికా ఆర్ధిక మాంధ్యం…

మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం

గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…

వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం

ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటి వరకు 7,000 కు పైగా టాట్రా ట్రక్కులను ఆర్మీ కోనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. వీటిని ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్ధితి ఆర్మీకి ఏర్పడిందని చెప్పాడు. అంతకంటే సామర్ధ్యం కలిగిన ట్రక్కులు…

బక్కచిక్కుతున్న అమెరికా మధ్య తరగతి -కార్టూన్లు

అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ‘సోషలిస్టు వ్యవస్ధ’. అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధే అయినా రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయ్యాక ఏర్పడిన సోషలిస్టు వ్యవస్ధలు అమెరికా, యూరప్ లలో సో కాల్డ్…

US economy

విదేశాల్లో కుట్రలు, స్వదేశంలో నిరుద్యోగం -కార్టూన్

– బారక్ ఒబామా: మనం బడా టెర్రరిస్టులని తుడిచి పెట్టాం. అరబ్ ప్రజాస్వామిక ఉద్యమాలు పెరగడానికి సాయపడ్డాం. ఇరాక్ కి ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనీ ప్రసాదించాం… అమెరికా పౌరుడు: గుడ్ జాబ్. మారి నా ఉద్యోగం సంగతేంటి? అదీ సంగతి! పాకిస్ధాన్ అనుమతి లేకుండా, ఆ దేశం గగనతలం లోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పిన ఒబామా ఇంతవరకూ అతని శవాన్ని కూడా చూపలేదు. తమ అనుకూల ఎన్.జి.ఒ సంస్ధల సాయంతో నియంతృత్వం ప్రభుత్వాలపై…

‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్

ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ “స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” (Free Market Economy) వైపు నడిపించడానికి శ్రమించే ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ధ’ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మాజీ అధినేత, ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’, ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్సు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి లక్ష యూరోల బెయిల్ పై ఉన్న స్ట్రాస్ కాన్, విచారణలో పాల్గొంటున్నవారితోనూ, మీడియాతోనూ మాట్లాడరాదన్న షరతులను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ…