పోలీసుల ముందే కొట్టారు -కన్హైయా

ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియని పరిస్ధితుల్లో వీడియోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్ధితి దాపురించింది. శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖమయం చేయడం ఏమో గానీ కుట్రదారులకు మాత్రం అది బాగా ఉపకరిస్తోంది. నేరుగా వాదించి నెగ్గలేని హిందూత్వ సంస్ధలు వీడియో మార్ఫింగ్ లకు దిగడంతో చివరికి వీడియోలను సైతం పట్టి పట్టి చూడవలసి వస్తోంది. కన్హైయా కుమార్ ని ఎవరూ కొట్టలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఆర్భాటంగా…

మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?

మహిషాసుర సంహారానికి వ్యతిరేకంగా, హిందూ నమ్మకాలకు విరుద్ధంగా మహిషాసురుడి అమర దినాన్ని జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి, ఓ‌బి‌సి, మైనారిటీ విద్యార్ధులు జరపడం “మానసిక భ్రష్టత్వంగా మానవ వనరుల శాఖ మంత్రి నిన్న పార్లమెంటులో తూలనాడారు. హిందూ పురాణాలలో దేవతలుగా, వీరులుగా, దేవుళ్ళుగా కొలవబడుతున్నవాళ్ళు దేశంలో అనేక మూలల్లో విలన్లుగా చీత్కరిస్తున్న వాస్తవాలు మంత్రి గారికి తెలియక కాదు. రిజర్వేషన్ వ్యతిరేక, హిందూ భావోద్వేగ, అగ్రకులాల ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఆమె హిందూ సాంప్రదాయాలను దళితులు తూలనాడుతున్నారన్న…

అసురులు భ్రష్ట మనస్కులా స్మృతి గారూ!

రోహిత్ మరణం గురించిన వ్యాఖ్యానాల వల్లనే స్మృతి ఇరానీ మాటలను దళిత ద్వేషంగా చెప్పడం కాదు. జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధుల సంఘం మహిషాసుర అమర దినం జరిపినందుకు కూడా సభలోనే చీదరించుకున్నారు. “ఈ పాంప్లెట్ రాసింది ఎవరు?” అని తనను తాను ప్రశ్నించుకుంటూ పాంప్లెట్ చివర “ఎస్‌సి ఎస్‌టి విద్యార్ధి సంఘం” ను పెద్దగా చదివి వినిపిస్తూ ఆమె “What is this depraved mentality?” అని చీదరగా ప్రశ్నించారు. “And may my…

స్మృతి మళ్ళీ అబద్ధం చెప్పారు!

నోరు తెరిస్తే అబద్ధమేనా? బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కూడా! తన ప్రసంగానికి భావోద్వేగాలను అద్దడం కోసం జరగనివి జరిగినట్లుగా, జరిగినవి జరగనట్లుగా చెప్పడం ఎవరికైనా తగునా? లేక దేశాన్ని ఏలుతున్నారు గనుక కేంద్ర మంత్రులకు తగుతుందా? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత ప్రజాస్వామిక దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులోనే ఆమె అబద్ధాలు చెప్పేస్తున్నారు. అది కూడా ఒక చనిపోయిన విద్యార్ధి కుటుంబం లక్ష్యంగా! రోహిత్ వేముల…

జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటం: సమగ్రంగా -2

మొదటి భాగం తరువాత…… ఫిబ్రవరి 17 తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవీ అమలు జరగలేదు. అదే లాయర్లు మళ్ళీ దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. కన్హైయా చుట్టూ డజన్ల మంది పోలీసులు వలయంగా ఏర్పడి లోపలికి తీసుకెళ్లినా లాయర్లు దాడి చేసి కొట్టారు. కోర్టు లోపలికి వెళ్ళాక కూడా మెజిస్ట్రేటు ముందే కన్హైయాను ఓ లాయర్ కొట్టాడు. పక్కనే పోలీసులు ఉన్నా నిరోధించలేదు. ఆ లాయర్ బైటికి వచ్చి ‘మా పని చేసేశాం’ అని విలేఖరుల…

సమగ్రంగా: హిందూత్వపై జే‌ఎన్‌యూ పోరాటం -1

(జే‌ఎన్‌యూ విద్యార్ధుల తిరుగుబాటుపై ఇటీవలి రోజుల్లో జరిగిన పరిణామాలను జోడిస్తూ చేసిన సమగ్ర విశ్లేషణ ఇది. సాధ్యమైనంత సమగ్రంగా రాసేందుకు ప్రయత్నించాను. అందువల్ల పెద్ద ఆర్టికల్ అయింది. ఇందులో గత ఆర్టికల్స్ లోని కొన్ని అంశాలను కూడా జోడించాను. అందువలన ఇంతకు ముందు చదివిన భావన కొన్ని చోట్ల కలగవచ్చు. -విశేఖర్) ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, తదనంతర విద్యార్థి ఉద్యమం తెరిపిడి పడక ముందే హిందూత్వ పాలకులు జవహర్ లాల్ నెహ్రూ…

