రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…

1 వరల్డ్ వార్: జల యుద్ధం -ఫోటోలు

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పత్రికలు ఆ నాటి యుద్ధ రీతులను చర్చలోకి తెస్తున్నాయి. ఈ యుద్ధం సందర్భంగానే జల తల యుద్ధానికి ఎనలేని ప్రాముఖ్యత వచ్చి చేరింది. అనేక కొత్త కొత్త యుద్ధ నావల ప్రాధమిక రూపాలు మొదటి ప్రపంచ యుద్ధంలో వాడుకలోకి తెచ్చారు. ఆనాటికి నౌకా బలగంలో బ్రిటన్ పెట్టింది పేరు. నావల ద్వారానే ఖండాంతరాలకు ప్రయాణం కట్టి వ్యాపారం పేరుతో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

సునంద పుష్కర్ పోస్ట్ మార్టంలో యు.పి.ఏ ఒత్తిడి?

కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్…

ఫుట్ బాల్ వీరుడు మోడి -కార్టూన్

నడుస్తున్నది ప్రపంచ ఫుట్ బాల్ సీజన్. కాబట్టి బంతిని రెండు స్తంభాల నడుమకు నెట్టేస్తే సరిపోతుంది. కానీ రానున్నది అసలు పందెం. ఈ పందెంలో స్తంబాల మధ్య నెట్టడానికి బంతీ ఉండదు. ఆట ఆడితే మోగే చప్పట్లూ ఉండవు. ఎందుకంటే ఆ అసలు పందెంలో అన్నీ దాటి తీరవలసిన ఆటంకాలే. 30 రోజుల ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడానికి ఏమీ ఉండదని కార్టూనిస్టు ఇలా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభ రోజులను అధికార పార్టీకి హానీ మూన్…

సామాన్యుడి ఎద్దు పరుగు -కార్టూన్

ధూ, దీనెమ్మ, జీవితం! అని జీవితంలో ఒక్కసారన్నా విసుక్కోని సామాన్యుడు ఈ భూమి మీద ఉంటాడా? నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి మెజారిటీ సీట్లు వచ్చింది లగాయితు భారత స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతూ దూసుకుపోతున్న వార్తాలే రోజూ. స్టాక్ మార్కెట్ సూచీ పెరుగుతూ పోతుంటే బుల్ మార్కెట్ అనీ, తగ్గుతూ పోతుంటే బేర్ (ఎలుగుబంటి) మార్కెట్ అనీ సంకేతాలు పెట్టుకున్నారు. షేర్ మార్కెట్లలో మధ్యతరగతి బడుగు జీవులు కూడా మదుపు చేస్తున్నప్పటికీ వారి…

భారత్ అణు కార్యక్రమంపై అమెరికా కన్ను పడింది

‘రంగు పడుద్ది!’ అని ఏదో సినిమాలో కామెడీ విలన్ ఏ.వి.యస్ అంటారు(ట)! బహుశా (కత్తితో పొడిచి) హత్య చేస్తే ఎర్రటి రక్తం చిందుతుంది గనుక రక్తం కారుద్ది అనడాన్ని విలన్ చేత ఆ విధంగా చెప్పించి ఉండాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా కన్ను పడినా దాదాపు అదే పరిస్ధితి. అమెరికా కన్ను పడిన ఏ దేశమూ ఇంతవరకూ బతికి బట్టకట్టింది లేదు, ఒక్క ఇజ్రాయెల్ తప్ప. ఇజ్రాయెల్ ఒక్కోసారి అమెరికాను మించిన దిగజారుడుని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్…

ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర

సౌదీ అరేబియా, కతార్, టర్కీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ద్వారా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు సిరియాలో రెచ్చగొట్టి కొనసాగిస్తున్న కిరాయి తిరుగుబాటులో ఐ.ఎస్.ఐ.ఎల్/ఐ.ఎస్.ఐ.ఎస్ పాత్ర రహస్యం ఏమీ కాదు. వారిని మోడరేట్ ఉగ్రవాదులుగా పేర్కొంటూ కొన్నిసార్లు బహిరంగంగానే ఆయుధ, ధన, గూఢచార సహాయం అందజేసింది అమెరికా. తాజాగా బహిరంగంగానే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని ఒబామా ప్రకటించాడు. టర్కీ, జోర్డాన్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సి.ఐ.ఏ సైనిక శిక్షణ…

ఇసిస్ మెరుపు పురోగమనం: ఇరాక్, సిరియాల విచ్ఛిన్న కుట్రలో భాగం

ఇరాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా జూన్ మూడో వారం నుండి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒక్కసారిగా వార్తలు గుప్పించడం మొదలు పెట్టాయి. ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆల్-షామ్ (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంత్ (ISIL)’ అనే ముస్లిం టెర్రరిస్టు సంస్ధ మెరుపు వేగంతో ఇరాక్ లో దూసుకు వెళ్తోందని, అమెరికా శిక్షణ గరిపిన సుశిక్షిత…

బంగ్లాదేశ్ అక్రమ వలసలు సున్నిత సమస్య -సుష్మా

ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారంలో ఉంటే మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓట్ల కోసం సవాలక్షా మాట్లాడితే అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడడం. అధికారం మోపే అనివార్య జాతీయ, అంతర్జాతీయ బాధ్యతల బరువు నిరంతరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తుంటే బలవంతాన నాలుక తీటను అణిచిపెట్టుకోవలసిన అగత్యం దాపురిస్తుంది. తోటి సచివులకి ఆదర్శ వంతులుగా వ్యవహరించాలని హిత బోధలు చేసేందుకు కూడా ప్రేరేపిస్తుంది. ఎన్నికల ముందు అక్రమ బంగ్లాదేశ్ వలస జనం వెనక్కి…

స్వీయ దృక్పధం ఏర్పరుచుకునేదెలా? -ఈనాడు

ఈనాడులో చదువు పేజీలో మరో కొత్త సిరీస్ రాస్తున్నాను. ఈసారి రాజకీయార్ధిక దృక్కోణంలో సమాజాన్ని పరిశీలించడం గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ వ్యాసాల రచన ఉంటుంది. సిరీస్ లో మొదటి వ్యాసం ఈ రోజు (సోమవారం, జూన్ 30) ఈనాడు దినపత్రికలో ప్రచురితం అయింది. వ్యాసాన్ని నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి చదవచ్చు. ఈ లింకు ఈ వారం రోజులు మాత్రమే పని చేస్తుంది. మళ్ళీ వచ్చే…

భవనం కూలిన ఘటనలో హృదయవిదారక దృశ్యాలు -ఫోటోలు

నిర్మాణ కాంట్రాక్టర్ల అత్యాశ ఫలితంగా చెన్నైలో నిర్మాణంలో ఉండగానే 11 అంతస్ధుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 7గురు నిర్మాణ కూలీలు మరణించారని నిన్న ప్రకటించగా, ఈ రోజు మృతుల సంఖ్య 11కు పెరిగింది. భవన శిధిలాల కింద అనేకమంది చిక్కుకుని ఉన్నారని భయపడుతున్నారు. శిధిలాల సందుల నుండి చేతులు చాచి తమను కాపాడమంటూ బాధితులు వేడుకుంటున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. తలవరకు కనిపిస్తున్న బాధితులు కొందరయితే, చేయి మాత్రమే కనిపిస్తూ కాపాడమని చేస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నది మరి…

గోదావరి ‘గుండె మంట’కు బాధ్యులెవరు? -ఫోటోలు

సహజ వాయువును అమ్మే కంపెనీయేమో ‘గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)’. ఆ గ్యాస్ ని కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నదేమో లగడపాటి రాజగోపాల్ కి చెందిన లాంకో కంపెనీ. ఆ గ్యాస్ వెళ్ళేది మాత్రం కోన సీమ గుండెలపై నుండి. ఫలితంగా ప్రమాదం జరిగిన ఫలితాన్ని అనుభవిస్తోంది కోన సీమ ప్రజలు, వారి పొలాలు, వారి ఇళ్లూ, వారి సమస్త ఆస్తులు కాగా బాధ్యతని నిస్సంకోచంగా మళ్ళీ ఆ ప్రజలపైకే నెట్టివేస్తున్న గెయిల్, లాంకోలను ఏమనాలి?…

పంచశీల ఇప్పటికీ శిరోధార్యమే -చైనా

ఓ మృత శరీరాన్ని తట్టి లేపేందుకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. మరుపు పొరల్లో సమాధి అయిన పంచశీల సూత్రాలు ఇప్పటికీ శిరోధార్యమేనని చైనా అధ్యక్షుడు, భారత ఉపాధ్యక్షుడు బీజింగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చైనా, మియాన్మార్, ఇండియాలు కుదుర్చుకున్న పంచ శీల ఒప్పందానికి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఇరుగు పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఉద్దేశ్యం తమకు…

యు.జి.సి స్వయం ప్రతిపత్తికి ఎవరు యజమాని? -కార్టూన్

“బహుశా ఆయన యజమాని ఆలోచనలు వినబడతాయేమో…” *** గత ఎన్.డి.ఏ ప్రభుత్వం హయాంలో యు.జి.సి స్వయం ప్రతిపత్తి తీవ్ర నియంత్రణకు లోనైంది. మరళీ మనోహర్ జోషి నేతృత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ యు.జి.సితో పాటు ఎన్.సి.ఈ.ఆర్.టి పాఠ్య గ్రంధాలలోని పాఠ్యాంశాలను సైతం నిర్దేశించడం ద్వారా హిందూత్వ ఎజెండాను పచ్చిగా అమలు చేసేందుకు పూనుకుంది. ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ చరిత్రకారులను వివిధ పదవుల నుండి తొలగించడమే కాకుండా చరిత్రగా పరిగణించలేని అంశాలు సైతం…