లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…

ఫ్రాన్సు కండకావరం

ఆఫ్రికాలో ఫ్రాన్సు కండకావరానికి మరో దేశం బలయ్యింది. ఐవరీకోస్టు దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బోను శాంతి పరిరక్షణ పేరుతో దేశంలొ తిష్ట వేసిన ఫ్రాన్సు సైన్యాలు అరెస్టు చేశాయి. ఫ్రాన్సు సేనలు అధ్యక్షుడి ఇంటిపైకి తమ ట్యాంకులను నడిపించాయి. ఇంటి ప్రహరీగోడను కూల్చివేస్తూ లోపలికి చొచ్చుకెళ్ళి అధ్యక్షుడు జిబాగ్బోను అరెస్టు చేసినట్లుగా అతని సహాయకుడు వార్తా సంస్ధలకు తెలిపాడు.అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లారెంట్…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల…

లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…

పౌరుల రక్షణ పేరుతో ఐవరీకోస్ట్ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసిన సమితి, ఫ్రాన్సు సైన్యాలు

ప్రతి సభ్య దేశం పట్ల నిష్పాక్షింగా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి నిజానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాల జేబు సంస్ధ అని మరో సారి రుజువయ్యింది. ఐవరీ కోస్టు దేశ అధ్యక్షుడి భవనంపై ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి స్ధాపనా సైనికులు, ఫ్రాన్సుకి చెందిన సైనికులు సోమవారం బాంబు దాడులు నిర్వహించాయి. అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో నివాస భవనం, ప్రభుత్వ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ గార్డుల భవనం, పారామిలిటరీ కార్యాలయం లపై ఫ్రాన్సు, సమితి సైన్యాలు…

లిబియాలో ఫిబ్రవరి 17 న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన కోసం పధకం

యెమెన్, బహ్రెయిన్, ఇరాన్ ల అనంతరం ఇప్పుడు లిబియాలో ప్రభుత్వ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలకు పిలుపినిచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శకులు ప్రధానంగా ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ లిబియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసే బలం ప్రభుత్వ వ్యతిరేకులకు లేదని పరిశీలకుల అభిప్రాయం. గురువారం, ఫిబ్రవరి 17న “ఆగ్రహ దినం” జరపాలని నిరసనకారులు నిర్ణయించుకోగా దానికి ఒక రోజు ముందే లిబియాలోని ఓడరేవు పట్టణమయిన బెంఘాజి లో లిబియా నాయకుడు “మహమ్మద్ గఢాఫి” వ్యతిరేక, అనుకూలుర మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొద్ది…