వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ)…

జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…

హాంగ్ కాంగ్ గొడుగు ఉద్యమం ఏడాది తర్వాత.. -ఫోటోలు

గత సంవత్సరం సెప్టెంబర్ లో హాంగ్ కాంగ్ లో విద్యార్ధులు, యువకులు ఒక ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమానికి ‘ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఉద్యమం’గా పశ్చిమ పత్రికలు చెప్పుకుని సంతోషిస్తుంటాయి. పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన అరబ్ వసంతం లిబియాను కుక్కలు చింపిన విస్తరి చేసినట్లే, ఈజిప్టును తిరిగి మిలట్రీ చీకటి కొట్టంలోకి విసిరి కొట్టినట్టే, సిరియాను అల్లకల్లోలం కావించి ముక్కలు ముక్కలుగా విడదీయడానికి ఉద్దేశించినట్లే… హాంగ్ కాంగ్ లో జరిగిన సొ కాల్డ్ ‘ప్రజాస్వామిక ఉద్యమం’…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…

సల్మాన్ కొక న్యాయం, అఫ్జల్ కొక న్యాయం?! -1

భారత దేశ పార్లమెంటరీ రాజకీయార్ధిక వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడుతున్న భారతీయ కోర్టులు తాము, రాజ్యాంగ చట్టాలు చెబుతున్నట్లుగా, అందరికీ ఒకటే న్యాయం అమలు చేయడం లేదని మరోసారి రుజువు చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ & రన్ కేసు విషయంలో అంతిమ తీర్పు ప్రకటిస్తూ ముంబై హై కోర్టు చేసిన వ్యాఖ్యలు, పొందుపరిచిన సూత్రాలకూ అఫ్జల్ గురు కేసు విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూత్రాలకూ మధ్య తేడాను గమనిస్తే ఈ సంగతి తేలికగా…

లాతుఫ్ కార్టూన్ లపై టర్కీ నిషేధం

పాత టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం తరహాలో మధ్య ప్రాచ్యంలో సరికొత్త టర్కీ సామ్రాజ్యాన్ని స్ధాపించాలని కలలు గంటున్న టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, అంతకంతకూ ఫాసిస్టు రూపం ధరిస్తున్నాడు. సిరియా విచ్ఛిన్నానికి కుట్రలు పన్నిన పశ్చిమ సామ్రాజ్యవాదుల వ్యూహాల్లో తురుపు ముక్కగా మారి అత్యంత విద్రోహకర, ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఎర్డోగన్ టర్కీ ప్రజల ప్రాధమిక హక్కులను ఒక్కొక్కటిగా హరించి వేస్తున్నాడు. వేలాది ప్రతిపక్ష నేతలతో పాటు వారి మద్దతుదారులను కూడా జైళ్ళలో…

8 నెలల్లో 111 లాకప్ హత్యలు!

పోలీసుల కస్టడీలో ఉండగా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని చనిపోతే ఆ చావులను లాకప్ హత్యలు అంటారు. (ఇది పాఠకులకు తెలియదని కాదు. కానీ రాయడంలో ఒక పద్ధతిని పాటిస్తే చెప్పదలిచిన విషయం స్పష్టంగా ఉంటుందని.) గత 8 నెలల్లో భారత దేశంలోని పోలీసులు తమ నిర్బంధంలో తీసుకున్నవారిలో ఏకంగా 111 మందిని చంపేశారు. ‘నిజం’ రాబట్టడానికి అని చెబుతూ పోలీసులు ధర్డ్ డిగ్రీ పద్ధతుల్ని పాటిస్తారు. ధర్డ్ డిగ్రీ పద్ధతులు వాస్తవానికి చట్టబద్ధం కాదు. అనగా…

చెన్నై వరదలు: ఇదీ అమ్మ సాయం! -కార్టూన్

తమిళనాట వ్యక్తి పూజ జాస్తి. అభిమాన నటుడికి గుడి కట్టి పూజించేవరకూ ‘వ్యక్తి పూజ’ వెళ్తుందని తమిళులు ఇప్పటికే అనేక తడవలు చాటుకున్నారు. ‘అమ్మ పూజ’ ఇప్పుడు అన్ని పాత రికార్డులను దాటుకుని విపరీత స్దాయికి చేరుకుందని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. ‘అమ్మ పూజ’ ఎంత వికృత స్ధాయికి చేరిందో చెన్నై వరదలు వెల్లడి చేశాయి. ‘అమ్మ’కి జైలు శిక్ష పడినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ సహా మంత్రివర్గం మొత్తం టి.వి కెమెరాల ముందు కుమిలి…

ఇసిస్ చమురు టర్కీ కొనుగోలు, సాక్షాలు చూపిన రష్యా

రెండు దేశాలలోని (ఇరాక్, సిరియా) ప్రాంతాలను ఆక్రమించుకుని ఏలుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఇసిస్ లేదా ఇసిల్ లేదా దాయిష్) కు ఆర్ధిక వనరులు ఎక్కడివి? ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారం లేకుండా ఆయుధాలకు, కిరాయి సైనికుల వేతనాలకు డబ్బు ఎలా సమకూర్చుతోంది? ఒక ప్రాంతాన్ని ఏలుతున్న పాలక వ్యవస్ధ నిలబడాలంటే ఆర్ధిక వనరులు తప్పనిసరి. తమ తరపున పని చేసేవారికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. మరి ప్రపంచం అంతా టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసిన ఇస్లామిక్…

చెన్నై: వాన గ్రహణం -కార్టూన్

“కార్టూన్ పొలికేక వేసినట్లు ఉండకూడదు. రణగొణ ధ్వనులతో అస్పష్టంగా కూడా ఉండకూడదు. నిశ్శబ్దంగా, సూటిగా, స్పష్టంగా ఉండాలి” అని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే కేశవ్ కార్టూన్స్ లో పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉండవు. పొడవైన డైలాగ్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక హెడ్డింగ్, ఒక శీర్షిక, ఒక సామెత, ఒక వాడుక, ఒక సార్వజనీన వాస్తవం… ఇవి మాత్రమే కనిపిస్తాయి. కాకుంటే చెన్నైను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన…

హర్యానాలో మరో దాద్రి!

ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు.…