అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

మరింత క్షీణించిన భారత మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి

ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి జూన్ నెలలో కూడా క్షీణించడం కొనసాగింది. జూన్ నెలలో మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తొమ్మిద నెలల కనిష్టస్ధాయిలో నమోదైందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుండడం వలన అప్పు సేకరణ ఖరీదు పెరగడంతో దాని ప్రభావం మాన్యుఫాక్చరింగ్ రంగంపై పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నిర్వహించే పి.ఎమ్.ఐ సూచిక (Purchasing Managers’ Index) ప్రకారం మే నెలలో పి.ఎమ్.ఐ సూచి 57.5 నమోదు చేయగా జూన్ నెలలో అది…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసిన ఫ్రాన్సు, రష్యా నిరసన

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడిచినట్లుగా ఫ్రాన్సు సైన్యాధికారులు తెలిపారు. బెర్బెర్ తెగల ఫైటర్లకు లిబియా రాజధాని ట్రిపోలికి నైరుతి మూల ఉన్న కొండల్లో ఆయుధాలను జారవిడిచినట్లు ఫ్రాన్సు మిలట్రీ తెలిపింది. ఏప్రిల్ చివరినుండి జూన్ ప్రారంభంవరకూ తిరుగుబాటుదారులకు ఈ విధంగా ఆయుధాలను అందించామని వారు తెలిపారు. ఐతే ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం లిబియా యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకు ఆయుధాలు అందించడాన్ని నిషేధించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల అధికారులే స్వయంగా లిబియాలోని ఇరు…

ఇండియా పశుదాణా ఎగుమతుల్లో ప్రమాదకరమైన రసాయనం -చైనా హెచ్చరిక

ఇండియా నుండి ఎగుమతి అవుతున్న పశువుల దాణాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చైనా క్వాలిటీ విభాగం హెచ్చరించింది. చైనా ఆరోపణలను అధ్యయనం చేస్తున్నట్లు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ బి.వి మెహతా చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రమాదకరమైన రసాయనం “మాలఖైట్ గ్రీన్” భారతదేశం నుండి దిగుమతి అయిన ‘రేప్ గింజల గానుగ పిండి’ (rapeseed meal – రేప్ గింజల నుండి నూనె తీయగా మిగిలే పిప్పి) లో కనుగొన్నామని…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

వన్‌డే, టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇండియా పర్యటించనున్న పాకిస్ధాన్

ముంబై టెర్రరిస్టు దాడులతో ఇండియా, పాకిస్ధాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలను కూడా ఇండియా తెంచుకున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడిన దాయాదులు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రక్రియను క్రికెట్ దౌత్యంతో ప్రారంభించారు. ఇండియా ప్రధాని, ఇండియా, పాక్‌ల సెమీఫైనల్ మ్యాచ్ తిలకించడానికి పాక్ ప్రధానిని ఆహ్వానించగా ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించి సంబంధాల మెరుగుదలకు తాము సిద్ధమని తెలిపాయి. జూన్ నెలలో…

ప్రజాందోళనల నడుమ కోతలు, రద్దుల బిల్లుని ఆమోదించిన గ్రీసు పార్లమెంటు

గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన…

ఇంధన ద్రవ్యోల్బణం పైపైకి, మళ్ళీ రెండంకెలకు చేరనున్న ప్రధాన ద్రవ్యోల్బణం?

డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది. జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి…

రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు

రెండు యుద్ధాలు అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్‌ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు. మూడు ఫోటోలు

అమెరికా యుద్ధాల ఖర్చు $3.7 ట్రిలియన్, చావులు 2.25 లక్షలు

అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని ఒబామా బలగాల ఉపసంహరణ ప్రకటిస్తూ అన్నాడు. బలగాల ఉపసంహరణకు ఈ ఖర్చు కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు. కాని ఒబామా చెప్పిన లెక్క పూర్తిగా తప్పు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ‘వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ అమెరికా సాగిస్తున్న యుద్ధ ఖర్చులపై అధ్యయనం చేసింది. 2001 నుండి అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, పాకిస్ధాన్ లలో సాగించిన యుద్ధాలకు ఖర్చయిన సొమ్ము, అన్ని…

ఆయిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయాల్సిందే -అహ్లూవాలియా

ధనిక స్కూళ్ళలో చదివి, ఆక్స్‌ఫర్డ్ లోనో, హార్వర్డ్ లోనో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఐ.ఎం.ఎఫ్ లాంటి ప్రపంచ వడ్డీ వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం చేసినవాళ్ళని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఏమవుతుంది? “నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే, ఒరే” అని ఓ కవి పాడినట్లుగానే అవుతుంది. భారత దేశ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పరిస్ధితి కూడా అలాంటిదే. “ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు ఆ భారం ప్రజలమీద మోపడానికి…

ఇంటర్నెట్‌ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్

తమది గొప్ప ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశాలే ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని కోరిన వాటిలో ముందుంటున్నాయి. గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం అమెరికా, బ్రెజిల్ ల తర్వాత ఎక్కువసార్లు వినియోగదారులపై నిఘా పెట్టమనిగానీ, వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వమని గానీ భారత ప్రభుత్వమే ఎక్కువ సార్లు కోరింది. గత సంవత్సరం (2010) జులై నుండి డిసెంబరు లోపు భారత ప్రబుత్వం 1699 సార్లు యూజర్ ఎకౌంట్ల సమాచారాన్ని కోరిందని గూగుల్ తెలిపింది. గూగుల్‌ని వినియోగదారుల సమాచారాన్ని…

$15 బిలియన్ల వ్యాపార ఒప్పందాలకు చైనా, జర్మనీల అంగీకారం

యూరప్ పర్యటనలో ఉన్న చైనా ప్రధాని వెన్ జియాబావో, ఇంగ్లండులో మూడు రోజులు పర్యటించిన అనంతరం బుధవారం జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీ పర్యటనలో 15 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేసారని బిబిసి తెలిపింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని వెన్ లు వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక వ్యాపారం రానున్న 5 సంవత్సరాల్లో 200 బిలియన్ యూరోల (284 బిలియన్…

జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్

అంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్‌” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్‌స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…