ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు
మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…