‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2
– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…