తాలిబాన్ తుపాకి శిక్షణ టార్గెట్లు: పూలు! -కార్టూన్

లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా…

విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది. జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు…

ప్రతిపక్షం చేతికి ‘మత మార్పిడి’ ఆయుధం! -కార్టూన్

మత మార్పిడులు ఎప్పటి నుండో బి.జె.పి రాజకీయ అస్త్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మత మార్పిడులను భావోద్వేగాలను రెచ్చగొట్టగల ఆయుధంగా తయారు చేసుకున్న బి.జె.పి అనేకమార్లు దాన్ని ప్రయోగించి ఓట్లు నొల్లుకుంది. అయితే అది అధికారంలో లేనంతవరకు మాత్రమే ఆయుధం కాగలదని, అధికారంలోకి వచ్చాక ఎదురు తిరగుతుందని ఈ కార్టూన్ సూచిస్తోంది. కార్టూన్ లో ఉన్న మరో అంశం పిల్లిలా ఉన్న ప్రతిపక్షం మత మార్పిడుల వల్ల పులిగా మారిపోయిందని. బలం లేక, ఐక్యత కొరవడి, అధికార పక్షం…

పాక్ పాఠశాలపై ఉగ్ర దాడి, 84 మంది పిల్లలు బలి -ఫోటోలు

పాకిస్ధాన్ కు చెందిన తాలిబాన్ శాఖ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పెషావర్ పట్టణంలో పరమ హీనమైన దాడికి పాల్పడింది. అమెరికాలో మాత్రమే కనిపించే ఉగ్రవాద తరహా దాడికి పాక్ తాలిబాన్ తెగబడింది. పాఠశాలపై తుపాకులతో దాడి చేసి అభం శుభం ఎరుగని పసి పిల్లలను కాల్చి చంపే ఉన్మత్త ఘటనలు ఇప్పటిదాకా అమెరికాకు మాత్రమే పరిమితం. అలాంటి దాడి పాకిస్ధాన్ లో చోటు చేసుకుంది. 6గురు తాలిబాన్ ఆత్మాహుతి కార్యకర్తలు జరిపిన దాడిలో 126 మంది చనిపోగా వారిలో 84…

పోలీస్ చర్యతో సిడ్నీ సీజ్ అంతం -ఫోటోలు

సిడ్నీలో ఒక చాకోలేట్ కేఫ్ ను అదుపులో తీసుకున్న ఆగంతకుడు ఒకరు ఒక రోజంతా భయాందోళనలు సృష్టించాడు. కేఫ్ లో ఉన్న పౌరులను బందీలుగా ఉంచుకున్న సాయుధ వ్యక్తి డిమాండ్ లు ఏమీ చేయకపోవడం విశేషం. ఆగంతుకుడు ముస్లిం ఉగ్రవాదిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. తీరా చూస్తే ఆ వ్యక్తి ఒక ఇరానియన్ ఆస్ట్రేలియన్ అనీ, తనపై దాఖలైన కేసుల్లో హై కోర్టు నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని కొన్ని పత్రికలు…

లిక్విడిటీ ఆంటే? -ఈనాడు

బిజినెస్ వార్తల్లో మనం తరచుగా వినే/చదివే మాట ‘లిక్విడిటీ.’ వివిధ ఆస్తులకు ఎంత లిక్విడిటీ ఉందన్న విషయంపై ఆధారపడి వాటికి కొనుగోలుదారులు లభిస్తారు. లిక్విడ్ అంటే ద్రవం. ద్రవం ఒక చోట నిలబడేది కాదు. దాన్ని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపంలో నిలబడి ఉంటుంది. నియంత్రించే పాత్ర ఏమీ లేకపోతే అది తేలికగా ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తుంది. ఈ కారణం చేతనే ఒక ఆస్తిని డబ్బుగా మార్చగల సామర్ధ్యాన్ని లిక్విడిటీ అన్నారు.…

అమెరికా ఎన్.ఎం.డిని ఛేదించగల చైనా హైపర్ సోనిక్

అమెరికా అభివృద్ధి చేసుకున్న మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడును చైనా తాజాగా పరీక్షించింది. శబ్ద వేగానికి 10 రెట్ల వేగంతో ప్రయాణించగల హైపర్ సోనిక్ మిసైల్ అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడు కావడం దాని వేగం వల్లనే. దూసుకు వచ్చే మిసైళ్లను మధ్యలోనే కనిపెట్టి దానిని గాలిలోనే మరో మిసైల్ తో ఎదుర్కొని మట్టి కరిపించే వ్యవస్ధను అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇందులో దాడికి వచ్చే మిసైల్ వేగాన్ని కనిపెట్టి, నిర్దిష్ట సమయంలో ఏ పాయింట్…

ఇండియా-రష్యా సంబంధాలకు పరీక్షకాలం -ది హిందు ఎడిట్

(రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా వచ్చి వెళ్లారు. 20 ఒప్పందాలను ఆయన కుదుర్చుకుని మరీ వెళ్లారు. ఈ ఒప్పందాలను అమెరికా విమర్శించింది. ఈ అంశం గురించి ఈ రోజు ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ‘Testing times for India-Russia ties’ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ********* బిలియన్ల డాలర్ల విలువ కలిగిన 20 ఒప్పందాలపై ఒక్క రోజులో సంతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత సందర్శన ఒక ఉత్పాదక సందర్శన…

బ్రాహ్మణుల ఎంగిలాకులపై దొర్లే మాదే స్నానపై సుప్రీం స్టే

మాదే స్నాన! 500 యేళ్ళ నుండి కొనసాగుతున్న ఆచారం అని చెపుతూ అటు అగ్ర కులస్ధులు, ఇటు నిమ్న కులస్ధులు ఆచరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ఆచారం. వినడానికి, చదవడానికి జుగుప్స కలిగించే ఈ ఆచారాన్ని రద్దు చేయాలని బి.సి. సంఘాలు అనేక యేళ్లుగా పోరాడుతున్నా, ప్రభుత్వాల-కోర్టుల పరోక్ష మద్దతుతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తన చెంతకు వచ్చిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ‘ఆచారాన్ని కొనసాగించవచ్చన్న’ హై కోర్టు ఆదేశాలపై స్టే…

ఇండియాలో పుటిన్: చమురు, అణు ఒప్పందాలతో సందడి

రష్యా అధ్యక్షుడు పుటిన్ ఒక రోజు ఇండియా సందర్శన రష్యాకు ఫలప్రదంగా ముగిసింది. డజను అణు రియాక్టర్ల నిర్మాణం, చమురు సరఫరా ఒప్పందం, మిలట్రీ సరఫరా ఒప్పందాలతో పుటిన్ కడుపు నింపుకుని సంతృప్తిగా వెళ్లారు. అమెరికా తన షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తిని తీవ్రం చేయడం ద్వారా అంతర్జాతీయ రేట్లను కిందికి నెట్టడంతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కష్టాల్లో పడిన సందర్భంలో ఇండియాతో చేసుకున్న ఒప్పందాలు రష్యాకు మేలు చేస్తాయి. ఇండియాకు మాత్రం అనుత్పాదక వ్యయాన్ని పెంచుకోవడం…

వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు

ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్! పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్…

ఇండియాకున్నది ఒకే పుస్తకం -ది హిందు ఎడిటోరియల్

(కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులే కాదు, మోడి కొలువులోని సీనియర్ మంత్రులు సైతం హిందూత్వ భావజాలాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భగవద్గీత పుస్తకాన్ని ‘జాతీయ గ్రంధం’ గా ప్రకటించాలని సుష్మ వ్యక్తం చేసిన కోరిక ఏదో యధాలాపంగా చేసినది కాదు. నిర్దిష్ట లక్ష్యం తోనే ఆమె ఆ మాటలు చెప్పారు. ఈ అంశంపై ది హిందు, డిసెంబర్ 10, 2014 తేదీన వెలువరించిన సంపాదకీయం.…

కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి…

నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు. భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు…

భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు. రారాజులు,…