పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…

పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి…

ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం

అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. దేశంలో ధనికుల వద్ద డబ్బు మూల్గుతుంటే పేదలు, మధ్య తరగతి ఆదాయాలు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సంక్షోభ పరిష్కారానికి వెంటనే తట్టే ఆలోచన: ధనికులకు పన్ను పెంచి తద్వారా ఆదాయం పెంచుకోవడం. కాని అమెరికా ప్రతినిధుల సభకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఐడియా తట్టింది. నిజానికి ఇది ఐడియా కాదు విధానం. అమెరికాలోని ప్రతినిధుల సభకు గత సంవత్సరం జరిగిన ఎన్నిల్లో…

ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా,…

ఇండియాలో 2 జి అవినీతి విచారణపై నార్వే ప్రధాని కలవరం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒత్తిడితో “2 జి కుంభకోణం” పై సి.బి.ఐ జరుపుతున్న విచారణ పట్ల నార్వే ప్రధాని స్టోల్సెన్ బర్గ్ కలవరపడుతున్నాడు. నార్వే ప్రభుత్వానికి చెందిన టెలినార్ టెలికం కంపెనీపై కూడా సి.బి.ఐ విచారణ జరుపుతుండడమే దీనికి కారణం. కేంద్ర టెలికం శాఖ మంత్రిగా పనిచేసిన ఎ రాజా అరెస్టు అయినప్పటికీ నార్వే ప్రధాని కలవరపడలేదు. రాజా తర్వాత కపిల్ సిబాల్ టెలికం మంత్రిగా రావడంతో టెలినార్ తో పాటు ఇతర ప్రవేటు టెలికం…

బ్రిక్స్ గా మారిన బ్రిక్ కూటమి, జి-7 తో పోటీకి ఉరకలు?

నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా మార్పు చెందింది. సౌతాఫ్రికా నూతనంగా ఈ కూటమిలో చేరడంతో BRIC కూటమి కాస్తా BRICS కూటమిగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లు కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇది రెండు సమావేశాలను జరుపుకుంది. మూడో సమావేశం సౌతాఫ్రికా తో కలిసి చైనా లోని సాన్యాలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా పేరు పొందిన దేశాలు కలిసి ఏర్పాటయిన…

విద్య, ఆరోగ్యాలకు బదులు న్యాయ, పోలీసు రంగాలకు సాయం చెయ్యండి -ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంకు తన నగ్న స్వరూపాన్ని సిగ్గు లేకుండా బైట పెట్టుకుంది. పేద దేశాలకు సహాయం పేరుతో అప్పులిచ్చే అభివృద్ధి చెందిన దేశాలు తాము కేంద్రీకరించే రంగాలను మార్చాలని కోరింది. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాయనీ, అలా కాకుండా న్యాయ వ్యవస్ధ, పోలీసు వ్యవస్ధలు అభివృద్ధి చెందటానికి సహాయం చేయడం ప్రారంభించాలని కోరింది. సోమవారం విడుదల చేసిన ఒక రిపోర్టులో “ఆయా దేశాల్లో స్ధిరమైన ప్రభుత్వాలను నిర్మించడంపై…

ప్రైవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి దృఢంగా నిరాకరిస్తున్న ఐస్ లాండ్ ప్రజలు

2008 సం. నాటి ద్రవ్య సంక్షోభంలో కుప్పకూలిన ఐస్ లాండ్ ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి ఐస్ లాండ్ ప్రజలు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన రిఫరెండంలో 93 శాతం ప్రజలు ఐస్ లాండ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించగా ఏప్రిల్ 9, 2011 తేదీన జరిగిన మరో పాక్షిక రెఫరెండంలో సైతం 58 శాతం మంది ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని భరించడానికి తిరస్కరించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న “ఐస్ సేవ్” ఒప్పందం ప్రకారం ఐస్…

ముదిరిన పోర్చుగల్ అప్పు సంక్షోభం

గత సంవత్సరమ్ గ్రీసు, ఐర్లండులను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం తాజాగా పోర్చుగల్ ను బలి తీసుకుంది. అప్పు కోసం ఇ.యు, ఐం.ఎ.ఎఫ్ లను దేబిరించడానికి వ్యతిరేకిస్తూ పోర్చుగల్ ప్రధాని, పొదుపు చర్యలతో ప్రతిపాదించిన నూతన బడ్జెట్ పార్లమెంటులో ఓడిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మే నెలలో ఎన్నికలు ముగిసే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్న ప్రధాని జోస్ సోక్రటీసు గురువారం అనివార్యంగా ఇ.యు, ఐం.ఎం.ఎఫ్ లు రూపొందించిన బెయిల్-అవుట్ ప్యాకేజీ నుండి సహాయం అర్ధించవలసి వచ్చింది.…