పోలీస్ లాకప్ లోనే కొట్టాం! -స్టింగ్ వీడియో

ఇండియా టుడే చానెల్ మరో సంచలనానికి తెర తీసింది. ఢిల్లీ పోలీసులు చేయడానికి ఇష్టపడని పరిశోధనని తాను చేసి చూపెట్టింది. చిన్న గొడవగా లాయర్ల హింసను కొట్టిపారవేస్తూ వారిపై పెట్టీ కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసుల నేరపూరిత కుమ్మక్కును ఎండగడుతూ మరో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పధకం ప్రకారమే విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరులపై లాయర్లు దాడి చేసి కొట్టారని బయట పెట్టింది. ఇండియా టుడేకు చెందిన ఇద్దరు విలేఖరులు విక్రమ్ చౌహాన్, ఓం శర్మ, యశ్…

కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో

కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జే‌ఎన్‌యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బి‌జే‌పి నేతలు, ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన…

ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా

[జీ న్యూస్ విలేఖరి విశ్వ దీపక్ చానెల్ కు రాజీనామా చేస్తూ చానెల్ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖనే ఆయన రాజీనామా లేఖగా వెలువరించారు. లేఖ ఆంగ్ల అనువాదాన్ని ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఇతర పత్రికలు కూడా ప్రచురించి ఉండవచ్చు. విశ్వ దీపక్ రాజీనామా లేఖ అనువాదమే ఈ టపా. ఈ అనువాదాన్ని బ్లాగ్ పాఠకుడు సందీప్ ఎస్‌పి గారు వ్యాఖ్య ద్వారా అందించారు. నవ తెలంగాణ పత్రికలో మొదట అచ్చయిన ఈ…

జాట్ ఉద్యమం: ది హిందు సంపాదకీయంపై విమర్శ

[ఈ టపాకు ముందరి ఆర్టికల్ లో ది హిందూ సంపాదకీయం అనువాదం ఇచ్చాను. సంపాదకీయం చేసిన విశ్లేషణపై విమర్శ కూడా ఇచ్చాను. విమర్శను పాఠకుల దృష్టికి తేవాలంటే ఆ భాగాన్ని ప్రత్యేకంగా ఇవ్వాలని భావిస్తూ మరో టపాగా పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) ********* పటిదార్ లు, జాట్ ల నుండి రిజర్వేషన్ డిమాండ్లు తలెట్టడానికి పై సంపాదకీయం చూపిన కారణం నిజానికి ఇరుకైనది. ఇది పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాతల నుండి తండ్రులకు, తండ్రుల…

వివేకరహిత (రిజర్వేషన్) డిమాండ్లు -ది హిందు ఎడిట్

(Unreasonable demands శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* గత యేడు గుజరాత్ పటిదార్లు గానీ, ఈ యేడు హర్యానా జాట్ లు గానీ… సాపేక్షికంగా సంపన్న కులాల నేతృత్వంలో రిజర్వేషన్ కోసం హింసాత్మక నిరసనల ద్వారా పదే పదే పునరావృతం అవుతున్న డిమాండ్లు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హర్యానాలో జాట్లు సాపేక్షికంగా భూములు కలిగి ఉన్న సంపన్నులు. ఈ ప్రాంతంలో సామాజిక నిచ్చెనపైన అందరికంటే ఎత్తున ఉన్నవారిగా పరిగణించబడుతున్నారు. రాష్ట్రంలో…

చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు

“The Emperor’s new nationalism” శీర్షికతో ఫిబ్రవరి 20 వ తేదీ ది హిందూ సంపాదకీయానికి యధాతధ అనువాదం. ********* హైదారాబాద్ నుండి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకూ, రోహిత్ వేముల మరణం నుండి కన్హైయా కుమార్ అరెస్టు వరకు పాలక భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రాజకీయ ఎజెండాను స్పష్టంగా గుర్తించవచ్చు. మొదటి ఊపులో ఇది అత్యున్నత నాయకత్వం అంతా -యూనియన్ కేబినెట్ మంత్రులతో సహా- విద్యార్ధి నాయకులతో తగువు పెట్టుకోవడానికీ సంఘ్ విద్యార్ధి…

ఫేస్ బుక్ నుండి బలవంతపు అదృశ్యం -కార్టూన్

కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది. ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు…

అఫ్జల్ గురు కార్టూన్ తొలగించిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ ఒక కంపెనీ. లాభార్జనే ఫేస్ బుక్ కంపెనీ ధ్యేయం. కానీ ఒక వ్యాపార కంపెనీయే రాజ్యం అవతారం ఎత్తితే?! అఫ్జల్ గురు కి వేసిన ఉరిశిక్ష సాక్షాలు బలంగా ఉండి నేరం రుజువు కావడం వల్ల కాదు. సాక్షాలు బలంగా లేకపోయినా న్యాయ స్ధానం సాక్షిగా ఉరితీయడం ద్వారా కాశ్మీర్ ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలని భారత రాజ్యం భావించినందుకు! భావాలకు సంకెళ్లు వేయగలరా ఎవరైనా? ‘రాముడు ఆ బాబ్రీ మసీదు కట్టిన చోటనే…

కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…