‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా…

విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి, ప్రధానితో అన్నా బృందం

ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్ నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. “తనపై కేశినా ఆరోపణలు ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు. మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు…

రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?

జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం…

జూలియన్ అస్సాంజ్: స్వీడన్ తరలింపుకు ఇంగ్లండ్ కోర్టు అంగీకారం

ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ ‘జూలియన్ అస్సాంజ్’ ను స్వీడన్ కు తరలించడానికి ఇంగ్లండు సుప్రీం కోర్టు అంగీకరించింది. జూలియన్ ను తమకు అప్పగించాలన్న స్వీడన్ ప్రాసిక్యూటర్ల కోరిక న్యాయబద్ధమేనని మెజారిటీ తీర్పు ప్రకటించింది. ‘రీ ట్రయల్’ కు జూలియన్ కోరవచ్చని తెలుస్తోంది. దానివల్ల తరలింపు మరింత ఆలస్యం అవుతుందే తప్ప ఆపడం జరగకపోవచ్చని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ పత్రికలు వ్యాఖ్యానించాయి. డిసెంబరు 2010 లో జూలియన్ బ్రిటన్ లో అరెస్టయ్యాడు. ఒక మహిళను రేప్…

అలో బి.బి.సి… నీ కిది తగునా?

సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ కు సంబంధించి పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు సిరియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి మరోసారి లోకానికి వెల్లడయింది. 2003 సంవత్సరంలో ఇరాక్ యుద్ధంలో తీసిన ఫోటోను ఆదివారం సిరియాలో జరిగిన హత్యాకాండగా చెప్పడానికి బి.బి.సి చేసిన ప్రయత్నం ‘ది టెలిగ్రాఫ్’ వెల్లడి చేసింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల ఆయుధ, ఫైనాన్స్ సాయంతో, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి మత ఛాందస ప్రభుత్వాల ప్రత్యక్ష మద్దతుతో సిరియా…

ఆఫ్ఘన్ ఫ్రెంచి బలగాలన్నీ ముందే ఉపసంహరణ

ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం…

ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది.  వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం…

టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ

దేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి…

‘పొదుపు విధానాల’ పై ఇటాలియన్ల సమ్మె

ఇటలీ నగరంలో పొదుపు విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యార్ధులపైన పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. దక్షిణ ఇటలీ నగరం నేపుల్స్ లో పోలీసులు, ప్రజల ఘర్షణలు తీవ్ర స్ధాయిలో జరిగాయని ప్రెస్ టి.వి తెలిపింది. ప్రభుత్వ పన్నుల విధానాలతో ఆగ్రహం చెందిన కార్మికులు, విద్యార్ధులు పన్నుల కార్యాలాయం ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ప్రదర్శకులను తరిమివేయడానికి ప్రయత్నించడంతో ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దానితో విద్యార్ధులు కార్మికులు పోలీసులపై బాటిళ్ళు, కోడిగుడ్లు విసిరారని పత్రికలు…

క్లుప్తంగా… 10.05.2012

జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు   జాతీయం జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం జీన్స్, టీ షర్ట్ లు అసభ్య దుస్తులనీ వాటిని వేసుకొని ఆఫీసుకి రావద్దని హర్యానా ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నా అందుకు…

క్లుప్తంగా… 07.05.2012

జాతీయం మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ 2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం…