ఆర్ధిక వృద్ధికి నష్టమైనా, వడ్డీ రేట్ల పెంపుకే మొగ్గు చూపిన ఆర్.బి.ఐ

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ 16న చేపట్టిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్.బి.ఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటు) కూడా 0.25 శాతం పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల…

ఇ.యు షరతులు, పొదుపు ఆర్ధిక విధానాలపై గ్రీసు కార్మికుల సమర శంఖం

“ఈ ఆర్ధిక విధానాలు, పొదుపు చర్యలకు అనుకూలంగా ఓటు వేయాలంటే పులికి ఉండే క్రూరత్వం కలిగి ఉంటేనే సాధ్యం.” ఈ మాట అన్నది గ్రీకు పార్లమెంటు సభ్యుడు, జార్జి లియానిస్. ఈయన పాలక పార్టీ ఐన సోషలిస్టు పార్టీ సభ్యుడు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్ధ (IMF) లు సహాయం పేరుతో గ్రీసు కి ఇవ్వనున్న అప్పు కోసం గ్రీసు ప్రభుత్వం అమలు చేయవలసిన కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు, చర్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ…

మన్మోహన్ సింగ్ పాలనపై సన్నగిల్లిన వ్యాపారుల విశ్వాసం

వరుస కుంభకోణాలతో తీసుకుంటున్న మన్మోహన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై భారత వ్యాపారులకు, పెట్టుబడుదారులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ – FICCI) సంస్ధలు జరిపిన సర్వేలో ఈ ఫిషయం తేలిందని రాయిటర్స్ పత్రిక ప్రకటించింది. దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారుల విశ్వాసం సన్నగిల్లినందువలన అది విదేశీ పెట్టుబడుదారులకు భారత పాలకులపై గల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సర్వేలు సోమవారం ప్రచురించబడిన…

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బరిలో ఫ్రాన్సు, మెక్సికో అభ్యర్ధులు

ఐ.ఎం.ఎఫ్ అధిపతి పదవికి అంతిమంగా ఇద్దరిని ఆ సంస్ధ షార్ట్ లిస్ట్ చేసింది. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే తో మెక్సికో సెంట్రల్ బ్యాంకు అధిపతి అగస్టిన్ కార్‌స్టెన్స్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఐ.ఎం.ఎఫ్ ఎం.డి పదవికి పోటీ జరగడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకూ బ్రెట్టన్ వుడ్స్ కవలలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ల ఉన్నత పదవులను అమెరికా యూరప్ లు పంచుకునేవి. ప్రపంచ బ్యాంకు…

భారతదేశ ఆర్ధికవృద్ధికి ఫ్యాక్టరీలు, సాఫ్టువేర్, వ్యవసాయం లలొ ఏది కీలకం?

ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గా పరిగణింపబడుతున్న భారత దేశం చైనా తర్వాత అత్యధిక వేగంతో ఆర్ధిక వృద్ధి (జిడిపి పెరుగుదల రేటు) సాధిస్తున్న దేశంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సేవల రంగం (ప్రధానంగా సాఫ్టువేర్, ఆ తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్సు లు కూడా సేవల రంగం కిందికే వస్తాయి) అభివృద్ధి చెందింది. ప్రధానంగా సావ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్ రంగంలో ఔట్ సోర్సింగ్ కి ఇండియా కేంద్రంగా మారింది. నూతన ఆర్ధిక…

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…

షేర్ మార్కెట్లకు ఈ వారం కూడా నష్టాలే!

ఈ వారం షేర్ మార్కెట్లూ నష్టాల్లోనే… భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 మాత్రమే (ఏప్రిల్ 2010 లో ఇది 13.1 శాతం) పెరుగుదలను నమోదు చేయడంతో శుక్రవారం షేర్ మార్కెట్లు నష్టాల్ని చవి చూశాయి. వారం మొత్తం చూసినా షేర్లు నస్టాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 116.36 పాయింట్లు (0.63 శాతం) 18,268.54 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 35.25 పాయింట్లు (0.64 శాతం) 5,485.8 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్…

భూములు దక్కించుకోడానికి పోలీసులతో అమీ తుమీకి సిద్ధమైన పోస్కో బాధితులు

దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి…

దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…

అమెరికా నిరుద్యోగం – బలహీన ఆర్ధిక వ్యవస్ధ – కొన్ని ముఖ్యాంశాలు

అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…

‘ఆడలేక మద్దెల ఓడు’: అమెరికా సమస్యలకు జపాన్, యూరప్‌లే కారణమంటున్న ఒబామా

“ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది అమెరికా అర్ధిక సమస్యలకి బారక్ ఒబామా చూపుతున్న కారణాలు. జపాన్, యూరప్ ల వలన అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేక పోతున్నదని బారక్ ఒబామా చెబుతున్నాడు. జపాన్ భూకంపం, యూరప్ అప్పు సంక్షోభాలే అమెరికా ఆర్ధిక వృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఒబామా తాజా పరిశోధనలో కనిపెట్టారు. ఇంతవరకూ ఏ ఆర్ధిక వేత్తగానీ, విశ్లేషకులు గానీ చేయనటువంటి విశ్లేషణ ఇది. అమెరికా ప్రభుత్వం తాజాగా శుక్రవారం వెలువరించిన గణాంకాలు అమెరికా…

అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్

రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి

మార్చి 11 న సంభవించిన భూకంపం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీ వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి జరిగిన ప్రమాదాన్ని జపాన్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్ధ ఐ.ఎ.ఐ.ఎ తన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నది. సముద్రం ఒడ్డున నిర్మించిన ఫుకుషిమా కేంద్రానికి సునామీ వలన ఏర్పడగల ప్రమాదాన్ని అంచనా వేయడంలోనూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ జపాల్ విఫలమైందని ఆ సంస్ధ తెలిపింది. నివేదికను…

భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…