ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!

సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే…

మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2

పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ -1

(గోపాల కృష్ణ గాంధీ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి మరియు రాయబారి. 2004-2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ, 2005-2006 మధ్య బీహార్ అఫీషియేటింగ్ గవర్నర్ గానూ పని చేశారు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు కూడా. ది హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)  ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ

ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు అంత తేలికయిన విషయం కాదు. ఎందుకంటే మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే…

ఎన్నికలయిపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? -పతంజలి

దీనిని పతంజలి, ఉదయం దినపత్రికలో, 29.12.1984 తేదీన రాశారంట. ఈ నాటి పరిస్ధితులకు కూడా ఇంకా ఎంత చక్కగా సరిపోయిందో చూడండి.: https://www.facebook.com/loknath.kovuru/posts/4175978093833 -తిరుపాలు ***          ***           ***          *** ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఒక ఆడకూతురిలా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది తీరని కోరికలతో లక్ష బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది…

బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది. నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ…

ఈ హిందూత్వ అభిమాని బూతు కూతలు చూడండి!

ఈ వ్యక్తి పేరును ఉటంకించే ధైర్యం నేను చేయలేకున్నాను. ఆ పేరు నిజానికి హిందూ ప్రజలు ఇష్టంతో కొలుచుకునే దైవం పేరు. కానీ ఈయనగారి బూతు పాండిత్యం చూస్తేనేమో హిందూ భక్తులకు తధ్యంగా అసహ్యం వేస్తుంది. మరీ ముఖ్యంగా హిందూ సంస్కృతి గొప్పదనం గురించి, సుప్రిమసీ గురించి వివరించే వ్యాసాలకూ, వీడియోలకూ ఎక్కడెక్కడ నుండో లింకులు తెచ్చే పోస్ట్ చేసే సంస్కృతీ పరిరక్షకుడు తాను రక్షిస్తానని చెప్పే సంస్కృతిని పీక నులిమి చంపడానికి ఏ మాత్రం వెనుదీయని…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

మెక్సికో: తుపాకి పట్టిన జనం, డ్రగ్స్ మాఫియా పరార్ -ఫోటోలు

ఏలేవాడికి చేతగాకపోతే జనమే తమని తాము ఎలా రక్షించుకుంటారో మెక్సికో లోని మిచోకాన్ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. కిడ్నాప్ లకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను గుప్పెట్లో పెట్టుకున్న ‘ద నైట్స్ టెంప్లార్’ అని డ్రగ్స్ ముఠాను ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఏమీ చేయలేకపోయాయి. నిమ్మ, వెన్న పండు (Avocado) పండించే రైతులకు కూడా వివిధ డ్రగ్స్ ముఠాలు బెడదగా మారినప్పటికీ పోలీసుల నుండి గానీ, సైన్యం నుండి గానీ జనానికి ఏమీ సహాయం…

కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

బొకో హరమ్ కిడ్నాప్, మిచెల్లే ఒబామా హిపోక్రసీ

నైజీరియా పాఠశాల విద్యార్ధినుల కిడ్నాప్ విషయంలో అమెరికా ప్రధమ మహిళ మిచెల్లే ఒబామా తీసుకున్న చొరవ అధ్యక్షుడు ఒబామాకు ఎదురు తిరిగింది. కిడ్నాప్ అయిన అమ్మాయలను వెనక్కి తేవాలంటూ మిచెల్లే ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, దాదాపు అన్నీ పత్రికల్లోనూ హల్ చల్ చేసింది. ఒబామా విధ్వంసక డ్రోన్ దాడుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న అనేకమంది వ్యక్తులు, సంస్ధలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఒబామా ముందు తన డ్రోన్ లను…

టర్కీ: బొగ్గు గని కూలి 300కి పైగా దుర్మరణం!

గని ప్రమాదాలకు పేరు పొందిన టర్కీ మరోసారి తన పేరు నిలుపుకుంది. పశ్చిమ టర్కీ నగరం సోమా లో బొగ్గు గని కూలి 300 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటివరకూ 245 మంది మరణాలను అధికారులు ధృవీకరించారని బి.బి.సి తెలిపింది. మరో 120 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 450 మంది బతికి బైటపడ్డారని తెలుస్తోంది. జీవించి ఉన్నవారి ప్రాణాలు నిలపడానికి ఆక్సిజన్ వాయువును గనిలోకి పంపింగ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…

భారత ఇస్లాంను దురాక్రమిస్తున్న వహాబీయిజం

భారత ముస్లిం మత వ్యవస్ధ క్రమంగా వహాబీయిజం చేతుల్లోకి వెళ్తోందని, దీనిని అరికట్టకపోతే విపరిణామాలు తప్పవని ముస్లిం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిన భారత ఇస్లాం ను వహాబీయిజం దురాక్రమిస్తోందని, తద్వారా విద్వేష బీజాలు నాటుతూ ఉగ్రవాద భావాలను పెంపొందిస్తున్నదని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సూఫీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా పెంచి పోషిస్తున్న వహాబీ ముస్లిం టెర్రరిజం ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో విధ్వంసం…