భారత్ రాయబార విజయం, తిరిగి రానున్న ఇటలీ మెరైన్లు

ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…

తమిళనాట ఇపుడు యు.పి.ఎ భాగస్వామి ఎవరు? -కార్టూన్

– డిఎంకె తెగతెంపులు చేసుకోవడంతో యుపిఎలో తమిళనాడు స్ధానం సీటు ఖాళీ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో తమిళనాడులో ఖాళీ అయిన సీటును భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. తెలియని ప్రేమికుడి కోసం తమిళనాడు (T) గేటు వద్ద ఆ పార్టీ మోహ గీతాలు ఆలపిస్తోందని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఆ గీతాలకు స్పందించే వారు దొరక్కపోరు. వాడుకుని వదిలేయడం భారత పాలకులకు కొత్త…

శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…

గూఢచర్యం: చైనా అమ్మాయితో అమెరికన్ అణు రొమాన్స్

– అమెరికా, చైనాల వైరుధ్యాలు క్రమంగా వివిధ రంగాలలో ప్రస్ఫుటంగా ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం అడపాదడపా గౌరవం ప్రకటించుకుంటూనే ఒకరిపై మరొకరు గూఢచర్యానికి పాల్పడడం అగ్ర దేశాలకు కొత్త కాకపోయినా, చైనా అణు గూఢచర్యం వెల్లడి కావడం ఇదే ప్రధమం కావచ్చు. అమెరికాకు చెందిన ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అమెరికా అణు రహస్యాలను ఒక చైనా అమ్మాయికి అందజేసి దొరికిపోయాడని ఫెడరల్ పోలీసు సంస్థ ఎఫ్.బి.ఐ ప్రకటించింది. డిఫెన్స్ కాంట్రాక్టర్ హవాయ్ ద్వీపంలో అమెరికా…

ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

నీరుగారిన అత్యాచార వ్యతిరేక చట్టం?

సోమవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం అత్యాచార వ్యతిరేక చట్టం మరింత నీరుగారినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మెరుగుగానే ఉన్నప్పటికీ ఇతర అంశాలలో రాజకీయ పార్టీల ఒత్తిడితో చట్టాన్ని బలహీనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో బిల్లు చట్టంగా రూపొందడం పైన సందిగ్ధత ఏర్పడింది. అంగీకార వయసు…

మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం

– భారత సుప్రీం కోర్టు సోమవారం ఉగ్రరూపం దాల్చింది. హామీని ఉల్లంఘించిన ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని పైన విరుచుకుపడింది. దేశం విడిచి వెళ్లరాదని మార్చి 14 తేదీన తాము ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. వియన్నా సదస్సు లో అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ రాయబారులకు వర్తించే ‘నేర విచారణ నుండి మినహాయింపు‘ (immunity) డేనియల్ కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక పిటిషనర్ గా కోర్టులో ఒక ప్రక్రియను ప్రారంభించిన…

మావో మూడు ప్రపంచాలు -ఈనాడు ఆర్టికల్ 5వ భాగం

ఈ రోజు ఈనాడు చదువు పేజిలో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ ఐదవ భాగం వచ్చింది. ఇందులో మధ్య ప్రాచ్యం, బ్రిక్స్, బేసిక్, మూడు ప్రపంచాల సిద్ధాంతం తదితర అంశాలను చర్చించబడింది. ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్  క్లిక్ చేస్తే ఆ పేజికి వెళ్లొచ్చు. కింద బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చదివచ్చు.

హాకీ ప్రత్యర్థి పాక్ ఐతే మన టీం సభ్యులు డజను -కార్టూన్

హాకీ ఆటలో ఒక్కో టీం లో ఎంతమంది సభ్యులు ఉంటారు? లెక్క ప్రకారం అయితే 11 మంది. భారత్ ప్రత్యర్థి పాకిస్ధాన్ ఐతే మాత్రం మనవాళ్లు 12 మంది ఆడుతారు. ఫీల్డ్ లో ఆడేది 11 మందే అయినా భారత టీం లో మరో అదృశ్య ప్లేయర్ తప్పనిసరిగా ఉంటారు. వారే మన విదేశాంగ శాఖ (Ministry of External Affairs – MEA). ఆటను ఆటగా ఉండనిస్తేనే అందం. ఆటలో ప్రభుత్వాలు, వారి తరపున రాజకీయ…

హిందూయిజం అసలు మతమే కాదు -ఆదాయపన్ను శాఖ

ఆదాయపన్ను ఎగవేయడం కోసం మత విశ్వాసాలను కూడా కాలదన్నుకుంటున్న విచిత్ర పరిస్ధితి! ఆ ట్రస్టు కార్యక్రమాలన్నీ మతపరమైనవే. కానీ ఆదాయపన్ను మినహాయింపు కోసం హిందూమతాన్ని మతం కాదనీ, హిందువులు మతావలంబకులు కాదని వాదిస్తోంది. శివుడు అసలు దేవుడే కాదని, ఆ మాటకొస్తే దేవుడి శిల్పాలు ఉన్నంత మాత్రాన అది దేవాలయం కాదని కూడా ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ వాదనను అంగీకరించి ఆదాయపన్ను శాఖ…

ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి. కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు…

ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన

జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన…

సిక్సర్ సిద్దూయిజం: అది ఆల్టిట్యూడ్ కాదు, యాటిట్యూడ్

క్రికెట్ ఆటలోనే కాక క్రికెట్ కామెంటరీలో కూడా తనదైన బాణీ సృష్టించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దు శనివారం కలకాలం గుర్తుంచుకోదగ్గ మాటలు చెప్పాడు. టెస్ట్ మ్యాచుల్లో సైతం సిక్సర్లతో విరుచుకుపడి ‘సిక్సర్ సిద్దు’గా పేరుగాంచిన నవజ్యోత్ సింగ్ సిద్దు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కామెంటరీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక ఇండియా కొత్త ఓపెనింగ్ జంటతో ఆట ప్రారంభించింది. శిఖర్ ధావన్ ఈ మ్యాచ్…