రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు,…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…

అజారుద్దీన్ కొడుకుని చంపిన రేస్ బైక్ ఇదే

అజారుద్దీన్‌కు మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఆయాజుద్దీన్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివార్లలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డుపైన రేస్ బైక్ ను వేగంగా నడుపుతూ చక్రం జారిపోవడంతో ఆయాజుద్దీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెనక సీట్లో కూర్చున్న అతని బంధువు అక్కడే మృతి చెందగా ఆయాజుద్ధీన్ ఆసుపత్రిలో కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈ ఘటన పట్ల చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. కొడుకు…

“నెగిటివ్ సందేశాలు పంపొద్దు” అమెరికాని కోరిన పాక్ ప్రధాని

అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు. “ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో…

పాక్‌కు అన్ని సాయాలు బంద్, అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

పాకిస్ధాన్‌కు అన్ని సహాయాలు బంద్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. టెక్సాస్ నుండి ఎన్నికైన సభ్యుడొకరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన అమెరికా ప్రతినిధుల సభలో కీలక సభ్యుడని డెయిలీ భాస్కర్ పత్రిక పేర్కొంది. ఈ తీర్మానం కాంగ్రెస్ లో ఆమోదం పొందినట్లయితే అమెరికా, పాకిస్ధాన్ కు అందజేస్తున్న అన్ని సహాయాలు స్తంభించిపోతాయి. పాకిస్ధాన్ అణ్వస్త్రాలను భద్రపరచడానికి అందిస్తున్న సహాయాన్ని దీన్నుండి మినహాయించాడు. కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో, తాను ప్రవేశపెట్టిన…

దరిద్రులకోసం పైసల్లేని అమెరికా సర్కార్ -కార్టూన్

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాల కోసం ఏడు ట్రిలియన్ డాలర్లు, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన బడా బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్లు ఇవ్వడం కోసం 14 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిన అమెరికా ప్రభుత్వం, దరిద్రులకు విదిలించడానికి నాణేల కోసం వెతుక్కుంటోంది. – కార్టూన్: హెంగ్, సింగపూర్ —

సి.ఐ.ఎ కి ఇష్టమైన నీలి కళ్ల బాలుడే హక్కానీ నెట్ వర్క్ -పాక్ మంత్రి హీనా రబ్బానీ

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది. రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు…

ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న…

రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం

2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి. అయితే…

పాలస్తీనా రాజ్య ప్రకటనకు ఇజ్రాయెల్ ఆటంకం -కార్టూన్

అరవై ఏళ్ళనుండి ఇజ్రాయెల్ రాజ్య జాత్యహంకార ప్రభుత్వం కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజలు విముక్తి పొందకుండా అమెరికా, యూరప్ లు కాపలా కాస్తూ వచ్చాయి. జాత్యహంకార పదఘట్టనల కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజల తరపున ఇజ్రాయెల్, అమెరికాలతో కుమ్మకయిన వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా దేశం ఏర్పాటును ఏక పక్షంగా సమితి సమావేశాల్లో ప్రకటిస్తానని కొన్ని నెలలుగా చెబుతూ వచ్చాడు. సేవకుడు ఎంత సేవ చేసినా యజమానులకు తృప్తి దొరకదు. అబ్బాస్ ఎన్నిమార్లు ఇజ్రాయెల్…

హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని…

అప్రజాస్వామిక బ్లాగర్ల ప్రజాస్వామిక చింతన

(గమనిక: “భాష, ప్రజాస్వామ్యం, సోషలిజం – పరస్పర సంబంధాలు” వ్యాసంలో ఒక భాగం ఇది.) ప్రజాస్వామ్య భావజాలం ప్రజలందరినీ సమానులుగా చూస్తుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా అన్ని రకాల ప్రజల విశ్వాసాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుతుంది. ప్రజాస్వమిక హక్కులు ప్రజలందరికి సమానంగా వర్తింపజేయాలని భావిస్తుంది. పౌరుల మధ్య ఉన్న వివిధ వ్యత్యాసాలను, అంతరాలను తిరస్కరిస్తుంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రజాస్వామ్యం గుర్తిస్తుంది. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని…

టైగర్ పటౌడి అంతిమ యాత్ర -కొన్ని ఫొటోలు

విదేశీ గడ్డపై మొదటిసారిగా భారత దేశానికి విజయాన్ని అందించిన మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ టైగర్ పటౌడి అంతిమ యాత్ర పూర్తయింది. ప్రధాని దగ్గర్నుండి మాజీ క్రికెట్ ప్లేయర్ల వరకూ అందరూ టైగర్ భౌతిక దేహం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పటౌడి అంతిమ యాత్రకు సంబంధించి కొన్ని ఫొటోలను ఫస్ట్ పోస్ట్ మేగజైన్ అందించింది. అవి ఇక్కడ:

అతి చేస్తే ఫ్రెండ్‌షిప్ ఉండదు, జాగ్రత్త! అమెరికాకి పాక్ హెచ్చరిక

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని అమెరికాని ఘాటుగా హెచ్చరించింది. పదే పదే పాకిస్ధాన్ పైన టెర్రరిస్టులతో సంబంధాలున్నాయనీ, పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ ఇటీవల అమెరికా ఎంబసీపై దాడికి సాయం చేసిందనీ అమెరికా ఆరోపణలు చేస్తుండడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. టెర్రరిజంపై యుద్ధంలో పాకిస్ధాన్ డబుల్ గేమ్ ఆడుతోందని పదే పదే ఆరోపణలు చేసినట్లయితే ఒక మిత్రుడిని అమెరికా కోల్పోవలసి ఉంటుందనీ పాక్ విదేశాంగ మంత్రి హైనా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో…