ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు. మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు…

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల…

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను…

పోషక లోపం: ప్రపంచంలో 25% ఇండియాలోనే

ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో…

మోడి ద సూపర్ హీరో -కార్టూన్

“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…” ************* గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ…

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం…

కాశ్మీర్ లో ఉక్కు పాదం -ది హిందు ఎడిట్..

[మే 21 తేదీన ఉత్తర కాశ్మీర్ లోని పల్హాలాన్ గ్రామంలో గ్రామ ప్రజలు మీర్వాయిజ్ మౌల్వీ ఫరూక్ 25వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు ఊరేగింపు పైకి పంప్ గన్ పెల్లెట్లు పేల్చారు. నాన్-లెధల్ వెపన్ పేరుతో కాశ్మీర్ భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాల వల్ల వందలమంది తీవ్ర గాయాలపాలై కంటి చూపు కోల్పోతున్నారు. నాన్-లెధల్ అని చెప్పినప్పటికీ పదుల సంఖ్యలో వీటి బారినపడి మరణించారు. మే 21 తేదీన ట్యూషన్ కి వెళుతూ…

చైనా సమూహ కళకు సరిలేరు ఎవ్వరూ! -ఫోటోలు

ప్రజా సమూహాలు అన్నీ ఒకే మాదిరిగా, ఒకే భావాన్ని కలిగించేవిగా ఉండవు. కొన్ని సమూహాలు అబ్బురపరిస్తే కొన్ని సమూహాలు చీదర  పుట్టిస్తాయి. కొన్ని సమూహాలు ఔరా! అనిపిస్తే మరికొన్ని ఇదెలా సాధ్యం అని విస్తుపోయేలా చేస్తాయి. సమూహంలో క్రమ శిక్షణ ఉంటే ఆ సమూహానికి ఎనలేని అందం వచ్చి చేరుతుంది. అది మిలటరీ క్రమ శిక్షణ అయితే చెప్పనే అవసరం లేదు. క్రమబద్ధమైన కదలికలతో మిలట్రీ సమూహాలు చేసే విన్యాసాలు చూడముచ్చట గొలుపుతూ విసుగు అనేది తెలియకుండా…

జయ కారుకు కొర్టే ఇంజన్ -కార్టూన్

ఈ కార్టూన్ ను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ఒకటి: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను మరోసారి చేపట్టిన జయలలితకు ఆమెను జైలు జీవితం నుండి బైటపడడానికి కోర్టులే సహకరించాయన్న అర్ధం ఈ కార్టూన్ లో ద్యోతకం అవుతోంది. రెండు: ఇన్నాళ్లూ ఆమె ముఖ్య మంత్రిగా కారులో ప్రయాణించకపోవడానికి కోర్టు కేసులు ఆటంకంగా, అడ్డంగా ఉన్నాయని లాయర్లు శ్రమించి ఆ ఆటంకాన్ని తొలగించి సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తిరిగి ప్రయాణం ప్రారంభించారని మరో అర్ధం. ఈ రెండు…

ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…

చైనా సరిహద్దులో భద్రత తగ్గింపు

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో చైనా చొరబాట్ల గురించి బి.జె.పి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రధాని నరేంద్ర మోడి గారయితే చైనా విషయంలో యు.పి.ఏ పై నిప్పులు చెరిగేవారు. హిందూత్వ అభిమానగణం గురించి ఇక చెప్పనే అవసరం లేదు. హిందూత్వపై విమర్శలు కనపడిన చోటల్లా చొరబడి చైనా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని దాడికి దిగుతారు. కొండొకచో బూతులకు లంకించుకుంటారు. తీరా మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా, చైనా…

ఎవరు జీరో, ఎవరు హీరో! -కార్టూన్

నరేంద్ర మోడి ఏడాది పాలనకు రాహుల్ గాంధీ ఇచ్చిన మార్కులు పదికి సున్నా (జీరో). ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆనందంగా బల్లలు చరిచారు. రాహుల్ గాంధీ లాంటి పిల్లగాడు తమ అధినేతను జీరోను చేస్తే బి.జె.పి నేతలు ఊరుకుంటారా? చస్తే ఊరుకోరు. వెంకయ్య నాయుడు గారి లాంటి ప్రాసల పండితులైతే అసలే ఊరుకోరు. “జీరోలకు జీరోలే కనిపిస్తారు. హీరోలు కనిపించరు” అని రాహుల్ విమర్శను ఆయన తిప్పి…

మావోయిస్టు అవడం నేరం కాదు -చారిత్రక తీర్పు

కేరళ హై కోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించింది.  జస్టిస్ చిన్నపరెడ్డి (కిష్టయ్య, బాలాగౌడ్ కేసు), జస్టిస్ తార్కుండే (ప్రభుత్వోద్యోగుల రాజకీయ భావాలు) లాంటి గొప్ప న్యాయమూర్తుల తీర్పుల సరసన చేర్చగల ఈ తీర్పు ప్రకారం కేవలం మావోయిస్టుగా ఉండడమే నేరం కాదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడనంతవరకు మావోయిస్టు భావజాలం ఒక వ్యక్తిని నేరస్ధుడిగా చేయబోదని తీర్పు పేర్కొంది. మావోయిస్టు భావజాలం దేశంలో ఉనికిలో ఉన్న రాజ్యాంగబద్ధ రాజ్యపాలన (constitutional polity)…