పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా

ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…

హెచ్చరిక లేకుండా దాడి చేస్తే అనుమతి కోసం చూడకుండా బదులివ్వండి -పాక్ ఆర్మీ ఛీఫ్

హెచ్చరికలు లేకుండా పై దాడి జరిగితే పాకిస్ధాన్ సైనికులు తిరిగి దాడి చేయడానికి ఇక తమ పై అధికారుల అనుమతి తీసుకోనవసరం లేదని పాకిస్ధాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ కయానీ పాకిస్ధాన్ కమేండర్లకు చెప్పాడు. పాకిస్ధాన్ చెక్ పోస్టులపై దాడి చేసి అమెరికా కమెండోలు పాక్ సైనికులను చంపడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. “ఏ ఒక్క పాకిస్ధాన్ కమాండర్ మదిలో కూడా ఈ విషయంలో, ఏ స్ధాయిలోనైనా సరే, ఎటువంటి అనుమానం ఉంచుకోరాదు. తిరిగి…

పాకిస్ధాన్ ప్రతినిధులు ఓ.కె అన్నాకే అమెరికా దాడి చేసింది -వాల్‌స్ట్రీట్ జర్నల్

ఇరవై నాలుగు మంది పాకిస్ధానీ సైనికులు చనిపోవడానికి కారణమైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్ల దాడిని ‘ఉమ్మడి కమాండ్ సెంటర్’ లోని పాకిస్ధాన్ ప్రతినిధులు ఆమోదించిన తర్వాతే చేశామని అమెరికా కమేండర్లు చెప్పినట్లుగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలిపింది. కమాండ్ సెంటర్ లో ఉన్న పాకిస్ధాని ప్రతినిధులకు దాడి జరిగే చోట పాకిస్ధాన్ తాత్కాలిక పోస్టు నెలకొల్పిందని తెలియకపోవడంతో వారు దాడికి పచ్చ జెండా ఊపారని అమెరికా కమేండోలు తెలిపారు. అయితే కాల్పులు ప్రారంభం అయ్యాక…

మా చెక్‌పోస్టులపై దాడి చేస్తున్నామని అమెరికాకి ముందే తెలుసు -పాక్ మిలట్రీ

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్ధాన్ చెక్ పోస్టులపైనే తాము దాడి చేస్తున్నామన్న సంగతి అమెరికా హెలికాప్టర్లకూ, జెట్ ఫైటర్లకూ ముందే తెలుసనీ, తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారనీ పాకిస్ధాన్ మిలట్రీ వ్యాఖ్యానించింది. పాకిస్ధాన్ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ ఈ మేరకు పత్రికలకు వివరాలు వెల్లడించాడు. అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధానీ చెక్ పోస్టులపై దాడి చేస్తున్నారని అమెరికా బలగాలను అప్రమత్తం చేసినప్పటికీ కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపాడు. పత్రికా…

అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో…