ప్రైవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి దృఢంగా నిరాకరిస్తున్న ఐస్ లాండ్ ప్రజలు

2008 సం. నాటి ద్రవ్య సంక్షోభంలో కుప్పకూలిన ఐస్ లాండ్ ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి ఐస్ లాండ్ ప్రజలు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన రిఫరెండంలో 93 శాతం ప్రజలు ఐస్ లాండ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించగా ఏప్రిల్ 9, 2011 తేదీన జరిగిన మరో పాక్షిక రెఫరెండంలో సైతం 58 శాతం మంది ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని భరించడానికి తిరస్కరించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న “ఐస్ సేవ్” ఒప్పందం ప్రకారం ఐస్…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

ముదిరిన పోర్చుగల్ అప్పు సంక్షోభం

గత సంవత్సరమ్ గ్రీసు, ఐర్లండులను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం తాజాగా పోర్చుగల్ ను బలి తీసుకుంది. అప్పు కోసం ఇ.యు, ఐం.ఎ.ఎఫ్ లను దేబిరించడానికి వ్యతిరేకిస్తూ పోర్చుగల్ ప్రధాని, పొదుపు చర్యలతో ప్రతిపాదించిన నూతన బడ్జెట్ పార్లమెంటులో ఓడిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మే నెలలో ఎన్నికలు ముగిసే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్న ప్రధాని జోస్ సోక్రటీసు గురువారం అనివార్యంగా ఇ.యు, ఐం.ఎం.ఎఫ్ లు రూపొందించిన బెయిల్-అవుట్ ప్యాకేజీ నుండి సహాయం అర్ధించవలసి వచ్చింది.…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

జపాన్లో మరో పెద్ద భూకంపం, సునామీ హెచ్చరిక జారీ

జపాన్లో మార్చి11 న వచ్చిన తీవ్ర స్ధాయిలో సంభవించిన భూకంపం, దాని వలన వచ్చిన భయానక సునామీ లు కొట్తిన దెబ్బ నుండి జపాన్ ఇంకా తేరుకోలేదు. ఇంత లోనే ప్రకృతి పగ బట్టిందా అన్నట్లు మరో తీవ్ర భూకంపం జపాన్ ను వణికిస్తోంది. మార్చి 11 న భూకంపం సంభవించిన ఈశాన్య జపాన్ ప్రాంతానికి దగ్గరగా సముద్రంలో 7.4 తీవ్రతతో తాజా భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది. జపాన్ ప్రభుత్వం తాజా భూకంపం దరిమిలా…

ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల…

యూరోజోన్ వడ్డీ రేట్లు పెంచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు

ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మొట్టమొదటి సారిగా వడ్డీ రేట్లను పెంచింది. సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూరోజోన్ దేశాల ఆర్ధికవృద్ధి, సంక్షోభ పరిస్ధుతులను అధిగమిస్తున్న విషయాన్ని సూచిస్తోంది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కడానికి ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను అతి తక్కువ స్ధాయిలో ఉంచి తద్వారా మార్కెట్ కు డబ్బు అందుబాటులో ఉంచాయి. మార్కెట్ కు డబ్బు అధికంగా అందుబాటులో…

లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…

టి.ఆర్.ఎస్ ఏం సాధించిందని ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరుపుతోంది?

బుధవారం (ఏప్రిల్ 6) టి.ఆర్.ఎస్ కార్యవర్గం సమావేశమై ఏప్రిల్ 10 నుండి “తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు” నిర్వహించాలని నిర్ణయించిందని ఆ పార్టీ నాయకుడు కే.సి.ఆర్ ప్రకటించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నాటికి టి.ఆర్.ఎస్ పార్టీ స్ధాపించి పది సంవత్సరాలు గడిచిందనీ ఆ సందర్భంగా ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరపాలని నిశ్చయించామని ఆయన సెలవిచ్చారు. పార్టీ పెట్టి పది సంవత్సారాలు అయ్యింది గనక టి.ఆర్.ఎస్ దశాబ్ది ఉత్సావాలు జరపడంలొ అభ్యంతరం లేదు. కానీ “ఉద్యమ దశాబ్ది…

రేడియేషన్ నీటి లీకేజి పూడ్చిన జపాన్ ఇంజనీర్లు

జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో రెండో రియాక్టరుకు ఏర్పడిన పగులును పూడ్చామని టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) ఇంజనీర్లు తెలిపారు. “లీకేజిని అరికట్టామని చెబుతున్నా దానిని పరీక్షించాల్సి ఉంది. ఇంకా లీకేజీలేమన్నా ఉన్నాయేమో చూడాల్సి ఉంది” అని జపాజ్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ యుకియో ఎడానో పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. సోడియం సిలికేటుతో పాటు మరో రసాయన ఏజెంటును ఉపయోగించి లీకేజిని పూడ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు. 15 సెం. మీ మేర ఏర్పడిన…

ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం

మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన…

గడ్డాఫీపై అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదు -ఉక్రెయిన్ నర్సు

గడ్డాఫీ తనకు సేవచేసిన ఐదుగురు ఉక్రెయిన్ నర్సులలో ఒకరితో ప్రత్యేక సంబంధం ఉందంటూ లిబియాలోని అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదని ఐదుగురిలో ఒకరైన “ఒక్సానా బాలిన్స్కాయా” రష్యా పత్రికకు తెలిపింది. గడ్డాఫీ ఆనారోగ్యంతో ఉండగా ఉక్రెయిన్ కి చెందిన అయిదుగురు నర్సులు నర్సింగ్ సేవలు అందించారు. వారిలో ఒకరైన “గాలినా కొలోట్నిట్స్కా” తో గడ్డాఫీకి ప్రత్యేక సంబంధం ఉందనీ, ఆమే లేకుండా గడ్డాఫీ ఒక్క క్షణం కూడా ఉండలేడనీ 68 సంవత్సరాల వయసుగల గడ్డాఫీ గురించి…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి మరిన్ని దేశాల గుర్తింపు, మొదలైన ఆయిల్ ఎగుమతులు

లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై…