గుజరాత్ లో మత కొట్లాటలు, 140 మంది అరెస్టు -ఫోటోలు

గుజరాత్ లో మరోసారి మత పరమైన అల్లర్లు చెలరేగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడి పోటీ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిచి, అనంతరం వదులుకున్న వదోదర నగరంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ‘వసుధైక కుటుంబం’ భారత దేశ సిద్ధాంతం అని న్యూయార్క్, వాషింగ్టన్ డి.సిలలో ప్రధాని చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన పోటీ చేసిన వదోదరలో మత కొట్లాటలు చెలరేగడం గమనార్హమైన విషయం. గత గురువారం నుండి వదోదరలో అల్లర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఫేస్…

విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు. తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం.…

జయలలిత: అల్లంత శిఖరాన… దభేల్! -కార్టూన్

జయలలిత కెరీర్ ఇక ముగిసినట్లేనా? ముగిసినట్లే అని ఆమె వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ శోక హృదయులై ఉన్నా, మించిపోయింది ఏమీ లేదన్న ధైర్యంతో ఉన్నారు. చో రామస్వామి లాంటి తమిళ రాజకీయ విశ్లేషకులు ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. జయలలిత తన కెరీర్ లో పీక్ దశలో ఉండగా కోర్టు తీర్పు ఆమెకు ఆశనిపాతం అయిందని ది హిందూ లాంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. పీక్ దశ అంటే…

అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు…

భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు

విమానాలు సరే! ఉన్నచోటనే గాలిలో తేలిపోయే ఆటలు, ఆట వస్తువులు మనిషికి ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆటలు, ఆట వస్తువులు ఉనికిలోకి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. భారీ ఉత్పత్తులు తీయగల యంత్రాలను కనిపెట్టాక ఆర్ధిక పిరమిడ్ లో అగ్రభాగాన తిష్ట వేసిన కలిగిన వర్గాలకు తీరికే తీరిక! ఈ తీరిక సమయం క్రమంగా మానసిక జబ్బులకు దారి తీయడం మొదలైంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి వారికి అత్యంత తీవ్ర…

న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్

(అక్రమ ఆస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది 4 సం.ల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. సహ నిందితులకు 4 సం.ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫలితంగా అవినీతి కేసులో శిక్ష పడిన మొదటి ఉన్నత స్ధాయి నేతగా జయలలిత చరిత్ర పుటలకు ఎక్కారు. అవినీతి కేసుల్లో నేతలు తప్పించుకుపోకుండా ఇటీవల చేసిన చట్టం ఫలితంగా ఎం.ఎల్.ఏ పదవి, తద్వారా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన…

అవాంఛనీయ ఉపసంహరణ -ది హిందు ఎడిటోరియల్

(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) ప్రపంచంలో అతి…

ఉద్ధవార్జునుడికి కమల గండం -కార్టూన్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించవచ్చని శివ సేన నేత, బాల్ ధాకరే కుమారుడు ఉద్ధవ్ కుమార్ ఎంతగానో ఆశ పెట్టుకున్నారు. తన ఆశను ఆయన దాచుకోకుండా బహిర్గతం చేశారు. మహా రాష్ట్రలో తామే ఇచ్చేవారమని, బి.జె.పి తీసుకునే పార్టీ మాత్రమేనని హుంకరించారు. మరిన్ని సీట్లు కావాలన్న బి.జె.పి కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాజ్ నాధ్ సింగ్ ఏలుబడి వరకు మహారాష్ట్రలో బి.జె.పి జూనియర్ భాగస్వామిగా మాత్రమే కొనసాగింది. లోక్ సభ ఎన్నికల్లో శివ సేన కంటే 10…

మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…

కేజ్రీవాల్ చీపురు మోడి చేతికి! -కార్టూన్

కాంగ్రెస్ పాలనలో భారత దేశం సర్వ రంగాలలోనూ భ్రష్టు పట్టిపోయిందని బి.జె.పి తరచుగా చేసే ఆరోపణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఎంతో ఇష్టమైన విమర్శ. తాము అధికారంలోకి వచ్చాము గనక ఇక నిశ్చింతగా నిద్రపోండి, మిగిలింది మేము చూసుకుంటాం అని వీరు చెప్పబోతారు. ఆలి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అన్నట్లు దేశాన్ని ఐదేళ్ల పాటు, రాష్ట్రాన్ని 9 సం.ల పాటు ఏలిన నేతల సంగతి జనానికి తెలియకనా,…

అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!

