కాళ్ళ బేరం: టెర్రరిస్టుల తరపున ఐరాస?

బహుశా దీనిని ఎవరూ ఊహించి ఉండరేమో! సిరియాలో ప్రభుత్వానికి, సిరియా ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న జబ్బత్ ఆల్-నూస్రా టెర్రరిస్టులు క్షేమంగా అలెప్పో వదిలి వెళ్లనివ్వాలని ఐరాస ప్రతినిధి స్టాఫన్ డి మిస్తురా కోరుతున్నాడు. సిరియా వ్యవహారాలు చూసేందుకు మిస్తురా ని ఐరాస నియమించింది. నిస్పాక్షికంగా ఉంటూ శక్తివంతమైన రాజ్యాల నుండి బలహీన రాజ్యాలను కాపాడేందుకు ప్రయత్నించవలసిన ఐక్య రాజ్య సమితి ఆచరణలో అమెరికా, పశ్చిమ రాజ్యాల భౌగోళిక రాజకీయాలకు పని ముట్టుగా మారింది. సిరియా కిరాయి…

పౌండ్: సెకన్లలో 10% పతనం

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు  ఒక్కసారిగా కలవర పడ్డాయి.  శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378…

స్పెక్ట్రమ్ వేలం: లాభం 65 వేల కోట్లు, తప్పిన అంచనాలు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా…

భారత చానెళ్ల ప్రసారాలపై పాక్ నిషేధం

మన పత్రికలు చెప్పవు గానీ మన పాలకులు ఇక్కడ ఎంత చేస్తున్నారో, పాక్ పాలకులు అక్కడ అంతా చేస్తున్నారు. మన వాళ్ళు హిస్టీరియా రెచ్చగొడుతున్నట్లే వాళ్ళూ రెచ్చగొడుతున్నారు. మన వాళ్ళు గుండెలు బాదుకుంటున్నట్లే వాళ్ళూ బాదుకుంటున్నారు. మన వాళ్ళు విదేశాల్ని దేబిరిస్తున్నట్లే వాళ్ళూ దేబిరిస్తున్నారు. ఇక్కడ పాక్ అన్న వాసన పైనే ఆంక్షలు విధిస్తున్నట్లే అక్కడ ఇండియా అన్న వాస్తన పైన ఆంక్షలు విధిస్తున్నారు. పాకిస్తాన్ మీడియా నియంత్రణ సంస్ధ తాజాగా తన నియంత్రణ సూత్రాల దుమ్ము…

కావేరీ ప్రవాహంపై అలజడి -ద హిందూ..

కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -CWDT), కావేరీ నిర్వాహక బోర్డు (కావేరీ మేనేజ్మెంట్ బోర్డు -సి‌ఎం‌బి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు అది చాలా మంచి కారణాలతోనే అలా చేసింది. ఋతుపవనాల లోటు సంవత్సరాలలో వివిధ ఉప-బేసిన్ లలోని నీటి ప్రవాహాల నమూనా, సాధారణ సంవత్సరాలలోని ప్రవాహాల ఆధారంగా రూపొందించిన నీటి విడుదల సూచి (షెడ్యూలు) తో సరిపోలదు. కావేరీ బేసిన్ లోని నిల్వల స్ధాయి, వర్షాల ధోరణిలను పర్యవేక్షిస్తూ…

దళారి పాలకుల గుట్టు విప్పిన పాక్ రాయబారి

  Pakistan envoy has spilled the beans!  రహస్యాన్ని పాకిస్తాన్ అనుకోకుండా వెళ్ళగక్కింది. ఏమరుపాటున ఉన్నాడో, కావాలనే అన్నాడో తెలియదు గాని పాకిస్తాన్ ప్రధాని ప్రత్యేక కాశ్మిర్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయీద్ అమెరికా – vis-a-vis దళారీ పాలకుల రహస్యాన్ని వెళ్ళగక్కాడు.  అంతే కాదు, అమెరికా సామ్రాజ్యవాదానికి మూడో ప్రపంచ దేశాల పాలక వర్గాలకు మధ్య ఉన్న యజమాని-దళారి సంబంధాన్ని కూడా పాక్ రాయబారి ప్రపంచానికి తెలియజేశాడు.  “అమెరికా ఇక ఎంత మాత్రం ప్రపంచ…

