ఉక్రెయిన్ సంక్షోభం: స్వీడన్ మిలట్రీ వ్యయం పెంపు

ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడవేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు భారత పాలకులు మద్దతు ఇవ్వగా రష్యా అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. రష్యాతో శక్తి వనరుల వాణిజ్యాన్ని 2018 నాటికి మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని చైనా చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ రోజు (ఏప్రిల్ 22) ఉక్రెయిన్ సందర్శించి నాజీ పాలకులకు మద్దతు ప్రకటించాడు. సోవియట్ రష్యా పతనం తర్వాత తన మిలట్రీ ఖర్చును బాగా తగ్గించుకున్న స్వీడన్ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా…

ఉక్రెయిన్ సంక్షోభం: మరింత దగ్గరవుతున్న రష్యా, చైనా

ఉక్రెయిన్ సంక్షోభం పలు భౌగోళిక రాజకీయాలకే కాకుండా ఆర్ధిక పరిణామాలకు కూడా బాటలు వేస్తోంది. ఐరోపా, రష్యాల మధ్య కీలక స్ధానంలో ఉన్న ఉక్రెయిన్ ను నిస్పక్ష ప్రాంతంగా నిలిపి ఉంచడం ద్వారా నాటో దూకుడుని రష్యా పాక్షికంగానైనా నిరోధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ నాటో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తన విదేశాంగ విధానాన్ని సవరించుకోవలసిన తక్షణ అవసరం రష్యాకు ఏర్పడింది. రష్యా శక్తి వనరులకు పెద్ద వినియోగదారుగా ఉన్న ఐరోపాకు బదులు ఆ స్ధానాన్ని భర్తీ…

మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్

“హుర్రే… ‘మోడి గాలి లేదు’ గాలి వీస్తోందోచ్…” – గాలి పలు విధాలు. తూర్పు గాలి, పడమటి గాలి… ఇలా వీచే దిశ, కాలాల్ని బట్టి గాలి కలిగించే ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. పడమటి గాలిని మనం భరించలేం. సముద్రం మీది నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుందనుకుంటాం. కానీ అది మోసుకొచ్చే ఉప్పు నీటియావిరి జిడ్డుని అంటగడుతుంది.  దానితో చల్లదనం అటుంచి దేహం చిరచిరలాడుతుంది. ఈ గాలి లాగానే ఎన్నికల గాలులు కూడా పలు…

అందాల ఆకాశ రాజ్యం లెసోతో -ఫోటోలు

మనకి అరకు, ఊటీ లాంటి ఎత్తైన ప్రాంతాలు విహార స్ధలాలు. సముద్ర మట్టానికి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం పొడవునా చల్లటి వాతావరణం జనాన్ని సేదతీరుస్తుంది. కానీ దేశం దేశమే కొండలపైన ఉంటే? ఇక ఆ దేశం అంతా అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది. అలాంటి దేశం ఆఫ్రికా లోని లెసోతో. ప్రతి దేశానికి దిక్కులుంటాయి. అనగా ఉత్తరాన ఫలానా, దక్షిణాన ఫలానా… ఇలా. కానీ లెసోతో ఒక విధంగా దిక్కులు…

గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం

ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరిని తప్పు పట్టాలో తెలియని వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లు సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం అంతా ఇంతా కాదు. వయసు లేదు, విలువ లేదు, పద్ధతి లేదు, ఎవల్యూషన్ అసలే లేదు. పరిచయం చూస్తేనేమో ఫేస్ బుక్ లాంటి వర్చువల్ ప్రపంచంలో. దాని వాస్తవ పరిణామాలేమో నిజ ప్రపంచం పైన! 43 సంవత్సరాల ఒక గృహిణి 22 సంవత్సరాల యువకుడితో (సోకాల్డ్) ప్రేమలో పడిపోయింది.…

జాబ్: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్; జీతం: సున్న -వీడియో

ఉద్యోగం పేరు చూస్తేనేమో గొప్ప పేరు: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. జీతం ఎంత అంటే ఏమీ ఇవ్వం అంటున్నారు. పైగా 24 గంటలు పని చేయాలిట. ఇంటర్-పర్సనల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా ఉండాలిట. అలా ఎలా చేస్తారంటే అనేకమంది చేస్తున్నారని చెబుతున్నాడీ పెద్ద మనిషి. ఇంతకీ అంత నిస్వార్ధంగా అంత పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నది ఎవరు? వీడియో చూసి తెలుసుకోవాల్సిందే.

అద్వానీజీ, హామీలు మరిస్తే నిషేధం వద్దా?