తాను చెబుతున్నట్లుగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడికి గల నిబద్ధతపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు తమ అధ్యక్షుడు బారక్ ఒబామాకు మొర పెట్టుకున్నారు. మోడి ప్రభుత్వం పైకి తాము వ్యాపార వర్గాలకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఆచరణలో భిన్న చర్యలు తీసుకుంటోందని యు.ఎస్.ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు మరో 15 వ్యాపార సంఘాలు ఒబామాకు ఫిర్యాదు చేశాయి. మోడి వస్తున్నారు గనుక ఒత్తిడి…

గుజరాత్ మారణకాండ: మోడికి అమెరికా కోర్టు సమన్లు

9 సం.ల పాటు అమెరికా ప్రభుత్వం నుండి వీసా నిషేధం ఎదుర్కొన్న భారత ప్రధాని నరేంద్ర మోడి తాజాగా అమెరికా కోర్టుల నుండి సమన్లు అందుకోనున్నారు. విదేశీ కోర్టుల నుండి సమన్లు అందుకున్న మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి ఖ్యాతి దక్కించుకున్నారు. ఒక పక్క మోడికి రెడ్ కార్పెట్ పరిచామని చెబుతూనే కోర్టుల చేత సమన్లు ఇప్పించడం అమెరికా కపట నీతికి తార్కాణం కావచ్చు గానీ, అందుకు అవకాశం ఇచ్చిన ఘనత మాత్రం మన…

అమెరికా: అసలే కరువు, ఆపై రారాజు దావానలం -ఫోటోలు

సగానికి పైగా అమెరికా రాష్ట్రాల్లో ఇప్పుడు దుర్భిక్షం తాండవిస్తోంది. సంవత్సరాల తరబడి కొనసాగుతోన్న వర్షపాత రాహిత్యం వల్ల పంటలు పండక కరువు, దరిద్రం సమస్యలు అమెరికన్లను పీడిస్తున్నాయి. దానితో పాటు వేడి వాతావరణం వ్యాపించడంతో పశ్చిమ, మధ్య పశ్చిమ రాష్ట్రాలు పొడిబారాయి. దరిమిలా కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలు సున్నితంగా మారి ఏ మాత్రం చిన్న పొరబాటు జరిగినా భారీ దావానలాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియా  నిండా దావాలనాలు వ్యాపించాయి. పొడి వాతావరణం దావానలం వ్యాపించడానికి అనువుగా…

రిఫరెండం పూర్తైనా స్కాట్లండ్ భారమే -కార్టూన్

సెప్టెంబర్ 18 తేదీన జరిగిన రిఫరెండంలో యు.కెలో భాగంగా ఉండడానికే మెజార్టీ స్కాట్లండ్ ప్రజలు (55%)నిర్ణయించారు. రిఫరెండంలో విడిపోవడానికే స్కాట్ లు నిర్ణయిస్తారని భయపడిన యు.కె రాజకీయ పార్టీలు ఫలితాలతో ఊపిరి పీల్చుకున్నారు. యు.కెలో కొనసాగడానికే స్కాట్ ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ యునైటెడ్ కింగ్ డమ్ స్కాట్లండ్ భారం కొనసాగుతూనే ఉందని కార్టూన్ సూచిస్తోంది. అది నిజమే. ఎందుకంటే స్కాట్లండ్ రిఫరెండం దగ్గరపడే కొద్దీ స్కాట్లండ్ స్వతంత్రానికి ఆదరణ పెరుగుతూ పోయింది. చివరి రోజుల్లో ఇరు పక్షాలు సమాన…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…