సుప్రీం ప్రక్షాళన: బి‌సి‌సి‌ఐ అధ్యక్షుని డిస్మిస్!

సుప్రీం కోర్టు పుణ్యాన భారత క్రికెట్ 2017 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అవినీతి రాజకీయ నాయకులకు, ఆశ్రిత పక్షపాతానికి, వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన బి‌సి‌సి‌ఐ అధ్యక్షుడు కార్యదర్శి పదవుల నుండి అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లను తొలగించింది. వారి స్ధానాలను భర్తీ చేసేందుకు క్రికెట్ ఆటతో సంబంధం ఉన్న నిష్కళంక దక్షులను వెతకాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులతో ద్వి సభ్య కమిటీ నియమించింది. అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ…

నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు. కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని…

మంచి కోసం బలహీనుల బలిదానం తప్పదు!

రచన: డా. రమణ యడవల్లి (ఫేస్ బుక్ నుండి) ********* “ఏవిఁటీ! దేశప్రజలందరికీ ఒక్కరోజులో ఈత నేర్పేశారా! యెలా సాధ్యం?” “సింపుల్! రాత్రికిరాత్రే ఒక్కసారిగా ప్రజల్ని నీళ్ళల్లోకి తోసేశాం.” “వామ్మో!” “సరీగ్గా వాళ్ళూ ఇలాగే ఆర్తనాదాలు చేశారు.” “తర్వాత?” “వారిలో కొందరు ప్రాణభయంతో కాళ్ళూచేతుల్ని తపతపలాడిస్తూ ఈత నేర్చేసుకున్నారు.” “మిగిలివాళ్ళు?” “వాళ్ళు సోమరులు, నీళ్ళల్లో మునిగి చచ్చారు.” “ఈత నేర్పే పద్ధతి ఇది కాదేమో!” “ప్రజలకి మంచి చెయ్యాలనే మా స్పూర్తిని నువ్వు అభినందించాలి!” “కానీ బలహీనులు…

సిరియాలో శాంతికి ఒక అవకాశం -ద హిందూ..

(True transalation of The Hindu editorial “A Chance For Peace in Syria”, published on December 21, 2016.) ********* సిరియా సంక్షోభానికి దౌత్య పరిష్కారం కనుగొనటానికి రష్యా, టర్కీ, ఇరాన్ లు ఒక చోటికి చేరడం ఆహ్వానించదగిన పరిణామం. టర్కీలో రష్యా రాయబారి అందరి కార్లొవ్ హత్యకు గురయినప్పటికీ మాస్కోలో మంగళవారం జరగనున్న శిఖరాగ్ర సభను కొనసాగించడానికే నిర్ణయించడం బట్టి తాము అనుకున్న పంధాలో ముందుకు వెళ్ళడానికే తాము నిబద్ధులమై ఉన్నామని…

రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ‘ఆహా… ఒహో…’ అన్న వారంతా ఇప్పుడు వెనక్కి మళ్లుతున్నారు. U టర్న్ తీసుకుంటున్నారు. “బ్లాక్ మనీపై పోరాటం మంచిదే” అని నితీశ్ కుమార్ అప్పుడు తొందరపడి ఆమోదించేశారు. ఇప్పుడు “డిసెంబర్ 30 వరకూ చూసి, పరిస్ధితి సమీక్షించి నా అవగాహన చెబుతాను” అంటున్నారు. “నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ అమలు తీరు బాగోలేదు” అని సి‌పి‌ఐ నేతలు నీళ్ళు నమిలారు. ఇప్పుడు “పేదలకు, కార్మికుల జీవితాలు నాశనం చేశారు” అంటున్నారు. “ఇది చేయమని ఎప్పటి…

అవున్నిజం, మోడి గంగ అంత నిర్మలుడు!

భూకంపం పుట్టిస్తానన్న రాహుల్ గాంధీ అన్నంత పని చేయలేకపోయారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో బహిరంగ సభ జరిపి ఆయన పాల్పడిన వ్యక్తిగత అవినీతి గురించి చెప్పడం ద్వారా ఎన్నడో చేయాల్సిన పనిని కనీసం ఇప్పుడన్నా చేశారు. గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రధాన మంత్రి సొంత జిల్లా మెహసానాలో ఆయన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి, ముఖ్య మంత్రిగా…

టర్కీలో రష్యా రాయబారి హత్య -ఫోటోలు

సిరియాను దురాక్రమించిన టెర్రరిస్టులపై పోరాటంలో సిరియా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు రష్యా దుష్ఫలితాల్ని అనుభవిస్తోంది. సిరియా కిరాయి తిరుగుబాటులో సొంత సైనిక అధికారులను, కొద్ది మంది సైనిక సలహాదారులను కోల్పోయిన రష్యా మొదటిసారి ఒక సివిల్ అధికారిని కోల్పోయింది.  టర్కీలో రష్యా రాయబారిగా పని చేస్తున్న ఆండ్రీ కార్లోవ్ సోమవారం టర్కీ రాజధాని అంకారా లో హత్యకు గురయ్యారు. అంకారాలో ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాక ప్రసంగిస్తున్న కార్లోవ్ పైన దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరిపాడు. నిందితుడిని 22…

ఇంకో తుఘ్లక్ రూల్, డిసెంబర్ 30 లోపు ఒకే డిపాజిట్

భారత జనం పైన మరో తుఘ్లక్ నిబంధన వచ్చిపడింది. ఈసారి ఆర్‌బి‌ఐ చేత అధికారికంగా ఈ రూల్ ని జారీ చేయించారు. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 30 లోపు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఒక్కసారే ఉంటుంది. డిపాజిట్ చేసే సొమ్ము రు 5,000 గానీ అంతకు లోపు గానీ ఉంటే బ్యాంకు వాళ్ళు నిన్ను ఏమీ అనరు. 5,000 కు పైన ఉంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతటితో అయిపోలేదు.…

నోట్ల రద్దు: అడుక్కుంటున్న విదేశీ టూరిస్టులు -వీడియో

విదేశీ టూరిస్టులకు డీమానిటైజేషన్ శరాఘాతం అయింది. ముఖ్యంగా నోట్ల రద్దు ప్రకటించిన రోజుకు అటూ ఇటూ రోజుల్లో ఇండియాలో చారిత్రక స్ధలాలు చూద్దామని వచ్చిన టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో ఉన్న 500, 1000 నోట్లు చిత్తు కాగితాలు అయ్యాయి. బ్యాంకులో మార్చుకోవడానికేమో వారి వద్ద ఆధార్ లాంటి భారతీయ గుర్తింపు కార్డులు లేవు. ఉన్న చిల్లర డబ్బులతో (100, 50, 10 మొ.నవి) జరిగినంత కాలం గడిపారు. ఇక జరగడం ఆగిపోయాక ఎటూ పాలుపోక…

డీమానిటైజేషన్ & రీమానిటైజేషన్ -కార్టూన్

రీమానిటైజేషన్ (ఆర్ధిక వ్యవస్ధ లోకి కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ) కు అట్టే సమయం పట్టబోదని నిన్న (లేకపోతే మొన్న) ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చేశారు. ఎప్పటిలాగానే ఆయన హామీలో వివరాలు ఏవీ లేవు. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ “70 రోజుల వరకూ ఆగాలి” అని స్వయంగా చెప్పాడు. అంతకు ముందు రోజు (డిసెంబర్ 13 న) ఇంకా 15 రోజులు ఆగాలి అని చెప్పి…

అలెప్పోలో ఆల్-ఖైదాకు సాయం చేస్తున్న అమెరికా మిలట్రీ పట్టివేత

గత ఆరేళ్లుగా సిరియా ప్రభుత్వం చెబుతున్నదే నిజం అయింది. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నది సిరియన్లు కాదనీ, సౌదీ అరేబియా, కతార్, టర్కీలు ఇతర ముస్లిం దేశాల నుండి సమీకరించిన టెర్రరిస్టులను తమ దేశంలోకి ప్రవేశపెట్టి కృత్రిమ తిరుగుబాటు సృష్టించాయని వారికి అమెరికాతో సహా వివిధ పశ్చిమ దేశాల మిలట్రీ సలహాదారులు శిక్షణ ఇస్తున్నాయని, సిరియాలో తిష్ట వేసి టెర్రరిస్టులను నడిపిస్తున్నారని సిరియా ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. అలెప్పో నగరంలో బంకర్లలో దాగిన అమెరికా,…

50 కాదు 70 రోజులు ఆగాలి, మాట మార్చిన కేంద్రం

  “50 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది” అని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. మొన్న సుప్రీం కోర్టులో కూడా “మరో 15 రోజుల్లో కరెన్సీ పరిస్దితి పూర్తిగా మెరుగు పడుతుంది” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కానీ అదే రోహత్గి మరుసటి రోజే మాట మార్చేశారు.  “70 రోజుల వరకు ప్రజలు సహనం పాటించాలి. అసౌకర్యాన్ని భరించాలి. ఎందుకంటే 70 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం నల్ల ధనం, అవినీతిలపై…

నోట్ల రద్దు ఆర్‌బి‌ఐ ప్రతిష్టను మంటగలిపింది -ఎస్&పి

డీమానిటైజేషన్ పరిణామాలు, ఫలితాలపై నివేదిక  వెలువరించిన అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ ఎస్&పి పలు అంశాలను తన నివేదికలో పొందుపరిచింది. వాటిలో ఒకటి: అనేక యేళ్లుగా నిక్కచ్చి పని విధానంతో, ఉన్నత స్ధాయి ప్రమాణాలతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమానిటైజేషన్ వల్ల ఒక్కసారిగా పరువు పోగొట్టుకుందని చెప్పడం. “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య సెంట్రల్ బ్యాంకు సమర్ధత, స్వతంత్రతలను మంటగలిపింది” అని ఎస్&పి తన నివేదికలో పేర్కొంది.…

నోట్ల రద్దు విధ్వంసం 2018 వరకూ… -ఎస్&పి

“యాభై రోజులు ఓపిక పట్టండి. కష్టాలు అన్ని తీరుతాయి” అని ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రవేశపెడుతూ హామీ ఇచ్చారు. “మరో 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది” అని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి డిసెంబర్ 2 తేదీన సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. “ప్రజలు ఎన్నాళ్ళు ఇలా క్యూల్లో నిలబడాలి? ఈ ‘అసౌకర్యం’ ఎన్నాళ్ళు భరించాలి?” అని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనానికి సమాధానం ఇస్తూ రోహత్గి ఈ భరోసా…

మోడి అవినీతి బైటపెడతా -రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన వద్ద ఒక రహస్యం ఉన్నదని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమో అన్న భయంతో తనను లోక్ సభలో అధికార పక్ష సభ్యులు మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న రహస్యం “మోడి వ్యక్తిగతంగా పాల్పడిన అవినీతికి సంబంధించినది” అని ఆయన ఈ రోజు చెప్పారు. పార్లమెంటులో, ముఖ్యంగా లోక్ సభలో ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదో అర్ధం కాకుండా…