ఇజ్రాయెల్ వ్యతిరేక వార్త, అమెరికా విలేఖరుల తొలగింపు

గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధానికి సంబంధించి వాస్తవ వార్త ప్రసారం చేసినందుకు పశ్చిమ వార్తా సంస్ధలు తమ విలేఖరులను తప్పించాయి. ఒక వార్తా సంస్ధ విలేఖరిని ఇంటికే పంపిస్తే మరో వార్తా సంస్ధ న్యూస్ ప్రజెంటర్ ను తప్పించి ఇతర బాధ్యతలకు బదిలీ చేసింది. ఆ రెండు వార్తా సంస్ధలు సాదా సీదావి కావు. భారీ కార్పొరేట్ వార్తా సంస్ధలు. ప్రజాస్వామ్య సంస్ధాపన కోసం అమెరికా చేసే అడ్డపైన పనుల్ని నెత్తిన పెట్టుకుని మోసే కంపెనీలు.…

బక్ మిసైళ్ళు మిలిటెంట్ల దగ్గర లేవు -ఉక్రెయిన్ అధికారి

మలేషియా విమానాన్ని కూల్చివేసింది తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే అని పశ్చిమ పత్రికలు, పశ్చిమ రాజ్యాధినేతలు తెగ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఇదే పల్లవి అందుకుని మిలిటెంట్లను పోరాట విరమణ చేసేలా సహకరించడం లేదని రష్యాకి కూడా పాపం అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే మిలిటెంట్ల దగ్గర అసలు బక్ మిసైళ్లే లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పడంతో ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం అయిపోయింది.…

అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్

ఓహ్… ఇద్దరూ మనకు మిత్రులే కదా! *** పోటీ అన్నది ఎప్పుడూ సమానుల మధ్య జరగడమే న్యాయం. ఆటలో ఒక పక్షం తొండాట ఆడుతున్నారని తెలిసీ నిస్పక్షపాతం అంటూ గిరి గీసుకు కూర్చుంటే అది చివరికి తొండాటకు మద్దతుగా తేలుతుంది. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇలాగే ఉంది. ఇజ్రాయెల్ అన్ని విధాలుగా బలీయమైన రాజ్యం. అనేక దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాల పోషణలో ఉన్న ఇజ్రాయెల్ మధ్య…

మలేషియా విమానం: ఎవరు కూల్చారు?

ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను…

ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?

ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు. హిందూ మహా…

ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు. ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి. ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు…

అణు ఒప్పందం పురోగతిపై అమెరికా నిస్పృహ!?

2008లో ఇండియా, అమెరికాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా స్తంభించిపోవడం పట్ల అమెరికా నిస్పృహగా ఉందిట. అంతర్జాతీయ అణు ఏకాకితనం నుండి ఇండియాను బైటపడేసినా అమెరికాకు ఇంతవరకూ పైసా ప్రయోజనం లేకపోవడం అమెరికా నిస్పృహకు కారణం. కానీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరన్న విషయంలో అమెరికా అమాయకత్వం నటించడమే ఆశ్చర్యకరం. అణు రియాక్టర్, తదితర అణు పరికరాలు లోప భూయిష్టమైనవి సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదం సంభావిస్తే అందుకు ఆ పరికరాలు అమ్మిన కంపెనీ…

పంట రుణాల రద్దు కాదు, రీ షెడ్యూల్ మాత్రమే!

వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుకు హామీ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆర్.బి.ఐ నుండి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం రైతు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేసేందుకు ఆర్.బి.ఐ సుముఖంగా లేదు. కేవలం రీషెడ్యూల్ మాత్రమే చేయడానికి అంగీకరించింది. అది కూడా షరతులతో. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీ షెడ్యూల్ మాత్రమే కోరినట్లు ఆర్.బి.ఐ సమాచారం బట్టి అర్ధం అవుతోంది. పంట రుణాల రీ షెడ్యూల్ ప్రతిపాదనలకు సూత్రబద్ధంగా ఆమోదం…

