పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…

ఆర్ధిక సంక్షోభం దెబ్బకు కుప్పకూలనున్న గ్రీసు ప్రభుత్వం

గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా…

యూరోజోన్ విచ్ఛిన్నం ప్రారంభం, గ్రీసును సాగనంపడానికి ప్రయత్నాలు

12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…

ఆర్ధిక మాంద్యానికి (రిసెషన్) చేరువలో ఇంగ్లండు

యూరప్‌లో అతి పెద్ద ద్రవ్య మార్కెట్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బ్రిటన్ ఆర్ధిక మాంద్యం కు చేరువలో ఉందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. మూడో క్వార్టర్ (జులై, ఆగస్ఠు, సెప్టెంబరు)లో ఆర్ధిక వృద్ధి అనుకున్నదాని కంటె మెరుగ్గానే ఉన్నప్పటికీ నాలుగో క్వార్టర్ లో అది బాగా క్షీణించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ మంగళవారం విశ్లేషించింది. యూరోజోన్ రుణ సంక్షోభం ఇంకా శాంతించకపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ పై చూపుతున్నదని ఆ సంస్ధ విశ్లేషించింది. మూడో క్వార్టర్ లో బ్రిటన్…

16 సంవత్సరాల్లో 2.5 లక్షల రైతుల ఆత్మ హత్యలు

భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…

మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి

మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా

యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా…

ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం

చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…

ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…

యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు

శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి. యూరప్ రుణ సంక్షోభం…

రోమింగ్ ఛార్జీలు లేని ‘నూతన టెలికం విధానం,’ అందరికీ బ్రాడ్‌బాండ్(అట)

కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి కపిల్ సిబాల్ ‘నూతన్ టెలికం విధానం’ (ఎన్.టి.పి) ప్రకటించాడు. రోమింగ్ ఛార్జిలు లేని ఈ విధానంలో ఐదు ప్రధాన అంశాలున్నట్లు ప్రకటించాడు. పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు పైకి కనిపిస్తున్న ఈ విధానం పూర్తి వివరాలు అందితే తప్ప మంచి, చెడులను నిర్ధారించలేము. కపిల్ ప్రకటించిన ఐదు ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి. డిమాండ్ చేయడంతోనే బ్రాడ్‌బాండ్ (బ్రాడ్‌బాండ్ ఆన్ డిమాండ్) ఒక దేశం-ఒక లైసెన్సు విధానం. దీని ప్రకారం రోమింగ్…

సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం

అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి. సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల…

గ్రీసు కష్టాలు తీరాలంటే తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలి -జర్మనీ మంత్రి

యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు కోసం ప్రకటిస్తూ వచ్చిన బెయిలౌట్ల అసలు ఉద్దేశం ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. గ్రీసు, రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో అవి రెండు బెయిలౌట్ల పేరుతో కఠిన రుణాలను మంజూరు చేస్తున్న సంగతి విదితమే. అత్యంత దారుణమైన షరతులతో ఇచ్చిన ఈ రుణాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. గ్రీసు జిడిపి దారుణంగా పడిపోయింది. రుణ షరతుల ఫలితంగా ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడంతో సంభవించిన ఫలితమిది. వారి షరతులను పూర్తిగా…