అమ్మకానికి ట్విట్టర్!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
150 అక్షరాల మైక్రో బ్లాగింగ్ సామాజిక వెబ్ సైట్ అయిన ట్విట్టర్ అమ్మకానికి వచ్చింది. కంపెనీని అమ్మకానికి పెట్టిన వ్యవస్ధాపకులు తమ బేరం అమ్మకం రూపం ధరించేది లేనిది చెప్పకున్నప్పటికీ ఇంటర్నెట్ బడా కంపెనీలు ట్విట్టర్ కోసం బిడ్ లు దాఖలు చేస్తున్నాయి.  ట్విట్టర్ కొనుగోలుకు గూగుల్ కూడా రంగం లోకి దిగిందని ఆరంభంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ వార్తలు వెనక్కి వెళ్లాయి. ట్విట్టర్ యజమానుల అనిర్దిష్ఠ ధోరణి గూగుల్…

ప్రశ్న: మన డేటా అమ్ముకుంటే నష్టం ఏమిటి?

లోకేశ్వర్: “వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా) సమాధానం:  ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను. మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్…

జపాన్ తో అణు ఒప్పందం -ద హిందూ..

  పౌర అణు సహకారం నిమిత్తం ఇండియా 11 దేశాలతో -అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాలతో సహా- ఒప్పందాలు చేసుకుంది. కానీ త్వరలో జపాన్ తో జరగనున్న ఒప్పందం పరిగణించదగినది. అణు దాడికి గురయిన ఏకైక దేశం జపాన్; కనుక అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం (NPT ) పైన సంతకం చేయని ఇండియాతో అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఆ దేశం నిర్ణయించడం తనకు మొదటిది అవుతుంది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్…

RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి.  అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు.  తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన…

సర్జికల్ స్ట్రైక్స్: సరిహద్దు గ్రామాల్ని ఎందుకు ఖాళి చేస్తున్నట్లు?

  నరేంద్ర మోడీ ప్రభుత్వం తాము పాక్ భూభాగం మీదికి చొచ్చుకుని వెళ్లి ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించామని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పామని ఆర్భాటంగా ప్రకటించారు. “సరిహద్దులో అలాంటి ఘటన ఏది జరగలేదు. ఎప్పటి లాగా క్రాస్ బోర్డర్ ఫైరింగ్’ జరిగింది, అంతే. అంతకు మించి ఏమి జరగలేదు” అని పాక్ ప్రధాని ప్రకటించారు.  ఒక్క పాక్ ప్రధాని మాత్రమే కాదు. అంతర్జాతీయ మీడియా కూడా “అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా, లేదా?”  అంటూ అనుమానాలు…

రష్యన్ ఎంబసీపై దాడి, మాట నిలబెట్టుకున్న అమెరికా?

  అమెరికా తన మాట నిలబెట్టుకుంది. “మీ ఇళ్లకు మీ వాళ్ళ శవాలు వెళ్తాయి” అని అమెరికా విదేశాంగ శాఖ చేసిన హెచ్చరిక ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.  సిరియా రాజధాని డమాస్కస్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పైన సోమవారం ఆల్-నుస్రా టెర్రరిస్టులు దాడి చేశారు. దాడిలో రష్యన్ ఎంబసీ సిబ్బంది ఎవరు గాయపడలేదని రష్యా తెలిపింది. ఎంబసీ భవనం మాత్రం దెబ్బ తిన్నదని చెప్పింది.  “అక్టోబర్ 3 తేదీన రష్యన్ రాయబార కార్యాలయం మోర్టార్…

31 ఏళ్ళ స్ధాయికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
బ్రెగ్జిట్ విషయమై సోమవారం నాడు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం చూపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ కు స్పష్టమైన టైం టేబుల్ ను ఆమె ప్రకటించడంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 31 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో బ్రిటిష్ ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో బ్రిటిష్ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచి FTSE 16 నెలల గరిష్ట స్ధాయికి పెరిగింది.  అధికార కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని…

థర్డ్ వరల్డ్ వార్? -అమెరికా, రష్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

  సిరియా అంతర్యుద్ధం విషయమై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తత క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఇరు దేశాలు తెర వెనుక  పరస్పరం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. అగ్ర దేశాలు రెండు ఏ క్షణంలో ఏ చర్యకు పాల్పడతాయో అన్న ఆందోళనను పరిశీలకులకు కలిగిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికాయే విఫలం చేసిన నేపథ్యంలో చర్చలకు, శాంతికి ఇంకా అవకాశం మిగిలే ఉన్నదని రష్యా ప్రకటిస్తుండగా అమెరికా మాత్రం వరుస ప్రతీకార చర్యలు ప్రకటిస్తున్నది. దానితో రష్యా సైతం…

బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని

బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు. బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈ‌యూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న…