యూరోజోన్ వడ్డీ రేట్లు పెంచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు

ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మొట్టమొదటి సారిగా వడ్డీ రేట్లను పెంచింది. సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూరోజోన్ దేశాల ఆర్ధికవృద్ధి, సంక్షోభ పరిస్ధుతులను అధిగమిస్తున్న విషయాన్ని సూచిస్తోంది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కడానికి ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను అతి తక్కువ స్ధాయిలో ఉంచి తద్వారా మార్కెట్ కు డబ్బు అందుబాటులో ఉంచాయి. మార్కెట్ కు డబ్బు అధికంగా అందుబాటులో…

జపాన్ అణు రియాక్టర్ లీకేజి, నీరు, భూమి, గాలి లలో రేడియేషన్ మరింత తీవ్రం?

రోజులు గడుస్తున్నకొద్దీ జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టరు వద్ద రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ ప్రమాదం, ప్రమాదకర రేడియేషన్ భయాలు పెరుగుతున్నాయి తప్ప ఉపశమించడం లేదు. అణు విద్యుత్ తో పెట్టుకుంటే ఏర్పడే ప్రమాదాలకు విరుగుడు మనిషి చేతిలో లేదని అంతకంతకూ స్పష్టం అవుతోంది. అత్యంత శుభ్రమైనదీ, పర్యావరణ రక్షణకు అత్యంత అనుకూలమైందీ అన్న పేరుతో పశ్చిమ దేశాలు అణు విద్యుత్ కి ఇటీవల కాలంలో ప్రచారం పెంచాయి. పర్యావరణం తర్వాత సంగతి, ముందు మానవాళి…

రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల్లో చిక్కుకున్న పోర్చుగల్, యూరప్ ని వెంటాడుతున్న అప్పు సంక్షోభం

గ్రీసు, ఐర్లండ్ లను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం ఇప్పుడు పోర్చుగల్ ని బలి కోరుతోంది. ఆర్ధిక సంక్షోభం పేరుతో పోర్చుగల్ ప్రధాని జోస్ సోక్రటీసు బడ్జెట్ లో ప్రతిపాదించిన కఠినమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓటువేయడంతో సోక్రటీసు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటీసు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్నాడు. బ్రసెల్స్ లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సభ యూరోపియన్…

పోర్చుగీసు అప్పు సంక్షోభం నేపధ్యంలో ఇ.యు శిఖరాగ్ర సమావేశం

బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో గురువారం జరగనున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో పోర్చుగీసు అప్పు సంక్షోభం పైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్యునీషియా, ఈజిప్టు పరిణామాలు ఎజెండా గా సమావేశం ఏర్పాడు చేసినప్పటికీ పోర్చుగీసు లో ప్రభుత్వ సంక్షోభం ముంచుకు రావడంతో సమావేశంలో ఆ అంశమే మిగతా అంశాలను పక్కకు నెట్టే పరిస్ధితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పోర్చుగీసు ప్రభుత్వం బడ్జేట్ లో తలపేట్టిన నాల్గవ విడత పొదుపు చర్యలను సమర్ధించడానికి ప్రతిపక్షాలు…

కూలిపోయే దిశలో పోర్చుగల్ ప్రభుత్వం

యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ జడలు విప్పుతోంది. తాజాగా అది పోర్చుగల్ ను బలి కోరుతోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు), ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ తీసుకోవడానికి వ్యతిరేస్తున్న సోషలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన పొదుపు చర్యలను పార్లమెంటు వ్యతిరేస్తుండడంతో పోర్చుగల్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గురువారం జరగనున్న ఇ.యు సమావేశం నాటికి పొదుపు చర్యల బిల్లును ఆమోదించుకుని వెళ్ళాలన్న ప్రధాన మంత్రి “జోస్ సోక్రటీస్” ఆశల్ని వమ్ము చేస్తూ, సోషల్ డెమొక్రట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నది. “బిల్లు…

జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…