సిరియా టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ సాయం -ఐరాస

ఇప్పుడిక అనుమానం అనవసరం. ఇజ్రాయెల్ నిజ స్వరూపం ఏమిటో స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. న్యాయమైన పాలస్తీనా ప్రజల పోరాటాలను టెర్రరిజంగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నించే యూదు రాజ్యం తాను స్వయంగా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, వైద్య సహాయం అందజేస్తోందని ఐరాస నివేదికలు స్పష్టం చేశాయి. 1967 నాటి ఐరాస తీర్మానం అనుసారం సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగం గోలన్ హైట్స్ లో నెలకొల్పిన ఐరాస కార్యాలయం UNDOF సంస్ధ ఐరాస…

సృజనాత్మకతపై నిర్హేతుక కట్టుబాట్లు -ది హిందు ఎడిట్

(హిందూత్వ సంస్ధల రాజకీయ పలుకుబడి పెరిగిన ఫలితంగా వారి సంకుచిత సాంస్కృతిక భావజాలం సమాచార, ప్రసార శాఖలోకి చొరబడి సమాజ ఆలోచనా రీతిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని సూచించే ఈ సంపాదకీయం ఈ రోజు, డిసెంబర్ 8, ది హిందు పత్రికలో ప్రచురించబడింది. -విశేఖర్) ********* “అశ్లీల’ అంశాలను, ‘మహిళలను కించపరిచే” కార్యక్రమాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ‘కామెడీ సెంట్రల్’ టెలివిజన్ ఛానెల్ ప్రసారాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ…

నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…

బి.జె.పి పాత్రధారుల పరిణామక్రమం

బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి. ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు…

ఆశకు తగిన కారణం -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 6, 2014 నాటి ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ఐదు అణ్వస్త్ర దేశాలు మరియు జర్మనీ (P5+1), ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న చర్చల ఎగుడు దిగుడు చరిత్ర గురించి బాగా తెలిసినవారు సదరు చర్చల తాజా రౌండ్, జూన్ 2015 వరకు మరో కొనసాగింపుకు నోచుకోవడాన్ని ఆశాభావంతో పరికించడం పట్ల చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్ తన మౌలిక అణు నిర్మాణాలను అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించడానికీ, ఆంక్షల నుండి గణనీయ మొత్తంలో,…

మరో ‘వైట్’ హంతకుడికి ‘విముక్తి’ -ఫోటోలు

మరో వైట్ పోలీసు ఆధిపత్యం, మరో నల్లజాతి పౌరుడి హత్య, చివరికి మరో గ్రాండ్ జ్యూరీ గుడ్డి తీర్పు! గత జులైలో డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులు ఓ నల్లజాతి పౌరుడిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. అతడి గొంతు చుట్టూ చేయి బిగించి పట్టుకుని బరబరా పోలీసు వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్లారు. మరో ముగ్గురు, నలుగురు పోలీసులు గొంతు బిగించిన పోలీసుకు సహకరించారు. ఈడ్చుతున్నప్పుడే ఆ బాధితుడు అరుస్తూనే ఉన్నాడు, ‘నాకు ఊపిరి అందడం లేదు’ అని.…

మోడి సరైన చర్య తీసుకుని తీరాలి -ది హిందు

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉప మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మత మైనారిటీలను ఉద్దేశిస్తూ వారు అక్రమ సంతానం అంటూ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషంతో కూడినవి, రెచ్చగొట్టేవి మరియు ఒక ఉన్నత ప్రభుత్వ కార్యాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తికి తగనివి. ఆమె చెప్పిన క్షమాపణలు బలహీనంగా వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రకటనలు చేసేప్పుడు నడవడిక కోల్పోవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీ…

టి.ఎం.సి బలహీనతలే బి.జె.పికి బలమా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది. శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని,  శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్…

ఒక కల్పనాత్మక ఒప్పందం -ది హిందు ఎడిట్

160 సభ్య దేశాల ప్రపంచ వాణిజ్య సంస్ధ (WTO) కు చెందిన జనరల్ కౌన్సిల్ గత వారం స్ధాపించబడ్డ 20 యేళ్ల కాలంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రపంచ స్ధాయి ఒప్పందం ఆమోదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఆహార నిల్వల సమస్య పరిష్కారం అయ్యేవరకూ వాణిజ్య వసతీకరణ ఒప్పందంపై సంతకం చేసేది లేదని నిరాకరిస్తూ న్యూ ఢిల్లీ కాలు అడ్డం పెట్టడంతో డబ్ల్యూ.టి.ఓ ప్రతిష్టంభన ఎదుర్కొంది. తత్ఫలితంగా ఉత్తన్నమైన జఠిల సమస్య వల్ల డబ్ల్యూ.టి.ఓ భవిష్యత్తే ప్రశ్నార్ధకం…

జి.డి.పిని ఎలా లెక్కిస్తారు? -ఈనాడు

ఈ రోజుల్లో జి.డి.పి గురించి విననివారు చాలా తక్కువ మంది. జి.డి.పి ని తెలుగులో స్ధూల జాతీయోత్పత్తిగా చాలామంది అనువదిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. జి.డి.పిని స్ధూల దేశీయోత్పత్తి అనడం కరెక్ట్. జి.ఎన్.పి ని స్ధూల జాతీయోత్పత్తిగా అనువాదం చేయాలి. అయితే జి.ఎన్.పి వాడుకలో లేని పదం. ఎకనమిక్ ఫండమెంటల్స్ జాబితాలో జి.ఎన్.పికి ప్రాముఖ్యం లేదు. అందువలన స్ధూల జాతీయోత్పత్తి అన్నా జి.డి.పియే అన్న వాడుక వచ్చేసింది. కానీ జి.ఎన్.పి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసేటప్పుడు…

ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు

Originally posted on Full Story కథనం:
ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు…రాజమండ్రిలో ఆంధ్రప్రభ రిపోర్టర్ జానకి నిన్న చనిపోయాడు. నలభై ఏళ్ళ చిన్న వయసులో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి అపస్మారకంలోకి వెళ్ళిపోయి వారం తరువాత భార్యని కూతురుని అనాధలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. జీతం రాని దిగులు, అడ్వర్టయిజుమెంట్లు సంపాదించలేని దిగులు, పెన్నేసుకుని/నోరేసుకు పడిపోలేని సౌమ్యస్వభావం తప్ప నల్లా జానకీ శ్రీరామ్ కి అనారోగ్యకారకాలైన ఏఅలవాట్లూ లేవు. మరణం అనివార్యమే అయినా ప్రశాంతంగా చనిపోయే అవకాశాలు లేని…

ఇండియా-చైనా-బంగ్లా-బర్మా కారిడార్ రూపకల్పన

ఇండియా, చైనా, బంగ్లాదేశ్, మియాన్మార్ దేశాలను కలుపుతూ ఆర్ధిక కారిడార్ రూపకల్పనకు పధక రచన జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో ఈ అంశంపై కూడా చర్చ జరిగిందని త్రిపురలో విడిది చేసిన బంగ్లాదేశ్ అధికారుల ద్వారా తెలిసింది. బంగ్లాదేశ్ సహకారంతో త్రిపురలో నిర్మించిన 726 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి బంగ్లాదేశ్ మంత్రి, అధికారులు అతిధులుగా హాజరుకానున్నారు. సోమవారం (డిసెంబర్ 1) నాటి…

మీ మౌనం ఇక ఎంతమాత్రం పరిష్కారం కాదు -కవిత

(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ…

ప్రతిష్టంభనను కరిగించిన సార్క్ హ్యాండ్ షేక్ -కార్టూన్

ఇటీవల జరిగిన సార్క్ సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయాయి. ప్రాంతీయ సమగ్రత, ఐక్యతల కోసం అని చెబుతూ ఏర్పాటు చేసిన సార్క్ కూటమి సభ్య దేశాలు నిరంతరం ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతోనే కాలం గడిపాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల సారధులను ఆహ్వానించి ఆశలను చిగురింపజేసిన నరేంద్ర మోడి తీరా అసలు సార్క్ సమావేశాలకు వచ్చేసరికి తుస్సు మానిపించారు. సార్క్ లో ఇండియా, పాకిస్తాన్ లే అతి…

ఇసిస్ లో చేరిన ఇండియన్ తిరిగి రాక

ఇరాక్, సిరియాలలో భూభాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పరిచిందని అమెరికా ప్రకటించిన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ సంస్ధ లో చేరిన భారతీయుడు వెనక్కి వచ్చేశాడని ది హిందు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాయబార ఛానెళ్ల ద్వారా ప్రయత్నాలు చేయడంతో ఆరిఫ్ మజీద్ క్షేమంగా దేశానికి చేరుకున్నాడని పత్రిక తెలిపింది. మోసుల్ లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆరిఫ్ చనిపోయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆరిఫ్ తో పాటు వెళ్ళిన మరో…