విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు

వెనకటికో పెద్దాయన పని లేక పిల్లి తల గొరగడం మొదలు పెట్టాట్ట. పని లేని పెద్దలు తల పైన జుట్టుని, మొఖం మీద వెంట్రుకల్ని విచిత్రమైన షేపులతో కత్తిరించే ఫ్యాషన్ ని కనిపెట్టారేమో ఎవరన్నా పరిశోధించి కనిపెట్టాలి. పనే లేదో, తెలివి ప్రదర్శనకు మరో మార్గమే దొరక లేదో తెలియదు గానీ కొందరు తాము నివసించే ఇళ్లను సైతం వినూత్నంగా నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారూ వీరని కాకుండా ఈ బాపతు మేధావులు లేదా కళా కారులు ప్రపంచం…

ఢిల్లీలో కేజ్రీ-జంగాసన -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినం (International Day of Yoga) గా జరపనున్నారు. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస యోగా దినం ప్రకటించింది. సొంత ప్రచారానికి, జబ్బలు చరుచుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలని బి.జె.పి, నరేంద్ర మోడిలు ఐ.డి.వై ప్రకటనను కూడా తమ విజయంగా చాటుతున్నారు. ఐ.డి.వై నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి కార్యక్రమాలు రూపొందించారు. జూన్ 21…

యోగాపై అమితాసక్తి -ది హిందు ఎడిటోరియల్

శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదం చేసే ప్రయోజక శాస్త్రంగా ప్రపంచవ్యాపితంగా యోగా అంతకంతకూ అధిక గుర్తింపు పొందుతున్న సమయంలోనే, ఈ భారతీయ ప్రాచీన పద్ధతి, ప్రధానంగా నరేంద్ర మోడి ప్రభుత్వం యొక్క దూకుడుమారి ప్రోత్సాహం కారణంగా, అనవసర వివాదంలో చిక్కుకోవడం విచారకరం. (యోగా అమలుపై) ప్రభుత్వం అతిశయాత్మక ఆసక్తి చూపుతోందనీ తన ఉద్యోగులు మరియు సంస్ధలను తన సొంత దృక్పధంతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు వినియోగించే ధోరణిలో ఉన్నదన్న భావనలు కలగకుండా ఉండడం చాలా…

నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి. శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి…

ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…

రెండు రాష్ట్రాలు, ఒక సవాలు -ది హిందు ఎడిట్

[Two states, one challenge శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ********************* తాము ఏర్పడిన ఏడాది తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు శక్తి, నీరు ఇతర ఆస్తులు లాంటి వనరుల పంపకం సమస్యలతో సతమతం అవడం కొనసాగుతూనే ఉంది. అవిభాజ్య రాష్ట్ర ఆదాయంలో 22 శాతం వాటా కలిగి ఉన్న హైద్రాబాద్ నుండి రెవిన్యూ ప్రవాహం లేకపోవడంతో, గత యు.పి.ఏ ప్రభుత్వం…

సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!

శాస్త్ర బద్ధ అంశాలకు మతాన్ని జోడిస్తే వచ్చే దుష్ఫలితం ఇది! మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా దోహదం చేసే ‘యోగా’, ‘సూర్య నమాస్కారాలు’ ఇస్లాం కి వ్యతిరేకం కాబట్టి వాటిని పాఠశాలల్లో బోధించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేస్తోంది. తద్వారా బ్రూనోను తగలబెట్టిన క్రైస్తవాన్ని, వేదాలు వినకుండా పంచముల చెవుల్లో సీసం పోసిన మనువాదాన్ని ముస్లిం బోర్డు స్ఫురణకు తెస్తోంది. రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని బి.జె.పి ప్రభుత్వాలు ఇటీవల తమ పాఠశాలల్లో…

పరీక్షలకు 19 కోట్లు, ప్రకటనలకు 445 కోట్లు

క్వాలిటీకి తాము అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని నెస్లే గ్లోబల్ సి.ఇ.ఓ చెప్పిన మాట! కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని కంపెనీ వార్షిక నివేదికలు (బ్యాలన్స్ షీట్) వెల్లడిస్తున్నాయి. నెస్లే ఇండియా కంపెనీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన మొత్తంలో 5 శాతం కంటే తక్కువే క్వాలిటీ పరీక్షల కోసం ఖర్చు పెడుతోంది. 2014 సంవత్సరంలో నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రకటనల కోసం 445 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ…

ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

భూమిపూజ: కేంద్రం నుండి కొబ్బరిచిప్ప -కార్టూన్

విభజన రాజకీయాలు పూర్తి స్ధాయిలో సాగుతున్న కాలంలో, కేవలం సంవత్సర కాలం క్రితమే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇప్పటి బి.జె.పి ప్రభుత్వం గానీ ఇవ్వని వాగ్దానం లేదు. నూతన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అనేక సంస్ధలు, నిధులు వాగ్దానం చేసినా అవేవీ అమలు కాకపోగా, కనీసం అమలు చేస్తామన్న నమ్మకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర విభజనలో తమది కూడా గణనీయమైన పాత్రే అని చెప్పుకోవడం బి.జె.పికి ఇష్టం. అటు తెలంగాణ ప్రజలకేమో తమ…

కింద పడ్డా పై చేయి మాదే -మ్యాగి

భారత దేశంలో ఎల్లెడలా ఒత్తిడి తీవ్రం కావడంతో స్విట్జర్లాండ్ బహుళజాతి కంపెనీ నెస్లే (Nestle) వెనక్కి తగ్గింది. దేశ వ్యాపితంగా అన్ని దుకాణాల నుండి మ్యాగి నిల్వలను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ అధిపతి ప్రకటించాడు. అయితే కింద పడ్డా పై చేయి తనదే అని చెబుతున్నట్లుగా మ్యాగీలో మోనో సోడియం గ్లుటామెట్ (ఎం.ఎస్.జి) ని కలప లేదని బొంకడం మాత్రం మానలేదు. దేశంలో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగి శాంపిళ్లను పరీక్షకు పంపుతూ తమ తమ రాష్ట్ర…

వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.] ***************** “న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం,…

మ్యాగి పురుగు పట్టిన మన ఆహార భద్రత -కార్టూన్

ఆహార భద్రత గురించి మన దేశ ప్రధానుల దగ్గర్నుండి ఛోటా మోటా ఐ.ఏ.ఎస్ అధికారుల వరకు చెప్పని కబురు లేదు. వాస్తవంలో భారత దేశ ఆహార భద్రత పురుగులు పట్టి కుళ్లిపోయిన యాపిల్ పరిస్ధితికి దిగజారిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపారు. 2 నిమిషాల్లో వండిపడేసే మ్యాగిలో ఆనారోగ్య కారక రసాయనాలు ఉన్నాయని తేలడంతో పలు రాష్ట్రాలు మ్యాగి శాంపిళ్ళను పరీక్ష చేయిస్తున్న నేపధ్యంలో మన ఆహార భద్రత పరిస్ధితిని ఈ కార్టూన్ వివరిస్తోంది. గత ఏప్రిల్ నెలలో…

ఋతుపవనాలు: ఈ యేడూ కష్టమే

ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది.  93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది. తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన…

ఒక ఆదేశం, కొన్ని ప్రశ్నలు -ది హిందు ఎడిట్..

సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు…