యూరోజోన్ లోనూ దౌడు తీస్తున్న ద్రవ్యోల్బణం

17 యూరప్ దేశాల యూరోజోన్ లో ద్రవ్యోల్బణం మార్చి నెలకంటే మరికాస్త పెరిగింది. యూరోస్టాట్ అధికారిక అంచనా ప్రకారం యూరోజోన్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.7 శాతం నమోదు కాగా, అది ఏప్రిల్ నాటికి 2.8 శాతానికి పెరిగింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్ పెరుగుదల స్వల్పంగా కనిపించినా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) విధించుకున్న పరిమితితో పోలిస్తే ఎక్కువే. ఇసిబి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 2 శాతానికి మించితే సమస్యలు తప్పవు. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి ఈ…

అంతర్జాతీయ ఒత్తిడితో దారుణ నరకంనుండి బైటపడ్డ అమెరికా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”

ప్రపంచ దేశాలపై తన ప్రయోజనాల కోసం బాసిజం చేసే అమెరికా, బహుశా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఒత్తిడికి, విమర్శలకు లొంగింది. దాదాపు తొమ్మిది నెలల నుండి సొంత దేశీయుడినే నరక బాధలు పెడుతున్న జైలు అధికారులు విచారణా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”ని సాలిటరీ కనఫైన్‌మెంట్ సెల్ నుండి బైటకు అనుమతించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, యాభై సంవత్సరాల డిప్లొమాటిక్ కేబుల్స్ ను లీక్ చేశాడన్న ఆరోపణలపై బ్రాడ్లీ…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

ఇండియాకు టైఫూన్, రాఫేల్ లలో ఏ ఫైటర్ జెట్ విమానం మంచిది?

ఇండియా చాలా కాలంగా ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను కొనడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, ఫ్రాన్సు, స్వీడన్ లతో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల ఉమ్మడి కంపెనీ లు తమ ఫైటర్ జెట్ లే కొనమని పోటీ పడుతూ వచ్చాయి. గురువారం భారత ప్రభుత్వ మిలట్రీ అమెరికా, స్వీడన్ లను తన జాబితానుండు తొలగించింది. ఇప్పుడు రెండు ఫైటర్ జెట్లు పోటీ పడుతున్నాయి. ఒకటి నాలుగుదేశాల ఉమ్మడి కంపెనీ యూరో ఫైటర్ తయారు చేసే “టైఫూన్”…

అమెరికా జెట్‌ఫైటర్ల కొనుగోలుకు ఇండియా తిరస్కరణ, స్నేహం దెబ్బతినే అవకాశం

అమెరికా, యూరప్ దేశాల మధ్య జరిగిన పోటీలో ఎట్టకేలకు అమెరికా ఓడిపోయింది. అమెరికాకి కాంట్రాక్టు ఇవ్వడానికి నిరాకరించడంతో అమెరికాతో ఇండియా సంబంధాలు దెబ్బతినే అవకాశాం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 11 బిలియన్ డాలర్ల (రు.51,000 కోట్లు) విలువతో ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ఒకటిన్నర సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్నది. గత నవంబరు నెలలో ఒబామా ఇండియా సందర్శించినప్పుడు కూడా ఈ కాంట్రాక్టుపై చర్చలు జరిగాయి. ఒబామా సందర్శించినప్పుడు ఇండియా ఏమీ తేల్చి చెప్పలేదు. కాని అమెరికాకి చెందిన…

సిరియా కాల్పులపై భద్రతాసమితి తీర్మానాన్ని వ్యతిరేస్తున్న ఇండియా, చైనా, రష్యాలు

నాలుగు రోజులనుండి సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండించడానికి భద్రతా సమితిలొ జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నదనీ, వారితో చర్చలు జరిపేవిధంగా సిరియాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ దేశాలు ఎంతకైనా తెగిస్తాయన్న విషయం లిబియా అనుభవం ద్వారా స్పష్టం కావడంతో సిరియాపై తీర్మానాన్ని ఇండియా, చైనా, రష్యా ప్రభుత్వాలు గట్టిగా…

ఇరాక్ ప్రభుత్వ హత్యాకాండకు స్పందించని అమెరికా, యూరప్‌లు

ఇరాక్‌లోని అష్రాఫ్ క్యాంపులో నివసిస్తున్న పౌరులపై ఏప్రిల్ 8 తేదీన ఇరాక్ ప్రభుత్వ సైనికులు విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 34 మంది మరణించారు. ఆ తర్వాత విడుదలైన వీడియో ద్వారా ఇరాస్ సైన్యం ఉద్దేశ్యపూర్వకంగానే క్యాంపుపై దాడి చేసి కాల్పులు జరిపిందని స్పష్టమయ్యింది. సైనికులు తాపీగా పౌరులపై కాల్పులు జరపడం, తమ వాహనాలను వారిమీదుగా నడపడం వంటివన్నీ చూసిన వారికి అక్కడ ఉన్నవారిని చంపడానికే సైనికులు కాల్పులు జరిపారని స్పష్టమవుతుంది. ఈ ఘటన పట్ల…

క్రికెట్ ఇండియా కొత్త కోచ్ “డంకన్ ఫ్లెచర్”

మూడు సంవత్సరాల పాటు ఇండియా క్రికెట్ టీం కి కోచింగ్ బాధ్యతలు నిర్వహించీన్ గ్యారీ కిర్‌స్టెన్ తన కాంట్రాక్టు పొడిగించడానికి నిరాకరించడంతో బిసిసీఐ కొత్త కోచ్ ని నియమించింది. గతంలో జింబాబ్వే క్రికెట్ టీంకి కెప్టెన్ గానూ, ఇంగ్లండ్ కు కోచ్ గానూ పని చేసిన డంకన్ ఫ్లెచర్ ను కొత్త కోచ్ గా నియమిస్తున్నట్లు బిసిసీఐ బుధవారం ప్రకటించింది. 2005లో ఇంగ్లండు టీంకి కోచ్ గా ఉండగా ఇంగ్లండు యాషెస్ సిరీస్ గెలుచుకుంది. ఫ్లెచర్ రెండేళ్ళ…

చైనాలో ప్రైవేటురంగ ఆధిపత్యం ఒక మిధ్య

చైనా ఆర్ధిక వ్యవస్ధలో ఏ రంగ ఆధిపత్యం వహిస్తోంది? ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? గత 35 సంవత్సరాలనుండి చైనా సంస్కరణలను అమలు చేస్తున్నది గనక అక్కడ ప్రవేటు రంగానిదే ఆధిపత్యం అని అందరూ భావిస్తున్నారు. కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చైనా ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నమాట వాస్తవమె. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా పునరుద్ధరింపబడిన వార్తా వాస్తవమే. కానీ చైనాలో ఇంకా ప్రభుత్వ రంగ పెట్టుబడీదారీ విధానమే ఆధిపత్యంలో ఉందన్న విషయం చాలా…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…

ఆసియా దేశాల ఆర్ధికాభివృద్ధికి ఆహారధరలు ఆటంకం -ఏడిబి

ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం…

ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

లిబియాలో స్పెయిన్ విలేఖరి అరెస్ట్, అరెస్టైనవారంతా క్షేమం

ఏప్రిల్ 5 తేదీన కనపడకుండా పోయిన స్పెయిన్‌కి చెందిన ఫోటో జర్నలిస్టు ఆదివారం స్పెయిన్‌లో తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు. బ్రెగా పట్టణం శివార్లలో ఉన్న మను బ్రాబో ఇతర విలేఖరులతో పాటు అరెస్టు అయ్యాడు. సరైన అనుమతి లేకుండా లిబియాలోకి ప్రవేశించడంతో వారిని లిబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. మను తండ్రి మాన్యువల్ వరెలా, తన కొడుకు బ్రాబోను మిలట్రీ జైలులో ఉంచారనీ, జైలులో తనను బాగా చూసుకుంటున్నట్లు చెప్పాడని…