జాత్యహంకార నీడలో నిలువెల్లా గాయాల గాజా -ఫోటోలు

గాజా ప్రజ మరోసారి రక్తం ఓడుతోంది. యూదు జాత్యహంకారం విసురుతున్న ఆధునిక క్షిపణి పంజా దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ధి గాంచిన గాజా నిలువెల్లా గాయాలతో నిస్సహాయగా నిలిచి ప్రపంచ వ్యవస్ధల చేతగానితనాన్ని నిలదీసి ప్రశ్నిస్తోంది. పౌరుల ఆవాసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోంది. తోడేలు న్యాయానికి గొర్రెలను అప్పగిస్తున్న పులుల ఆటవిక న్యాయానికి సాక్షిగా నిలబడి సో కాల్డ్ ప్రజాస్వామిక…

సామాన్యుడికి ఏమీ లేని బడ్జెట్ -కార్టూన్

“బహుశా సామాన్యుడికి ఎంతో కొంత జారిపడుతుందేమో…” *** మోడి-జైట్లీల బడ్జెట్ పై సునిశిత విమర్శ ఈ కార్టూన్! పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ‘ట్రికిల్ డౌన్ ధియరీ” అని ఒక తలకు మాసిన సిద్ధాంతాన్ని చెబుతుంటారు. ఈ సిద్ధాంతం అంటే పెట్టుబడిదారీ కంపెనీలకు చెప్పలేనంత ఇష్టం. ఉన్నదంతా తమకే దోచి పెట్టమని చెప్పే సిద్ధాంతం వారికి ఎందుకు ఇష్టం ఉండదు. ఆర్ధిక పిరమిడ్ లో పైన ఉన్న కొద్ది మందికి బడ్జెట్ లో అధిక మొత్తాన్ని ఇచ్చేస్తే అది బొట్లు…

ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!

గాజా మరోసారి ఇజ్రాయెల్ జాత్యహంకార ముట్టడికి గురవుతోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్ మరియు హత్యలను సాకుగా చూపుతూ గాజా పౌర నివాసాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా 200కు పైగా గాజా పౌరులు దుర్మరణం చెందగా ఉనికిలో ఉన్న కాసిన్ని ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు శ్రమిస్తున్నాయి. కాగా శాంతి ప్రవచనాలు వల్లించడం వరకే ఐరాస పరిమితం…

పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం

పాలస్టీనియన్ హమాస్ రాకెట్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ నిరవధిక వాయుదాడులు ప్రారంభించిన దరిమిలా గాజాలో మృత్యువు మళ్ళీ విలయతాండవం చేస్తోంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (disproportionate) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది. హమాస్, 500 పైగా రాకెట్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ లో ఒక్క మరణమూ సంభవించలేదు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది (తాజా సంఖ్య 200 పైనే) పాలస్తీనీయులు ప్రాణాలు…

నన్ను పి.ఎంని చెయ్యి, నిన్ను అధ్యక్షుడ్ని చేస్తా -కార్టూన్

మనకిక్కడ ఒకప్పుడు ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఒకరి హఠాన్మరణం వలన ఆ రెండో పెద్దాయన కూడా హఠాత్తుగా ఒంటరి అయ్యారు. (తెలంగాణ ఆందోళన పుణ్యామని ఆ తర్వాత కూడా ఆయన కింగ్ మేకర్ గా కొనసాగారని కొన్ని పత్రికలు చెవులు కొరుకుతాయి.) గుజరాత్ లో కూడా ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఈ జంటకి ప్రమోషన్ వచ్చి రాష్ట్ర స్ధాయి నుండి కేంద్ర స్ధాయికి ఎగబాకింది. వారు…

రిలయన్స్ పై మరో 3.5 వేల కోట్ల జరిమానా

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం…

కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబులు -ఈనాడు

సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబు తీరు మలుచుకునే అంశాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో వివరించాను. అధ్యయనం శీర్షికన వెలువడుతున్న వ్యాస పరంపరలో ఇది 3వది కాగా సివిల్స్ కొశ్చెన్ టాగ్స్ వివరణకు సంబంధించి రెండవది. బ్లాగ్ పాఠకులు ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. జవాబు తీరు మలుచుకునేదెలా? పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో ఆర్టికల్ చదవాలంటే కింది బొమ్మపైన క్లిక్…