బి.జె.పి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రజాస్వామ్యంపై హఠాత్తుగా బెంగ పట్టుకుంది. జనం ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని జనం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నారు. జనం కోసం జరిగే ఎన్నికల్లో జనమే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతికేను అన్నది అద్వానీ భయం! “ఓటు వేయని ప్రజలపైన అపరాధ రుసుము…

ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్

“ఎన్నికలను కూడా ఇలాగే ఊడ్చేయగలిగితే బాగుడ్ను!” – ఎన్నికలలో ఖర్చు కోసం పరిశుభ్రమైన డబ్బు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా పిలుపు ఇవ్వడంతోనే రెండు రోజుల్లో 1.15 కోట్ల రూపాయలు వసూలయ్యాయట. అత్యంత పెద్ద మొత్తం తమిళనాడు నుండి అందిన రు. 1 లక్ష కాగా, అత్యంత చిన్న మొత్తం రు. 10 అని ఎఎపి నేతలు చెప్పారు. అరవింద్ ట్విట్టర్ లో చేసిన విన్నపం ఇది: “Reached Varanasi. Will go to…

చలి నీళ్ళకు పిల్లలు తట్టుకోలేరనుకున్నా -ద.కొరియా నౌక కెప్టెన్

నౌక ఖాళీ చేయమని ఆదేశాలిస్తే పిల్లలు అంత చలిలో చల్లటి నీళ్ళకు తట్టుకోలేక చనిపోతారని భావించానని దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురయిన ‘సెవొల్’ కెప్టెన్ కోర్టుకు తెలిపాడు. అందుకే వారిని వెంటనే పడవ ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడానికి తటపటాయించానని కెప్టెన్ లీ జూన్-సియోక్ చెప్పారు. పడవ ఖాళీ చేయాలని కోరడంలో 40 ని.లు ఆలస్యం కావడంతో ఎక్కువమంది తప్పించుకోలేక నౌకలోనే చిక్కుకుపోయారు. 32 మంది మరణాలను దక్షిణ కొరియా ప్రభుత్వం ధృవీకరించగా ఇంకా 273 మంది జాడ…

కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల డిమాండ్. సంఘ్ పరివార్ సంస్ధల్లోనూ, కేడర్ లోనూ హిందూత్వ హార్డ్ లైనర్ గా ప్రసిద్ధి చెందిన నరేంద్ర మోడి కాశ్మీరు వేర్పాటు వాదులతో అందునా హార్డ్ లైనర్ నేతలతో రాయబారం నడుపుతారని ఊహించగలమా? ఊహించలేం. కానీ మోడి ఆ పని చేశారని కాశ్మీరు వేర్పాటువాద నేతల్లో హార్డ్ లైనర్ గా పేరు పొందిన సయ్యద్ ఆలీ…

ప్రమాదవశాత్తు ప్రధాని, ప్రమాదాల ప్రధాని -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్…

మోడి వికాస పురుషుడు కాదు, వినాశ పురుషుడు -ఉమాభారతి

ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఒకరి బండారం మరొకరు బైటపెట్టుకునే పనులు జోరందుకున్నాయి. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటి’ అంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జనానికి ఏమిటి, ఎలా చేస్తామో చెప్పడం మాని ‘నువ్వు వెధవ’ అంటే ‘నువ్వు వెధవ’ అని తిట్టిపోసుకుంటున్నాయి. ‘రీ కౌంటింగ్ మంత్రి’ అని ఒకరు వెకిలి చేస్తే ‘ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి’ అని మరొకరు గుట్టు విప్పుతున్నారు. మోడిపై గతంలో ఉమాభారతి చేసిన విమర్శల వీడియోను తాజాగా వెలికి తీయడం…

ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…

300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు

దక్షిణ కొరియాలో మహా విషాధం సంభవించింది. వందలాది మంది పాఠశాల పిల్లల్ని ఒక ద్వీపానికి విహార యాత్రకు తీసుకెళ్తున్న ఒక నౌక ప్రమాదానికి గురయింది. హఠాత్తుగా పక్కకు ఒరగడం మొదలు పెట్టిన నౌక క్రమంగా సాయంత్రానికి నీళ్ళల్లో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. టైటానిక్ పడవ మధ్యలో విరిగిపోయినట్లు ఈ పడవ విరగలేదు గానీ బైటి జనం, ఫోటోగ్రాఫర్లు చూస్తుండగానే కాస్త కాస్త మునిగిపోతూ పెను విపత్కర దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది. నౌక మునిగిపోతున్నప్పటికీ దానిని వెంటనే ఖాళీ…

ఢిల్లీ మెట్రోల్లో మహిళా జేబుదొంగలే ఎక్కువ

ఢిల్లీ నమోదు చేసిన విచిత్రం ఇది. ఢిల్లీ మెట్రో రైళ్లలో గత నెలలో 27 మంది జేబు దొంగలని అరెస్టు చేయగా వారిలో 26 మంది మహిళలే. ఈ నేపధ్యంలో మహిళా జేబు దొంగల సంఖ్య బాగా పెరుగుతోందని ఢిల్లీ పోలీసులు మొత్తుకుంటున్నారు. గతేడు 400 పిక్ పాకెట్ కేసుల్ని ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అందులో 90 శాతం వరకూ మహిళలే ముద్దాయిలుగా దొరికిపోయారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీళ్ళెవరూ సంఘటిత గ్యాంగులకు చెందిన వారు…