వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది

బహుశా ఇంత మొత్తంలో డబ్బు, నగలు, వజ్రాలు పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత విలువ ఉంటుందో తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టేటంత డబ్బు, నగలివి. ముంబై రైల్వే స్టేషన్ నుండి గుజరాత్ కు రవాణా కానుండగా పట్టుబడింది. 40 మంది అంగడియాలు నాలుగు ట్రక్కుల్లో, 150 గోతాల్లో నింపుకుని డబ్బు కట్టలు, బంగారు నగలు, వజ్రాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), ఇన్ కమ్…

బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…