బి.జె.పి రోజులివి! -కార్టూన్

“అమిత్ షాజీ! మన సొంత తెల్లపావుల భావాలను కాస్త ఉపశమనపరచండి…” ********* ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆకర్షక కేంద్రంగా మారింది. ఇతర పార్టీల్లోని ఛోటా మోటా నాయకులతో పాటు బడా నేతలు సైతం బి.జె.పిలో చేరిపోవడానికి ఆతృత ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలోని ప్రత్యర్ధులు అనేకులు తమ సొంత రంగు మార్చుకుని బి.జె.పి రంగు పూసుకుంటున్నారన్న సంగతిని చదరంగం బల్ల ద్వారా కార్టూనిస్టు ప్రతిభావంతంగా చెప్పారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా ఉన్న బి.జె.పి ఆకర్షక పార్టీగా మారడానికి…

భద్రతపై విభేదాలు, ఒబామా ఆగ్రా పర్యటన రద్దు

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దయిందని భారత అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన భార్య మిచెల్లే ఒబామాతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారని ఇప్పటివరకు ఇరు దేశాలు విడుదల చేసిన షెడ్యూళ్ళు చెబుతూ వచ్చాయి. కానీ ఆగ్రా పర్యటన సందర్భంగా ఒబామా భద్రత కోసం తీసుకోవలసిన చర్యల విషయమై భారత భద్రతా బలగాలకు, అమెరికా భద్రతా బలగాలకు స్వల్ప విభేదాలు తలెత్తడంతో ఒబామా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24వ…

2014-15 Q3 లో టి.సి.ఎస్ తొలగింపులు 11,693

భారత దేశ ఐ.టి దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ లే-ఆఫ్ (ఉద్యోగుల తొలగింపు) ఉదంతంలో వాస్తవాలు నానాటికీ మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంపెనీ విడుదల చేసిన మూడవ త్రైమాసిక ఫలితాలలో వాస్తవ ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఎంతో కంపెనీయే స్వయంగా ప్రకటించింది. కంపెనీ అధిపతులు మొదట చెప్పినట్లుగా కేవలం 1 శాతం మాత్రమే తొలగింపులు ఉన్నాయనడం నిజం కాదని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ‘నాన్-పెర్ఫార్మర్స్’ పేరుతో టి.సి.ఎస్ కంపెనీ పెద్ద సంఖ్యలో…

రాష్ట్రపతి బోధన -ది హిందు ఎడిటోరియల్

[22/01/2015 తేదీ నాటి ది హిందూ సంపాదకీయం ‘The President’s counsel’ కు యధాతధ అనువాదం.] ఆర్డినెన్స్ ల జారీ మార్గంలో చట్టాలను చేయగల విశేషాధికారాలకు ఉన్న రాజ్యాంగ పరిమితులను గుర్తు చేయడం ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పదే పదే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వ ప్రవృత్తికి అడ్డుకట్ట వేయగలరని ఆశించబడుతోంది. ఇటీవలి వారాలలో ప్రభుత్వ సలహా మేరకు వరసబెట్టి ఆర్డినెన్స్ లపై సంతకాలు చేసిన రాష్ట్రపతి ముఖర్జీ -ఆ క్రమంలో ఆర్డినెన్స్ తేవలసిన…

గాల్లోంచి ఢిల్లీ పీఠంపైకి బేడీ -కార్టూన్

“ఇదేదో మన పీకల మీదికే వచ్చేట్లుంది….” ************ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పస ఏమిటో, అది ఎందుకు ఎవరి ప్రోద్బలంతో మొదలై చివరికి చప్పగా ముగిసిందో జనానికి బహుశా ఇప్పుడు తెలిసి ఉండాలి. అలాగే, అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్ పాల్ చట్టాన్ని సాధించలేని పరిస్ధితుల్లో ఇక రాజకీయాల్లోకి దిగుదామని కొత్త పార్టీ పెడదామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినప్పుడు ఆయన కొలీగ్ కిరణ్ బేడీ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారో కూడా ఇప్పుడు జనానికి…

జీవన విధానాల్ని శాసిస్తున్న మొబైల్ ఫోన్ -ఫోటోలు

ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన విధానాల్ని దాదాపుగా శాసిస్తున్న ఉపకరణం, మొబైల్ ఫోన్! జీవన విధానాల్ని మొబైల్ ఫోన్ తిరగరాస్తోందని కొందరు చెబుతారు గాని అది ఒకింత ఓవర్ స్టేట్ మెంట్. అప్పటికే స్ధిరపడిన జీవన విధానంలో కొన్ని పనుల్ని మొబైల్ ఫోన్ చాలా సులభతరం చేసిన మాట నిజమే. కానీ మొబైల్ కంపెనీలా లేక వినియోగదారులా ఎవరు ఎక్కువ లాభ పడ్డారు అని ప్రశ్నించుకుంటే మాత్రం కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని తధ్యంగా చెప్పవచ్చు. ఒకనాడు,…

ఆర్.బి.ఐ ఆశ్చర్యకర వడ్డీ కోత! -ది హిందు

మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో…

కుల రాజకీయ చెదలు పట్టిన సృజన -కార్టూన్

తమిళనాట కులాల కార్చిచ్చు రగిలి సమస్త సామాజిక గతిని నమిలి పారేస్తోంది. ముఖ్యంగా సమాజ ప్రగతికి దోహదం చేసే సృజనాత్మక రచనలను అది దహించివేస్తోంది. కాలకూట విషం కక్కుతూ అటు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇటు రాజకీయ చైతన్యాన్ని మొద్దుబార్చుతోంది. ప్రఖ్యాత రచయిత పెరుమాళ్ మురుగన్ తాను రచయితగా చచ్చిపోయానని, రచనలన్నింటిని ఉపసంహరించుకుంటున్నానని, ఇక రచనలు చేయబోనని ప్రకటించడం ఈ ఒరవడిలో జరిగిన పరిణామమే. మురుగన్ నాలుగు సంవత్సరాల క్రితం రాసిన మధోరుబాగన్ నవల ఇటీవల…

ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

మహా విలయం సునామీకి పదేళ్ళు -ఫోటోలు

డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు. సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ.…

ప్రధాని మూపురంపై మరో భారం -కార్టూన్

భారతీయ జనతా పార్టీ ఎం.పి సాక్షి మహారాజ్ చేస్తున్న (వివాదాస్పద ప్రతిపాదనలతో కూడిన) ప్రకటనలు ఆ పార్టీ ఆమోదంతోనే చేస్తున్నారా లేక తమ నేతలు ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా చేస్తున్నారా? ఆయనతో పాటు ఇతర బి.జె.పి నేతలు, హిందూత్వ సంస్ధల నేతలు చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనల వెనుక ప్రధాని నరేంద్ర మోడి మద్దతు లేదా? ప్రధాని నరేంద్ర మోడి ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా సాక్షి మహారాజ్ తన ధోరణిలో తాను వెళ్లిపోతున్నారని ఈ కార్టూన్…

రాజపక్సే: నిలువునా కూలిన మర్రిమాను -కార్టూన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన! వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల…

నేను మార్క్సిస్టుని! -దలైలామా

కమ్యూనిజానికి కాలం చెల్లిందని నమ్ముతున్నవారికిది దుర్వార్త! హిందూ మతోన్మాదాన్ని పీకలదాకా ఎక్కించుకుని, బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకుని, చైనామీద వ్యతిరేకతతో దలైలామా పైన ప్రేమ పెంచుకున్న జీవులకు, బహుశా డిప్రెషన్ లోకి నెట్టివేసే విషాద వార్త! దలైలామా సైతం ‘నేను మార్క్సిస్టుని’ అని చాటుకోవడం కంటే మించిన విషాదకర దుర్వార్త ఉండగలదా? “సామాజికార్ధిక సిద్ధాంతానికి సంబంధించినంతవరకు నేను ఇంకా మార్క్సిస్టునే” అని దలైలామా ప్రకటించారు. “నేను ఇంకా” అనడం ద్వారా తాను పూర్వాశ్రమంలో ‘మార్క్సిస్టుని’ అని దలైలామా…

సరళీ-ప్రైవేటీ-ప్రపంచీ కరణాలు -ఈనాడు

LPG! ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన ఊతపదం. దీనిపైన ఒక జోక్ వ్యాప్తిలో ఉంది. LPG అంటే ఏమిటో తెలుసా? అని ఓ వ్యక్తి అడిగాడట. ‘ఆ, ఏముంది గ్యాసే కదా!’ అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడట. LPG అంటే ఏమిటని అడిగిన వ్యక్తి ఉద్దేశ్యం Liberalisation, Privatisation, Globalisation అని. ఈ విధానాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, ఉద్యోగాలు కుమ్మరిస్తాయని, దేశం ఒకటే అభివృద్ధి చెందుతుందని దేశాల పాలకులు చెబుతారు. ఈ…

శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…