MH17: ఫైటర్ జెట్ గుళ్ళు పేల్చి కుల్చారు -జర్మన్ పైలట్

మలేషియా ప్రయాణీకుల విమానం MH17 ని బక్ మిసైల్ తో కూల్చారని ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా రాజ్యాలు కట్టగట్టుకుని ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఈ ఆరోపణల్లో అగ్రభాగాన నిలిచారు. ఆనక అబ్బే పొరబాటున కూల్చి ఉంటారని నాలుక మడతేశారు. కానీ బక్ మిసైల్ తోనే కూల్చారని, కూల్చడానికి తగిన పరిస్ధితులను రష్యాయే ఏర్పరిచిందని ప్రస్తుతం వాదిస్తున్నారు. కానీ జర్మనీకి చెందిన ఏవియేషన్ నిపుణుడు పీటర్ హైసెంకో జులై 30…

ప్రశ్న: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?

శ్రావణ్ కుమార్: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే ఏమిటి? మీకు సమయం ఉంటే పూర్తి వివరాలు ఇవ్వగలరు. సమాధానం: రిట్రాస్పెక్టివ్ అంటే ఈ సందర్భంలో అర్ధం, గత కాలానికి కూడా వర్తించేది అని. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం యొక్క స్వభావాన్ని బట్టి ఎప్పటి నుండి వర్తించేది కూడా చట్టంలో పొందుపరుస్తారు. వెంటనే అమలులోకి వచ్చేటట్లయితే ‘with immediate effect’ అంటారు. గతంలో నిర్దిష్ట తేదీ నుండి వర్తింపజేయాలని భావిస్తే ఆ తేదీని చట్టంలో పొందుపరుస్తారు. ఇలా…

సివిల్స్ డైరెక్టివ్ ‘ఎనలైజ్’ గురించి… -ఈనాడు

ఇది ప్రస్తుత ‘అధ్యయనం’ సిరీస్ లో 5వ భాగం. సివిల్స్ పరీక్షల్లో ఇచ్చే కొశ్చెన్ ట్యాగ్స్ లో ఒకటయిన ‘విశ్లేషణ’ గురించి ఈ రోజు చర్చించాను. ఈ 5వ భాగాన్ని ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ క్లిక్ చేయగలరు. వేగంగా… సులభంగా గరిష్ట మార్కులు పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో చూడాలనుకుంటే కింది బొమ్మను క్లిక్ చేయగలరు. బొమ్మ పైన రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.

రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా

నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు. భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న…

యు.పి.ఎస్.సి: భాష రాజకీయాల జీనీ వదిలారా? -కార్టూన్

సివిల్స్ పరీక్షల్లో మూడేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన CSAT (Civil Services Aptitude Test) ప్రశ్న పత్రంపై మరోసారి రగడ రేగింది. హిందీ ప్రాంతాల వాళ్ళు ప్రధానంగా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. ఆంగ్లేతర మాధ్యమాలలో పరీక్ష రాసేవారికి వ్యతిరేకంగా కుట్ర చేశారని, గ్రామీణ నేపధ్యం ఉన్న వాళ్ళను ఉన్నత స్ధాయిలకు రాకుండా అడ్డుకునేందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించే భాగాన్ని ప్రవేశపెట్టారని వారు విమర్శిస్తున్నారు. త్వరలో జరగబోయే సివిల్స్ పరీక్షలను వాయిదా వేసి తమ సమస్యలను పరిష్కరించాలని…

హింసనచణ ధ్వంస రచన… -ఫోటోలు

ఇజ్రాయెల్ ధ్వంస రచనకు 26 రోజులు పూర్తయ్యాయి. వందలాది మంది పాలస్తీనీయులు మర ఫిరంగుల తాకిడికి పుట్టలు పుట్టలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఉమ్మడిగా తుడిచివేయబడుతున్నాయి. భవనాలకు భవనాలే ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. అక్కడ పిట్టలు ఎగరడం ఎప్పుడో మానేశాయి. విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి. రాత్రయితే ఇప్పుడక్కడ నీడలు కదలవు. యంత్ర భూతాల ఫిరంగి గొట్టాలు, ఇనుప రెక్కల డేగలు విరామమెరుగక విరజిమ్ముతున్న పేలుడు మంటల్లో మానవత్వం శలభంలా మాడి మసవుతోంది. ఇజ్రాయెల్ నుండి…

పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి

గాజాలో ఐరాస తరపున శరణార్ధి శిబిరాలను నిర్వహిస్తున్న UNRWA ప్రతినిధి తమ పాఠశాలపై దాడిని వివరిస్తూ కెమెరా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అమానుషాన్ని కళ్ళారా చూసిన ఆయన జరిగిన ఘోరాన్ని తిరిగి గుర్తు చేసుకుంటుండగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నోట మాట రాకపోయినా బలవంతంగా మాటలు కూడబలుక్కుని వివరిస్తూ తలవంచుకుని ఏడ్చేశారు. పాఠశాలలో తలదాచుకుంటున్న వారు నిద్రలోనే చనిపోయారని UNRWA ప్రతినిధి క్రిస్ గన్నెస్ ఆల్ జజీరా టి.వి ఛానెల్ కు చెబుతూ దుఃఖించారు. జబాలియా…

ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

‘మొనగాడు’ అందామా! గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా! మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా! ‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా? గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో…

సోనియా మరియు విదూషక నట్వర్ సింగ్ -కార్టూన్

యు.పి.ఏ-1 ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా పని చేసి తొలగింపుకు గురయిన నట్వర్ సింగ్ పుస్తకం ప్రస్తుతం జాతీయ స్ధాయి చర్చల్లో నలుగుతోంది. ‘ఒక జీవితం చాలదు: ఆత్మకధ’ టైటిల్ తో ఈ రోజు వెలువడుతున్న పుస్తకం ఆయన సన్నిహితంగా మెలిగిన సోనియాపై విమర్శలు గుప్పించడంతో పత్రికలకు మేత లభించినట్లయింది. సోనియా చెప్పుకున్నట్లు అంతరాత్మ ప్రభోదం మేరకు ఆమె ప్రధాని పదవిని వదులుకోలేదని వాస్తవానికి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిరోధించడం వల్లనే ఆమె పదవిని త్యజించారని నట్వర్…

బస్సు డోర్ లాక్ అయిపోయి రాలేదు…

(ఇది తులసి గారు తన వ్యాఖ్య ద్వారా ఇచ్చిన సమాచారం. -విశేఖర్) బస్సు పట్టాలపైకి వచ్చి నాలుగు నిమిషాలు ఆగిపోయింది. ఆ నాలుగు నిమిషాల్లో పిల్లల్ని కాపాడేందుకు డ్రైవర్, క్లీనర్ ప్రయత్నం చేశారు. ఘటన జరిగింది ఉదయం కాబట్టి రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ లేరు. అందుకే కొత్తవాడైన డ్రైవర్ భిక్షపతి స్కూల్ కరస్పాండెంట్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చెయ్యడమెందుకు త్వరగా పిల్లల్ని దించివేయవచ్చు కదా అను అనుమానం కలుగుతుంది. అయితే ఆ సమయంలో బస్ డోర్…

బ్రిక్స్ సమావేశాలు: నూతన అభివృద్ధి బ్యాంకు ఆవిర్భావం

జులై 16 తేదీన ముగిసిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాల అనంతరం సభ్య దేశాధినేతలు చేసిన ప్రకటనతో ‘నూతన అభివృద్ధి బ్యాంకు’ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు) లాంఛనప్రాయంగా ఉనికిలోకి వచ్చింది. బ్యాంకుకు తుదిరూపు ఇస్తూ ఐదు వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) శిఖరాగ్ర సమావేశాలు బ్రెజిల్ నగరం ఫోర్టాలెజా లో ముగిశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికా నగరం దర్బన్ లో జరిగిన సమావేశాలలో నిర్ణయించినట్లుగానే బ్రిక్స్ కూటమి…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…

బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్

తెలంగాణలో మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అందరూ నిర్ధారించారు. అది వాస్తవం కాదని కండిషన్ లో లేని బస్సును పక్కనబెట్టకుండా తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్కూలు పిల్లలను ఉటంకిస్తూ ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలిసినా డ్రైవర్ పైకి తప్పు నెట్టేసి స్కూలు యాజమాన్యాన్ని కాపాడుతున్నారని తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, రైలు వస్తున్న సంగతి…

గడ్కారీ బెడ్రూంతో పాటు ఇంటింటికీ బగ్ అమర్చాలి -కార్టూన్

“మన సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటికీ బగ్ అమర్చాలి…” *** బి.జె.పి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఇంట్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి ఉన్న సంగతి వెల్లడి అయింది. 2009లో బి.జె.పి అధ్యక్షుడుగా పదవి చేపట్టిన అనంతరం ఆయనకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఆ ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఆయన నిద్రించే బెడ్ రూమ్ లో సంభాషణలు వినే పరికరం రహస్యంగా అమర్చినట్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్, తదితర…

భోజన పళ్ళెం అందుకోలేని కాంగ్రెస్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోసం పోరాడవలసిన పరిస్ధితి కాంగ్రెస్ ది. మొత్తం సీట్లలో 10 శాతం వస్తే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదని నిబంధనలు ఉన్నాయిట. తమకు 44 సీట్లే వచ్చినా యు.పి.ఏ కి 60 సీట్లు వచ్చాయి గనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికలకు ముందు యు.పి.ఏ పక్ష్యాలన్నీ ఒకే మేనిఫెస్టో, కార్యక్రమం ఇవ్వలేదు గనక ఆ లాజిక్ పని చేయదని బి.జె.పి తిప్పి కొడుతోంది. ఫలితంగా బి.జె.పి…