విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?

తాగి ఎటు వెళుతున్నాడో తెలియని స్ధితిలో సరిహద్దు దాటాడని అతని కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. పాక్ భూభాగం లోని పంజాబ్ రాష్ట్రంలో 1990లో జరిగిన వరుస పేలుళ్లకు కుట్ఱ పన్నాడని పాకిస్ధాన్ ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్ధానం ఆరోపించి మరణ శిక్ష కూడా వేశేసాయి. ఆయన్ని విడిచి పెట్టాలని, కనీసం క్షమాభిక్ష అయినా పెట్టాలని కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి వేడుకుంటుండగానే సరబ్ జిత్ సింగ్ గురువారం ప్రాణాంతక దాడికి గురై తీవ్ర స్ధాయి కోమాలోకి వెళ్ళిపోయి…

ముంబై: బాలికకు మత్తు ఇచ్చారు, ఆపైన….

క్రెడిట్ అంతా ఢిల్లీకే పోతోందనుకుందో ఏమో గాని ఈసారి బాలికపై అత్యాచారానికి ముంబై ముందుకొచ్చింది. ముంబై దారుణం ఏమిటంటే చిన్న పిల్ల మీద నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడడం. ముంబైలోని వకోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ పైశాచికం చోటు చేసుకుంది. నిందితులంతా 20-25 సంవత్సరాల మధ్య వయసు వారు. పుట్టిన రోజు పార్టీకని నిందితుల్లో ఒకరి స్నేహితురాలి చేత బాలికను ఇంటికి పిలిపించుకుని మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు.…

చిట్ ఫండ్ మోసానికి మమత పొగాకు పరిష్కారం -కార్టూన్

జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి…

వాళ్ళకి చెప్పే రాశాం, సుప్రీం కోర్టులో సి.బి.ఐ సంచలన వెల్లడి

బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు సాక్షిగా సి.బి.ఐ కాంగ్రెస్ ధరించిన మేకప్ ను కడిగేసింది. న్యాయ శాఖ మంత్రి కోరిక మేరకు ఆయనకు చూపించిన తర్వాతే బొగ్గు కుంభకోణం స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించామని కాంగ్రెస్ ముసుగు విప్పి చూపింది. న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు కూడా తమ నివేదికను చూశారాని సి.బి.ఐ స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు…

ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా…

గూగుల్, ఫేస్ బుక్ లు పిల్లలకు ఎలా చేరువగా ఉన్నాయి? -కోర్టు ఆరా

ఇంటర్నెట్ లో సామాజిక కార్యక్రమాల ముసుగు ధరించే ఐ.టి వ్యాపార కంపెనీల వ్యవహారం పైన భారత దేశంలోని కోర్టులు కొరడా ఝళిపించడానికి సిద్ధం అవుతున్నాయి. చట్టబద్ధ మైన వయసు 18 సంవత్సరాల లోపలి పిల్లలకు ఫేస్ బుక్, గూగుల్ సామాజిక వెబ్ సైట్లు పిల్లలకు ఎలా అందుబాటులో వస్తున్నాయో వివరించాలని ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చట్టాలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల వినియోగదారుల వ్యక్తిగత వివరాల డేటాను అమెరికా కంపెనీలు అమెరికాకు పంపిస్తున్నాయని తద్వారా…

బాధ్యత ఆగేది ఇక్కడ (కాదు) -కార్టూన్

1945-53 మధ్య అమెరికా అధ్యక్షుడుగా పని చేసిన హేరి ఎస్. ట్రూమన్ టేబుల్ మీద ఒక సైన్ బోర్డు ఉండేది. దాని పైన ‘THE BUCK STOPS HERE” అని రాసి ఉండేది. దానర్ధం ‘నా పాలనలో ఏం జరిగినా బాధ్యత నాదే’ అని. తన అధ్యక్షరికంలో తప్పులు జరిగినా అందుకు బాధ్యత మరొకరి మీదికి నెట్టననీ, తానే స్వీకరిస్తానని సదరు సైన్ బోర్డు ద్వారా ట్రూమన్ చెప్పదలిచాడు. (ఆ విధంగా యుద్ధం ఎలాగూ ముగుస్తుందనుకుంటున్న సమయంలో…

మరో పాపని చంపేశారు, ఈసారి జార్ఖండ్ లో…

పసి పాపల పైన అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా జార్ఖండ్ చేరిపోయింది. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ళ బాలిక బుధవారం అత్యాచారానికి గురయింది. అత్యాచారం సంగతి బైటికి వస్తుందన్న ఉద్దేశ్యంతో పాపని గొంతు పిసికి చంపేశారు. నిందితుడు ఎవరైందీ ఇంకా ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును కేస్ డైరీలో నమోదు చేసిన పోలీసులు వాళ్ళకి, వీళ్ళకి సమాచారం ఇవ్వడం తప్ప స్వయంగా వెతకడానికి పూనుకోలేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అత్యాచారం జరిగిందని భావించడానికి ప్రాధమిక సాక్ష్యాధారాలు…

బాలికలపై అత్యాచారాలు, కదిలించే కార్టూన్లు

ఏప్రిల్ 15 తేదీన ఇద్దరు యువకులు పీకల్దాకా తాగి కన్నూ మిన్నూ కానని మదాన్ని నిలువెల్లా నింపుకున్నారు. కాపు కాసి, చాక్లెట్ ఆశ చూపి అయిదేళ్ళ పాపను తమ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యంత పాశవిక రీతిలో అత్యాచారం చేశారు. ఏప్రిల్ 17 తేదీన కూడా ఇలాగే మరో ఐదేళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పిలిచి అత్యాచారం చేశాడొక మధ్య వయస్కుడు. పనయ్యాక పాపని పొలాల్లో పారేసిపోయాడు. ఆ పాప ఇప్పుడు పూనాలో ఒక ప్రైవేటు…

మహిళలపై నేరాలు -గ్రాఫిక్స్

2012, 2013 సంవత్సరాలకు గాను జనవరి 1 నుండి ఏప్రిల్ 15 వరకు భారత దేశంలో మహిళలపై జరిగిన వివిధ నేరాలను పోల్చుతూ పి.టి.ఐ వార్తా సంస్ధ ఈ క్రింది గ్రాఫిక్స్ ను తయారు చేసింది. ది హిందు పత్రిక అందజేసిన ఈ గ్రాఫిక్స్ లో వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులు సమీప బంధువులు, తెలిసినవారేనని ఈ వివరాల ద్వారా తెలుస్తున్నది. 2013లో ఇప్పటి వరకు 1869 నేరాలు మహిళలపై…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు

ఒకరో, ఇద్దరో నాయకులైతే నాలుగు మాటలతో విమర్శించి ఛీ, ఛీ అని ఊరుకుంటాం. ఒకసారి, రెండు సార్లు అయినా ‘సరికాదు, సవరించుకోండి’ అని చెబుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు గుంపంతా అదే బాపతైతే ఎన్ని విమర్శలు చేయాలి. ఎన్ని ఛీ, ఛీలు కొట్టాలి, ఎన్నిసార్లు సవరించుకోమని చెప్పాలి!? మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన ఓ పెద్ద మనిషి మహిళలు ఆహ్వానించే విధంగా చూడకపోతే మగాళ్లు అసలు వారినేమీ ఇబ్బంది పెట్టరు…

2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…

బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ

బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం…