కాశ్మీర్ వరదలు గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే -ఫోటోలు

కనీవినీ ఎరుగని భారీ వర్షాలు తెరిపిడి పడినా, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాన్ని కష్టాలు వీడలేదు. ఆకాశం భళ్ళున బద్దలయినట్లు కురిసిన వర్షపు నీరు కొండలనుండి కాశ్మీరు లోయలోకి దొర్లిపడుతూ పెను వరదలను సృష్టించింది. అనేక గ్రామాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. తాము ఇప్పటివరకూ 50,000 మందిని రక్షించామని సైన్యం ప్రకటించింది. అనేక వేలమంది ఇంకా  వరదల్లో చిక్కుకుని ఉన్నారు. అనేకమంది ఇళ్లపైనా, చెట్లపైనా నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని బైటపడ్డవారు తెలియజేస్తున్నారు. మరణాల సంఖ్య…

సి.బి.ఐ పరిశోధనపై పరిశోధన -కార్టూన్

దేశంలో అత్యున్నత స్ధాయి పరిశోధన సంస్ధ సి.బి.ఐ. ప్రభుత్వంలోనూ, బ్యూరోక్రసీలోనూ ఉన్నత స్ధానాలను ఆక్రమించి ఉన్న స్వార్ధపర ఆశపోతులను, దొంగలను పట్టుకుని విచారించి శిక్షపడేలా చూడవలసిన సి.బి.ఐ అధికారులు సదరు ఉన్నత స్ధాయి నేరస్ధులతోనే కుమ్మక్కు అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అవినీతిని ప్రముఖంగా చర్చలోకి తెచ్చిన కుంభకోణం 2జి కుంభకోణం. ఈ కుంభకోణంలో నిందితులైన సీనియర్ బ్యూరోక్రాట్ అధికారులు క్రమం తప్పకుండా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారని ఎఎపి నేత, సుప్రీం…

శ్వేతాబసు మీ సాఫ్ట్ టార్గెట్! -సాక్షి తన్వర్ బహిరంగ లేఖ

(కొద్ది రోజుల క్రితం పత్రికలు, ఛానెళ్లు ఓ వార్తను సంచలనం చేస్తూ ప్రచురించాయి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ సినీ నటి శ్వేతా బసు పట్టుబడిందని ఆ వార్త సారాంశం. ఈ వార్త ప్రచురిస్తూ కొన్ని పత్రికలు అదేదో భ్రహ్మాండమైన నేరాన్ని వెలికి తీసినట్లు ఫోజు పెట్టాయి. సంవత్సరాల తరబడి భద్రతా వ్యవస్ధలకు అంతు చిక్కని నేర పరిశోధన తామే చేసినట్లు బిల్డప్ ఇచ్చాయి. ఈమె పైన గతంలో ఆరోపణలు వచ్చినా ఆమె ఖండించారని…

ఐరోపా దేశ ద్రిమ్మరుల పండుగ వర్జిన్ మేరీస్ డే -ఫోటోలు

జిప్సీలు అన్న పేరు మనం తరచుగా వినం గానీ ఐరోపా దేశాల్లో ఇది చిరపరితం. వారిని ‘రోమా’లు అని కూడా పిలుస్తారు. ఐరోపా సంపన్న దేశాలు వారి పట్ల చాలా క్రూరంగా, అవమానకరంగా వ్యవహరిస్తాయి. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు మరింత ఘోరంగా వ్యవహరిస్తాయి. రెండేళ్ల క్రితం అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రోమాలకు వ్యతిరేకంగా ఒక విధాన నిర్ణయం తీసుకుని వారిని దేశం నుండి తరిమి తరిమి వేధించాడు. వాళ్ళు అందించే చౌక శ్రమతో సిరులు…

అరవింద్: తానొకటి తలచిన కోర్టు మరొకటి తలచెను

ఆమ్ ఆద్మీ పార్టీ/అరవింద్ కేజ్రీవాల్ పరిస్ధితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు జరిపించాలన్న లక్ష్యంతో తాము వేసిన పిటిషన్ చివరికి బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటుకు దారితీయబోతోంది. అరవింద్ వెల్లడి చేసిన వీడియో దృష్ట్యా ఢిల్లీలో ఎంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంత మంచిదని సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. దానితో పిటిషన్ వేసిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆమోదించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు…

వాతావరణంలో రికార్డు స్ధాయిలో కర్బనవాయు నిల్వలు

భూమి వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయు నిల్వల స్ధాయి రికార్డు స్ధాయికి చేరిందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్ధ (వరల్డ్ మీటియరలాజికల్ ఆర్గనైజేషన్ -డబ్ల్యూ.ఎం.ఒ) తెలిపింది. గతంలో ఎన్నడూ ఇంత సాంద్రతతో గ్రీన్ హౌస్ వాయు నిల్వలు భూ వాతావరణంలో లేవని, 2012, 2013 సంవత్సరాల్లోనే అత్యధిక స్ధాయిలో ఈ నిల్వలు పెరిగాయని సంస్ధ చెప్పడం విశేషం. గత రెండు, మూడేళ్లుగా ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల (గ్రీన్ హౌస్ వాయువులు) విడుదలను తగ్గించడం ఎలా అన్న…

అరవింద్: తోడేళ్ళకు భయపడే మేకల కాపరి -కార్టూన్

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై మళ్ళీ కదలిక మొదలు కావడంతో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద చిక్కొచ్చిపడింది. తమ ఎమ్మెల్యేలను కాపలా కాసే కాపరిగా ఆయనకు కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. శాసనసభలో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సఫారసు చేస్తూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఎఎపి నేతకు ఈ అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి. ఈ కార్టూన్ కి రెండు అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒకటి:…

స్నోడెన్ వస్తే అమెరికాకి అప్పగించం -స్విస్ మీడియా

అమెరికా గూఢచర్యంపై సాక్ష్యం ఇవ్వడానికి స్నోడెన్ తమ దేశం వస్తే ఆయనను అమెరికాకు అప్పగించకపోవచ్చని  స్విట్జర్లాండ్ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ స్విస్ ప్రభుత్వానికి ఒక పత్రం సమర్పించారని సోన్టాగ్స్ జీటంగ్ (స్విస్) పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో దానికి విరుద్ధంగా హామీ ఇస్తే చెప్పలేమని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. అనగా స్విస్ మీడియా అంచనాకు భిన్నంగా స్నోడెన్ రక్షణకు…

స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అని సామెత. యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్) కరెన్సీ పరిస్ధితి ఇప్పుడు అలానే ఉంది. స్కాట్లండ్ స్వతంత్రం పట్ల స్కాటిష్ ప్రజల్లో ఆదరణ పెరిగేకొద్దీ బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ దిగజారుతోంది. ఆదివారం జరిగిన అభిప్రాయ సేకరణలో స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవడానికి ‘యెస్’ అంటున్న ఓటర్ల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించినట్లు తేలింది. ఓటింగులో పాల్గొన్నవారిలో అటో, ఇటో చెప్పినవారిలో 51 శాతం మంది ‘యెస్’ అని…

సైనిక స్ధావరం: జపాన్ లో అమెరికాకు ఎదురు దెబ్బ

ఒకినావాలో రెండో అమెరికా సైనిక స్ధావరం నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది. ఫుటెన్మా లోని అమెరికా సైనిక స్ధావరాన్ని ఒకినావాకు తరలించాలని అమెరికా, జపాన్ ప్రభుత్వాలు భావిస్తుండగా స్ధానిక ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. నూతన స్ధావరం ఏర్పాటు చేయాలని భావించిన నాగో పట్టణ ప్రభుత్వంలో స్ధావరం వ్యతిరేకులు మెజారిటీ పొందడంతో అమెరికా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మార్గం సుగమం అయింది. జపాన్ లో 50,000 కుపైగా అమెరికా సైనికులు తిష్ట వేసుకుని ఉన్నారు. రెండో ప్రపంచ…

ఎమ్మెల్యేకు బి.జె.పి వెల రు. 4 కోట్లు -ఎఎపి వీడియో

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనైతికం ఏమీ లెదంటూ ప్రకటించిన బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా అంతరార్ధం ఏమిటో ఎఎపి పార్టీ వెల్లడి చేసింది. తమ ఎం.ఎల్.ఎ లు ఇద్దరినీ కొనుగోలు చేసేందుకు బి.జె.పి ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ దాగర్ ఒక్కొక్కరికి 4 కోట్లు ఇవ్వజూపారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సాక్ష్యంగా వీడియోను కూడా ఎఎపి విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం గురించి విలేఖరులు అడిగిన…

హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు

ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.…

జమ్ము&కాశ్మీర్ వరదలు: 120 మంది దుర్మరణం -ఫోటోలు

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. రాష్ట్ర ప్రజలు 120 మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొండచరియలు విరిగిపడడం, ఇళ్ళు కూలిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినవారే. సైన్యం అపూర్వ సాహసంతో రక్షణ చర్యలు చేపట్టారని చెబుతున్నప్పటికీ ప్రాణ నష్టం అధికంగానే ఉంది. వరదలు ఎంత తీవ్ర స్ధాయిలో వెల్లువెత్తాయంటే సరిహద్దు భద్రతా దళాలను సైతం అక్కడి నుండి ఖాళీ చేయవలసి…

బాలికపై శివసేన నేత అత్యాచారం!

భారత దేశంలో గొప్ప హిందూ సంస్కృతి అలరారుతోందని చెప్పుకునే హిందూ సంస్కృతీ పరిరక్షకులకు దేశంలో కొదవలేదు. వాస్తవంలో దేశ రాజధాని ‘రేప్ కేపిటల్’ గా పేరు తెచ్చుకోగా, తమను తాము సంస్కృతీ పరిరక్షక చాంపియన్లుగా ప్రమోట్ చేసుకుంటూ సమాజంపై అడ్డదిడ్డమైన దాడులకు పాల్పడే స్వయం ప్రకటిత సైనికులకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అడ్డాగా మారింది. అదిగో అలాంటి సైనికుల నాయకుడొకరు సిగ్గు విడిచి, అతి నీచ కీచక పర్వానికి దిగడంతో అభం శుభం తెలియని ఓ…

ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు…