బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) — — — ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’…

ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల…

కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం…

వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…

ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం…

ఎంబసీ నుండి బైటికి వస్తే అస్సాంజ్ అరెస్టు ఖాయం

జూలియన్ అస్సాంజ్ ఈక్వెడార్ ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేయడానికి లండన్ పోలీసులు ఎంబసీ ముందు కాపు కాశారు. ఎంబసీ లోకి ప్రవేశించడం ద్వారా కోర్టు బెయిల్ షరతులలో ఒకటయిన ‘రాత్రి పూట కర్ఫ్యూలో ఉండవలసిన’ నిబంధనను జులియన్ ఉల్లంఘించాడని లండన్ పోలీసులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకూ తనకు నిర్దేశించిన ఇంటినుండి అస్సాంజ్ బైటికి రాకూడదనీ, కానీ ఆయన మంగళవారం మొత్తం ఈక్వెడార్ ఎంబసీలో…

ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ

ఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని…

ఇంటర్నెట్ సెన్సార్ షిప్ లో అమెరికా తర్వాత స్ధానం ఇండియాదే -గూగుల్

2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలుగా వర్ధిల్లుతుండడం గమనార్హం. 2011 లో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగంలో ఇండియా నుండి 49 శాతం ఎక్కువగా సెన్సార్ షిప్ ఆదేశాలు అందాయని గూగుల్…

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని…

రక్షిస్తానని వచ్చి లిబియా పౌరులను భక్షించిన రోగ్ ‘నాటో’

ఆయుధ మదంతో అచ్చోసిన ఆంబోతులా ప్రపంచంలోని స్వతంత్ర దేశాలను కబళిస్తున్న నాటో, ‘మానవతా జోక్యం’ పేరుతో పశువులా తెగబడుతున్న వైనాన్ని ఐక్యరాజ్య సమితి నివేదికలు, మానవ హక్కుల సంస్ధలు ఈసడిస్తున్నాయి. గడ్డాఫీ బారినుండి లిబియా పౌరులను రక్షిస్తానంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న నాటో, వైమానిక బాంబు దాడులతో  వేలమంది పౌరుల్ని చంపేసి అంతర్జాతీయ సంస్ధల విచారణకు మోకాలడ్డుతోందని హార్ట్ ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ లో బోధిస్తున్న విజయ్ ప్రసాద్ ‘ది…

తమ సిరియా దుష్ప్రచారానికి తామే బలైన బ్రిటన్ విలేఖరులు

సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ పై వివాదాస్పద రీతిలో ఏకపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ దేశాల విలేఖరులకు కాస్తలో చావు తప్పింది. దుష్ట బుద్ధితో తాము రాస్తున్న అవాస్తవ వార్తలకు సరిగ్గా వ్యతిరేక అనుభవం ఎదురై ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ బైటపడ్డారు. తమ చావు ద్వారా అంతర్జాతీయంగా జరుగుతున్న దుష్ప్రచారంలో అదనపు పాయింట్లు కొట్టేద్దామనుకున్న కిరాయి తిరుగుబాటుదారుల అసలు స్వరూపం వెల్లడి చేయక తప్పని పరిస్ధితి చానెల్ 4 చీఫ్ కరెస్పాండెంట్ ‘అలెక్స్ ధాంసన్ ఎదుర్కొన్నాడు. కిరాయి…

సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా

సిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై…

అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చు పెట్టిన సంగతిని వెలికి తీసి దేశాన్ని నివ్వెరపరిచిన 62 సంవత్సరాల సుభాష్ అగర్వాల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టీ చుక్క ముట్టని ఈ లేఖాయుధుడు పత్రికలకు లేఖలు రాసి ఆ లేఖలనే ఆయుధాలుగా ప్రభుత్వంలోని అనేక విభాగాలలో జరుగుతున్న అనేక తప్పులను సవరించుకునేలా ఒత్తిడి చేసిన ధీమంతుడు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్ అధికారులకు ప్రజల పట్లా, వారి అవసరాల పట్లా ఉన్న ఉదాసీనతనూ, ఛీత్కార…

ఫాలక్, అఫ్రీన్… నేడు షిరీన్

మనుషుల్లో మృగత్వానికి అంతే లేకుండా పోతోంది. భర్త చేత విస్మరించబడి, మరో తోడు కోసం ఆశపడి వ్యభిచార కూపంలో చిక్కిన తల్లికి తనయగా పుట్టిన ఫాలక్, పురుషాధిక్య సమాజం క్రూరత్వానికి బలై రెండేళ్ల వయసులోనే కాటికి చేరి రెండు నెలలయింది. తండ్రికి అవసరం లేని ఆడపిల్లగా పుట్టి తండ్రి చేతుల్లో చిత్ర హింస అనుభవించిన మూడు నెలల అఫ్రీన్ మరణం ఇంకా మరుపులో జారిపోనేలేదు. మరో ఫాలక్, షిరీన్ పేరుతో ఇండోర్ ఆసుపత్రిలో చేరింది. షిరీన్ వయసు…